Andhra Pradesh

News October 1, 2024

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరులో క్రిష్టప్ప అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. పొలంలో విద్యుత్ స్టాటర్ పెట్టె వద్ద క్రిష్టప్పకు షాక్ కొట్టి మృతిచెందారని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు.

News October 1, 2024

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఇరగవరం విద్యార్థి

image

ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గూనా గౌరిదానేశ్వరి రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలకు ఎంపికైంది. మంగళవారం భీమవరంలో పీఎస్‌ఎం బాలికల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో స్వర్ణాంధ్ర 2047 జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.

News October 1, 2024

కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు మహాత్మా గాంధీ లీడర్‌షిప్ అవార్డు

image

యూకేలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మ్యూజియంలో NRI వెల్ఫేర్ సొసైటీ వారు అందించే మహాత్మా గాంధీ లీడర్‌షిప్ అవార్డుకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఎంపికయ్యారు. విశిష్ఠ అవార్డుకు దేశంలోని నిర్మాణ రంగంలో, సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్న SR కన్‌స్ట్రక్షన్స్ ఛైర్మన్ సురేంద్ర బాబును ఎంపికచేశారు. అవార్డను గాంధీ జయంతి అక్టోబర్ 2న అందుకోనున్నారు.

News October 1, 2024

నెల్లూరు: ఈ నెల 3వ తేదీ నుంచి 21 వరకు టెట్ పరీక్షలు: DRO

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని డీఆర్వో లవన్న అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో టెట్ పరీక్షల నిర్వహణపై సమన్వయ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 4 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

News October 1, 2024

సీఎం స‌మ‌క్షంలో హామీ ఇచ్చిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

క‌ర్నూలు జిల్లాలో త్వ‌ర‌లోనే ట‌మోటా ప్రాసెసింగ్ యూనిట్ నెల‌కొల్పుతామ‌ని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. పత్తికొండ మండలం పుచ్చ‌కాయ‌ల‌మ‌డలో సీఎంతో క‌లిసి ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ట‌మోటా పంట‌ను ఎక్కువ‌గా సాగు చేస్తార‌న్నారు. యూనిట్ నెల‌కొల్పేందుకు ఉన్న వివాదాల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం స‌మ‌క్షంలో చెప్పారు.

News October 1, 2024

నెల్లూరు: నూతన ఎక్సైజ్ పాలసీ గెజిట్ విడుదల

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 182 మద్యం షాపుల లైసెన్స్ జారీకి ఎక్సైజ్ డీసీటీ శ్రీనివాసరావు గెజిట్ విడుదల చేశారు. 2024 నుంచి 2026 వరకు ప్రైవేట్ మద్యం దుకాణాలు నిర్వహించే లైసెన్సుల జారీ కోసం అక్టోబర్ 1 నుంచి 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. 11వ తేదీ కస్తూర్బా కళాక్షేత్రంలో డ్రా తీస్తామన్నారు. అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

News October 1, 2024

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసింది శూన్యం: శైలజానాథ్

image

కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు అనంతపురం జిల్లాలో కరువులో చిక్కుకున్న రైతులకు చేసిన సహాయం శూన్యమని మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల్లో అరాకోరాగా పంటలు సాగుచేసిన రైతులకు కూడా పంటలు ఎండిపోతుంటే.. ప్రభుత్వాలు రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. వెంటనే కరువు రైతులను ఆదుకోవాలన్నారు.

News October 1, 2024

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి

image

వైవీయూ ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా తెలుగు విభాగం ప్రొఫెసర్ తప్పెట రామప్రసాద్ రెడ్డిని నియమించారు. మంగళవారం సాయంత్రం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్, ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి తన ఛాంబరులో నియామక పత్రం అందజేశారు. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న ఆచార్య రఘునాథరెడ్డి రిలీవ్ అయ్యి ప్రధాన ఆచార్యులుగా కొనసాగనున్నారు. నూతన రిజిస్ట్రార్‌కు బోధన, బోధ నేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

News October 1, 2024

జాతీయ స్థాయి పోటీలకు పత్తికొండ విద్యార్థి ఎంపిక

image

పత్తికొండ ఏపీ మోడల్ స్కూలు సీఈసీ రెండో ఏడాది విద్యార్థి బోయ తేజేశ్వర్ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్, పీడీ రాజశేఖర్ నాయక్ తెలిపారు. విద్యార్థిని కళాశాల బృందం అభినందించింది.

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.