India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేపాడ మండలం చామలాపల్లి నుంచి వెంకయ్యపాలెం వెళ్లే రహదారిలో అరిగివాని చెరువు కల్లాల వద్ద గిరినాగు శుక్రవారం రాత్రి కనిపించింది. స్థానిక రైతులు గుర్తించి వన్యప్రాణుల సంరక్షణ సమితి ప్రతినిధి వరపుల కృష్ణకు సమాచారం అందించారు. కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని 16 అడుగుల గిరినాగును గోనెసంచిలో బంధించాడు. ఉదయాన్నే అటవీ ప్రాంతంలో వదిలేస్తామని చెప్పటముతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
పాకిస్థాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని వీసాలు ఏప్రిల్ 27తో, వైద్య వీసాలు ఏప్రిల్ 29తో రద్దు అవుతాయని విశాఖ CP శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖలో ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే వారి దేశానికి వెళ్ళిపోవాలన్నారు. అక్రమంగా ఎవరైనా నివసిస్తన్నట్లు గుర్తిస్తే వారితో పాటు వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
వీరయ్య చౌదరి హత్య కేసులో కీలకంగా దొరికిన స్కూటీ ఆధారంగా కేసు పురోగతి ఊపందుకుంది. అమ్మనబ్రోలుకు చెందిన వ్యక్తి ఈ హత్యలో కీలకంగా వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ గ్రామం పోలీసుల కనుసన్నల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఈ నెల 29వ తేదీన అమెరికాకు వెళ్లటానికి టికెట్స్ కూడా బుక్ చేసుకోగా స్కూటీ ఆధారంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చెల్లెలు మరణాన్ని తట్టుకోలేక అన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుగొండ మండలం సిద్ధాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధాంతంకు చెందిన ఈ.లక్ష్మీనరసింహ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని చెల్లెలు అనారోగ్యంతో బాధపడుతూ ఉరివేసుకుంది. అది తట్టుకోలేక లక్ష్మీనరసింహ ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
పామిడిలో తీవ్ర ఎండలకు మానవులతోపాటు పశు, పక్షాదులు తీవ్ర దాహంతో అల్లాడిపోతున్నాయి. దాహర్తిని తీర్చుకోవడానికి, మంచి నీటితోపాటు చల్లని పానీయాలతో ఐస్ క్రీమ్ల కోసం మనుషులు ఎగబడుతున్నారు. రహదారిపై ఐస్ తింటూ వెళ్లేవారి వద్ద ఐస్ లాక్కుని తల్లీ బిడ్డా ఐస్ తింటున్న ఫోటో ఇది.
సీఎం చంద్రబాబు శనివారం విశాఖ రానున్నారు. ఉదయం 11.25కి విశాఖ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళ్తారు. శ్రీకాకుళంలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడి నుంచి సాయంత్రం 5.45కి విశాఖ చేరుకుంటారు. సాయంత్రం ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు బయలుదేరి 7:25 కు షాప్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు.
అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో NCORD జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ జగదీష్తో కలిసి కలెక్టర్ వినోద్ కుమార్ శుక్రవారం నిర్వహించారు. నేరాలు, అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం ఉన్న నిర్దిష్ట పెద్ద కేసుల కార్యాచరణ విషయాలపై చర్చించారు. మాదకద్రవ్యాల గుర్తింపు కోసం డాగ్ స్క్వాడ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా, పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులతో, ఎపీఐఐసీ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో అమలు అవుతున్న ఆంధ్రప్రదేశ్ సింగిల్ డెస్క్ పాలసీ 2015, ప్రధానమంత్రి ఉపాధి కల్పన వాటిపై సమీక్ష నిర్వహించారు.
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ఓ రఘురామిరెడ్డి వైద్యాధికారిణి సుజాత ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేశారు. దోమలు పుట్టకూడదు అని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరు దోమ తెరలు వాడాలన్నారు. ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
చెత్త, మంచినీటి పన్ను వసూళ్లలో ప.గో.జిల్లా రెండో స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఎంపికకు 26 జిల్లాలు పోటీపడగా, మన జిల్లాకు రెండో స్థానం రావడం ఆనందంగా ఉందని అన్నారు. 24న గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ అవార్డును జిల్లా పంచాయతీరాజ్ అధికారి అరుణశ్రీ అందుకున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ సిబ్బందిని ఆమె అభినందించారు.
Sorry, no posts matched your criteria.