India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 30న జరగనున్న సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై కలెక్టర్ ఛాంబర్లో మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్, ఆరోగ్య కేంద్ర శిబిరాలు, అన్న ప్రసాదం మంచినీరు వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ, దేవస్థానం ఈవో సుబ్బారావు ఉన్నారు.
ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను తీర్చిదిద్దాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో నాయకులు, అధికారులతో సమావేశమయ్యారు. దేశంలోనే అత్యధికంగా ఆదాయ వనరులున్న నగరంగా విశాఖను పేర్కొన్నారు. అభివృద్ధికి విశాఖలో అన్ని రకాల అవకాశాలున్నాయని, దానికి అనుగుణంగా ముందుకు సాగుదామన్నారు. అనంతరం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.
నెల్లూరులో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపింది. తూ.గో: కొవ్వూరుకు చెందిన జోసఫ్ రత్నకుమార్, ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన శ్రావణి 4రోజుల కిందట నెల్లూరులోని సింహపురి హోటల్లో గదిని తీసుకున్నారు. శుక్రవారం రూము నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టగా కుళ్లిన స్థితిలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. 3రోజుల కిందటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
విశాఖ డిఫెన్స్లో ఎమర్జెన్సీ ఇంటరాక్షన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండింగ్ ఇన్చీఫ్ రాజేష్ పెంధార్కర్ పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడితో ఈ ఇంటరాక్షన్కు ప్రాముఖ్యత సంతరించుకుంది. భద్రతకు సంబంధించి, ఎటువంటి సమయంలోనైనా అందుబాటులో ఉండాలని ఆయన ప్రతి సైనికుడికి తెలియపర్చడం చర్చనీయాంశంగా మారింది. భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్, గుంటూరు మిర్చి షేక్.రషీద్ (0) నేటి మ్యాచ్లో నిరాశ పరిచాడు. ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై) వేదికగా శుక్రవారం CSK-SRH జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఓపెనర్ బరిలో దిగిన రషీద్ మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు.
మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయం నుంచి వీఐపీ మార్గాలపై ఆకర్షణీయంగా తబలా ఆకారంలో పూల కుండీలను అమరావతి అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. ఏడీసీ ఛైర్పర్సన్ డి. లక్ష్మీపార్థసారథి ఆదేశాలతో గ్రీనరీ విభాగం అధికారుల నేతృత్వంలో ఈ పనులు పూర్తయ్యాయి. పూల కుండీలు మార్గాన్ని మరింత అందంగా మార్చుతూ, మోదీ పర్యటనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
నెల్లూరులో ప్రేమజంట మృతి కలకలం రేపింది. జోసఫ్ రత్నకుమార్(తూ.గో), శ్రావణి(కృష్ణా) నాలుగు రోజుల కిందట రైల్వే ఫీడర్స్ రోడ్డులోని సింహపురి హోటల్లో గదిని తీసుకున్నారు. ఈక్రమంలో శుక్రవారం రూము నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టగా కుళ్లిన స్థితిలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. మూడు రోజుల కిందటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
పేరుపాలెం తీరానికి వచ్చి సేద తీరుతూ అలల ఉదృతికి లోపలికి కొట్టుకుపోతున్న ఒక యువకుడుని తీరం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు రక్షించారు. శుక్రవారం ద్వారకాతిరుమలకు చెందిన వీరవల్లి మధు అనే యువకుడు పేరుపాలెం సాగర తీరానికి వచ్చాడు. మద్యాహ్నం సమయంలో సముద్ర స్నానం చేస్తూ అలల ఉదృతికి గురై కొట్టుకుపోతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్, హెచ్సీ హరి యువకుడిని కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు.
నెల్లూరులో మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేసిన నీటిని స్థానిక పరిశ్రమలకు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కమిషనర్ వైఓ నందన్ ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టు పరిసర పరిశ్రమల ప్రతినిధులు, కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నెల్లూరు పరిధిలో మూడు ప్రధాన మురుగునీటి శుద్ధి కేంద్రాల ద్వారా శుద్ధి చేస్తున్నట్లు చెప్పారు. వీటిని వ్యవసాయానికి ఉపయోగించవచ్చన్నారు.
పదో తరగతి ఫలితాలు దిగజారడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఓ ప్రకటనలో ఆరోపించారు. అమ్మ ఒడి రద్దు, ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం, ఇంగ్లిష్ మీడియంపై కక్ష, ఉపాధ్యాయుల తొలగింపు వంటి నిర్ణయాలే ఫలితాలు తగ్గడానికి కారణమని ఆయన విమర్శించారు. జగన్ హయాంలో విద్యా సంస్కరణలు, అమ్మ ఒడి వంటి పథకాలతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.
Sorry, no posts matched your criteria.