India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కోడూరు సచివాలయం-2 పరిధిలో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న నాగేంద్రబాబును విధుల నుంచి తొలగించినట్లు కోడూరు ఎంపీడీవో ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలలో అతను పాల్గొన్నారని సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ మేరకు గురువారం వాలంటీర్ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో తెలియజేశారు.

తూ.గో జిల్లాలో పలు భద్రతా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి గౌరవం దక్కింది. ఉగాది పురస్కారాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రం గురువారం రాత్రి విడుదల చేశారు. డీసీఆర్బీలో పనిచేస్తున్న ఏఎస్ఐ బీవీఆర్ వర్మకు ఉత్తమ సేవా పథకం లభించింది. ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్ జే.శ్రీనివాసరావు, కొవ్వూరు పీఎస్లో పనిచేస్తున్న హెచ్సీ కె.శ్రీనివాసరావు, ఉండ్రాజవరం పీఎస్లోని హెచ్సీ వై.నాగేశ్వరరావు ఉన్నారు.

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్కు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎ.చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 ఫీజు చెల్లించి https://polycetap. nic.in ద్వారా వచ్చే నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.

ఎన్నికల కోడ్, సెక్షన్ 144 సీఆర్పీ అమలులో ఉన్నందున ఏవైనా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, సభలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ మేరీ ప్రశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సువిధ యాప్లో పూర్తి సమాచారంతో ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకే గ్రామంలో ఒకే సమయంలో ఏ రెండు పార్టీలకు సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతించమని తెలిపారు.

ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నవ్య అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కు గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన నవ్య ఇక్కడ చదువుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎంపీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ టీడీపీ నాయకులలో నెలకొంది. హిందూపురం అభ్యర్థిగా బీకే పార్థసారథి, అనంతపురం అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్ రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారిక ప్రకటనలో వారి పేర్లు ఉంటాయా..? లేదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.

ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక పోలింగ్ కేంద్రంలో పూర్తిగా విభిన్న ప్రతిభావంతులనే నియమించాలని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల విధులు కేటాయిస్తామన్నారు. ఉద్యోగుల వివరాలు ఎన్ఐసీ పోర్టల్లో నమోదు చేసిన అనంతరం అధికారులు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు.

జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను మే 16 నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ ఛైర్మన్, ఉప కులపతి జీవీఆర్ ప్రసాద్ రాజు గురువారం తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత షెడ్యూల్ ను సవరించినట్లు పేర్కొన్నారు. సెట్ కు సంబంధించి సందేహాలు ఉంటే 0884 2359599, 0884 2342499 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను https://vizianagaram.ap.gov.in/ వెబ్సైట్లో పొందుపరిచామని ఐసీడీఎస్ పీడీ బి. శాంతకుమారి తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే శుక్రవారం సాయంత్రంలోగా లిఖిత పూర్వకంగా తెలియజేయాలని కోరారు.

శ్రీకాకుళం నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా TDP ఆరుసార్లు గెలిచింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ధర్మానప్రసాద్ రావు.. టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై విజయం సాధించారు. ఈసారి YCP తరఫున ధర్మానకే టిక్కెట్ ప్రకటించారు. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. ఉమ్మడి అభ్యర్థిగా ఎవరుంటే ధర్మానకు పోటీగా నిలిస్తారని మీరు భావిస్తున్నారు?
Sorry, no posts matched your criteria.