Andhra Pradesh

News October 1, 2024

విశాఖలో అంతర్జాతీయ గోల్ఫ్ టోర్నమెంట్

image

విశాఖ నగరంలోని ముడసర్లోవ ఈస్ట్ పాయింట్ గోల్డ్ క్లబ్ మరో అంతర్జాతీయ గోల్డ్ టోర్నమెంటుకు వేదికయ్యింది. ఈ మేరకు మంగళవారం నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యంత ప్రతిష్టాత్మక ది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) పేరుతో రెండు నుంచి 5వ తేదీ వరకు టోర్నమెంట్ నిర్వహించనుంది. ఈ పోటీలో దేశ విదేశాల నుంచి క్రీడాకారులు పాల్గొనున్నారు. విజేతలకు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

News October 1, 2024

వైసీపీలో తాడేపల్లిగూడెం నాయకుడికి కీలక బాధ్యతలు

image

వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వడ్డీ రఘురాం నాయుడును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో రఘురాం నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

News October 1, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు

image

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ షేక్షావలి తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు కర్నూలు స్టేడియంలో జరిగిన ఎంపికలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. తబస్సుమ్ (రగ్బీ), చరణ్ (ఖోఖో), సుధీర్ (కబడ్డీ), షాలెంరాజు (త్రోబాల్), పూజిత (రగ్బీ) ప్రతిభ కనబరిచారన్నారు.

News October 1, 2024

రాజానగరం: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్

image

నన్నయ విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోని భర్తీ చేయని సీట్లకు ఈనెల 5న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఐసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాలలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు.

News October 1, 2024

ఉమ్మడి కృష్ణాలో నూతన మద్యం దుకాణాలకు గెజిట్ విడుదల

image

నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి కృష్ణాలో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు విడుదల చేశారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో గెజిట్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 113, కృష్ణాజిల్లాలో 123 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరించి 11న టెండర్లు ఖరారు చేస్తారు.

News October 1, 2024

రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది..?: బొత్స

image

ఆంధ్ర రాష్ట్రంలో అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం విశాఖ వైసీపీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. మద్యంపై దృష్టి పెట్టి పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తోందని అన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News October 1, 2024

అనంత: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు దుర్మరణం

image

రాయదుర్గం మండలం టీ.వీరాపురం సమీపంలో రాయదుర్గం-కణేకల్లు ప్రధాన రోడ్డుపై రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సాయంత్రం సుమారు 4.50 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు విడపనకల్లు మండలం పాల్తూరుకు చెందిన బొమ్మన్నగా స్థానికులు గుర్తించారు.

News October 1, 2024

పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్, ఎస్పీ

image

మచిలీపట్నంలోని 28వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంగళవారం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ DK బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధర్ పంపిణీ చేశారు. ఈ మేరకు డివిజన్‌లో ఉన్న పలువురు లబ్ధిదారుల వద్దకు వెళ్లిన మంత్రి, జిల్లా ఉన్నతాధికారులు వారి యోగక్షేమాలను కనుక్కున్నారు. అనంతరం వారికి అక్టోబర్ నెల పింఛన్‌ నగదును అందజేశారు.

News October 1, 2024

శ్రీకాకుళం: మొదలైన మద్యం అమ్మకాలు

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైన్ షాప్‌లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఉదయం నుంచి సేల్స్ మాన్‌లు, సూపర్వైజర్‌లు మద్యం అమ్మకాలు చేపట్టకుండా సమ్మె చేశారు. జిల్లాలో 193 ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసిన సేల్స్ మెన్‌లు, సూపర్వైజర్ల కాంట్రాక్ట్ నిన్నటితో ముగిసింది. వీరితో చర్చించి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు చేపట్టాలని సూచించడంతో 5గంటలనుంచి ప్రారంభించారు.

News October 1, 2024

కర్నూలు: సీఎం చంద్రబాబు వరాల జల్లు

image

పత్తికొండ మం. పుచ్చకాయలమడకు CM చంద్రబాబు వరాలు కురిపించారు. 203 మందికి ఇళ్ల మంజూరు, 48 మందికి కొత్త పెన్షన్లు, 15 రేషన్ కార్డులు, ఐదుగురికి NREGC జాబ్ కార్డులు, 3 రేషన్ కార్డులు మంజూరు. 135 ఇళ్లకు ట్యాప్, ఒక ఇంటికి కరెంటు కనెక్షన్, 105 ఇళ్లకు మరుగుదొడ్లు, 1.7 KM డ్రైనేజీ కాలువ, 10.7 KM CC రోడ్డు, 22 మినీ గోకుళాలు.. వీటన్నింటికీ రూ.2.83 కోట్లు మంజూరు. మద్దికెర, పత్తికొండ, హోసూరుకు రోడ్లనిర్మాణం.