India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజధాని ప్రాంతంలో శనివారం CPM సీనియర్ నేత బాబురావు ఆయన బృందంతో పర్యటించనున్నారు. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములను పరిశీలించి ఎంత మేరకు నిర్మాణాలు జరిగాయని మీడియాతో మాట్లాడనున్నట్లు CPM నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మే నెల 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో CPM ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లాలో నూనె గింజల ఉత్పత్తి పెంపుకు జేసీ డా.బి.నవ్య అధికారులకు సూచనలు ఇచ్చారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ జేసీ ఛాంబర్లో ఆయిల్ సీడ్స్ కన్వర్జెన్సీ సమావేశంలో జేసీ మాట్లాడారు. క్రిషోన్నతి పథకం కింద 5 ఏళ్లలో ఉత్పత్తి పెంచాలని, 1000 హెక్టార్ల భూమిలో పంటలు సాగు చేసి, రైతులను క్లస్టర్లుగా ప్రోత్సహించాలని సూచించారు. ఎఫ్పీఓల ద్వారా విత్తనాలు, లోన్లు, శిక్షణ అందించాలని ఆదేశించారు.
జిల్లా డీపీఆర్వోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతిని ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోని తీసుకుని వెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ డీపీఆర్వోకి సూచించారు.
రానున్న నెల మే 10న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ను జూలై 5వ తేదీకి వాయిదా పడింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా శుక్రవారం తెలిపారు. కక్షిదారులు, న్యాయవాదులు, ప్రభుత్వ, బ్యాంకు, బీమా, పోలీసు శాఖల అధికారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
నెల్లూరు జిల్లాలో వినియోగదారుల నుంచి గ్యాస్ డెలివరీ బాయ్స్ అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆదేశించారు. తన కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీదారులతో సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు బుకింగ్ చేసిన వెంటనే సిలిండర్ డెలివరీ చేయాలని సూచించారు. మీ ఏరియాలో సిలిండర్కు ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుంటే, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వేసవి సెలవులు ప్రకటించాయి. కానీ అదే సమయంలో ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం బ్రిడ్జ్ కోర్సుల పేరుతో విద్యార్థులపై హాజరు ఒత్తిడి తెస్తున్నారు. ఉదయం నుంచి మిడ్డే వరకు మండే ఎండలో తరగతులు సాగుతున్నాయి. ఇరు వైపుల ఒత్తిడితో విద్యార్థులు విసుగెత్తిపోతుండగా, తల్లిదండ్రులు అధికారుల జోక్యం కోరుతున్నారు.
ఈనెల 28వ తేదీన రాజధాని ప్రాంతంలోని వృత్తి యూనివర్సిటీకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు VIT విశ్వవిద్యాలయంలో ప్రారంభోత్సవం చేయనున్న మహాత్మా గాంధీ బ్లాక్ను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తేజ, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మే 2న రాజధాని అమరావతికి రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను శుక్రవారం పలువురు అధికారులు పరిశీలించారు. పార్కింగ్, వీఐపీ పార్కింగ్ వద్ద బారీకేట్స్, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జి.సతీశ్ కుమార్, సెక్రెటరీ బీసీ వెల్ఫేర్ మల్లిఖార్జున, ఎండీ మెప్మా తేజ్ భరత్, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, ఎస్పీ సతీశ్ కుమార్, తదితరులు ఉన్నారు.
➤ఆదోని: పెహల్గాం ఉగ్రదాడిపై ఎమ్మెల్యే తీవ్ర ఖండన➤కర్నూలు జిల్లాలో మర్డర్..?➤గోరుకల్లు సమస్యలు పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే➤కర్నూలు: 4,348 మందికి జూన్ 1న ఫైనల్ పరీక్ష➤కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!➤ప్రియురాలి కోసం భార్యను చంపాడు!➤ఉగ్రదాడికి నిరసనగా ఆదోనిలో బంద్ పాటించిన వ్యాపారులు➤నూనె గింజల ఉత్పత్తికి ప్రోత్సాహం:జేసి➤పెద్దకడబూరు: పంచాయతీ కార్యదర్శుల కొరతతో ఇబ్బందులు.
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్(55) హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని పొలాల్లో రక్తగాయాలతో పడి ఉన్న వెంకటేశ్ను గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన వ్యక్తికి వ్యక్తిగత కక్షలు, గ్రామంలో తగాదాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.