India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా DSC 2025 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల కోసం కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాల అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ అందించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 28గా ప్రకటించారు. ఆసక్తి కలిగిన వారు https://mdfc.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అనంతపురం కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి క్లైమ్ సెటిల్మెంట్ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని సంబంధిత జిల్లా అధికారులతో కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీపై వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మూడు రోజులు క్రితం బాధ్యతలు స్వీకరించిన గోపిని శుక్రవారం కలెక్టర్ డీకే బాలాజీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టులో జడ్జిని కలిసిన కలెక్టర్ మొక్కను అందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరు కొద్దిసేపు భేటీ అయి జిల్లాలో జరుగుతున్న పరిపాలనా అంశాలు, న్యాయ అంశాలపై చర్చించారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా అంశాలపై గన్నవరం విమానశ్రయంలో ప్రభుత్వ విభాగాల అధికారులు, విమానశ్రయ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండ్యన్, కలెక్టర్ డీ.కే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, S.P గంగాధర రావు, విమానశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శనివారం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలోని పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి నేతృత్వంలో పోలీసు బందోబస్తు విధి నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. నలుగురు ఏఎస్పీలు, ఎనిమిది మంది డిఎస్పీలతో సహా ఇతర పోలీసు అధికారులతో మొత్తానికి 1500 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు.
భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం రావడానికి ముందే 1944 మంగళగిరిలో చింతక్రింది కనకయ్య పేరుతో పాఠశాల ఏర్పాటు చేశారు. ఇది ఎయిడెడ్ స్కూల్ అయినప్పటికీ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు ఒకప్పుడు ఇక్కడి నుంచే వినిపించేవి. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య, పాస్ పర్సంటేజ్ దారుణంగా పడిపోవడం ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ పాఠశాలను మళ్లీ ముందు వరుసలో నిలబెట్టాలని ప్రజల కోరిక.
చిత్తూరు జిల్లాలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధి హామీ పథకం కింద 19 లక్షల పని దినాలు కల్పించడమే లక్ష్యమని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.62 లక్షల మందికి జాబ్ కార్డులు జారీ చేయగా, 4.80 లక్షల వేతనదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. కూలీలు వలస వెళ్లకుండా ఉన్న గ్రామంలో ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. కూలీల సంఖ్య మరో లక్షకు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
గుంటూరు జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో స్థిరమైన పురోగతి సాధిస్తోంది. కరోనా కాలమైన 2020, 2021ల్లో ప్రభుత్వం అందరినీ పాస్ చేసింది. 2022లో జిల్లాలో ఉత్తీర్ణత శాతం 68.20గా నమోదై రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. 2023లో అది 77.40కి పెరిగి 6వ స్థానంలో నిలువగా, 2024లో 88.14 శాతంతో 16వ స్థానానికి చేరింది. అయితే 2025లో మళ్లీ పరుగులు పెడుతూ 88.53 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.
గుంటూరు జిల్లాలో 2021 నుంచి ఫిబ్రవరి 2025 వరకు జరిగిన అగ్ని ప్రమాదాల్లో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. అగ్నిమాపక సిబ్బంది తెగువతో 72 మందిని కాపాడారు. 2019-25 మధ్య మొత్తం 3,456 ప్రమాదాలు నమోదు కాగా, రూ.212 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగింది. అదే సమయంలో రూ.276.22కోట్ల ఆస్తిని కాపాడగలిగారు. 2023-24లోనే అత్యధికంగా రూ.102.4కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది.
గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్కు సుప్రీంకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను శుక్రవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని హైకోర్టులోనే విచారించాలని స్పష్టం చేస్తూ బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. దీంతో బోరుగడ్డ అనిల్కు చట్టపరంగా భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
Sorry, no posts matched your criteria.