India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెనమలూరు TDP-జనసేన-BJP కూటమి MLA అభ్యర్థిగా దేవినేని చంద్రశేఖర్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ నారా లోకేశ్కి అత్యంత సన్నిహితుడు. ఇప్పటికే అధిష్ఠానం IVRS సర్వే కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. యువగళం సమయంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈయనకే ఈసారి టికెట్ ఇస్తారని విశ్వసనీయ సమాచారం.

పవన్ కళ్యాణ్పై MLA ద్వారంపూడి పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన MLA గా పోటీ చేయాలంటే చంద్రబాబు,MPగా పోటీ చేయాలంటే అమిత్ షా అనుమతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అయి ఉండి కూడా ఇటువంటి స్థితిలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. పిఠాపురంలో కాపు సమాజిక వర్గం ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్పై ప్రజలకు విశ్వాసం లేదని విమర్శించారు.

ప్రత్యర్థుల బలహీనతల కంటే సొంత పార్టీలోని అసమ్మతి నేతల తీరుపైనే విజయావకాశాలు ఉంటాయి. నగరిలో రోజాను YCP నేతలే వ్యతిరేకించినా ఆమెకే జగన్ టికెట్ ఇచ్చారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు వద్దని జనసేన, టీడీపీ నేతలు బాహటంగా చెబుతున్నారు. సత్యవేడులో ఆదిమూలాన్ని మార్చాలని, తంబళ్లపల్లెలో శంకర్కు టికెట్ ఇవ్వాలని నేతలు చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆయా చోట్ల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం గుంటూరు రైల్వే స్టేషన్కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. గుంటూరు నగరంలో వారు బస చేయడానికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉన్న ఇంటర్ కాలేజీలను కేటాయించారు. 650 మంది సిఆర్పిఎఫ్, 425 మంది ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు.

యలమంచిలి మండలం పులపర్తి హైవే జంక్షన్ వద్ద బుధవారం తెల్లవారుజామున ట్రాక్టర్ను ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.రాయవరం మండలం వొమ్మవరం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ షేక్ మీరా సాహెబ్(27) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని రూరల్ ఎస్సై సింహాచలం తెలిపారు.

అనంత :కేంద్ర ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు కోడ్ అమలు బాధ్యత అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధిత రిటర్నింగ్ అధికారులదేనని జిల్లా ఎన్నికలు అధికారి కలెక్టర్ గౌతమి పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోడ్లకు ఇరువైపులా, బస్టాండ్ రైల్వే స్టేషన్ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి రాజకీయ పరమైన హోర్డింగ్లు పోస్టర్స్ ఉన్న వెంటనే వాటిని తొలగించాలన్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించారు. తిరుపతిలో అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈక్రమంలో తమకు సీటు రాలేదంటూ కొందరు సహకరించడం లేదని తెలుస్తోంది. సీటు దక్కిన వారు సైతం ఇతర పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి విజయం సాధించాలంటే తప్పకుండా అన్ని పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే విజయావకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన గుడ్లూరు మండలంలోని రాళ్లవాగు వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు పొట్లూరు గ్రామానికి చెందిన ముసలయ్య, చలంచర్ల రమణయ్యలు బైక్ పై గుడ్లూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆగిన ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టారు. ఈప్రమాదంలో ముసలయ్య(29) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నంద్యాల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో మాజీ ఎంపీ మద్దూరు సుబ్బారెడ్డి మనవడు మద్దూరు హరి సర్వోత్తమరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల అయన PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ ఛైర్మన్గా, మంత్రిగా,
ఎమ్మెల్సీగా, నంద్యాల కాంగ్రెస్ ఎంపీగా పనిచేసిన మద్దూరు సుబ్బారెడ్డి సేవలు ఆయన మనవడికి కలిసొస్తుందని భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లా పరిధిలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలు ప్రకటించింది. నెల్లూరు సీఐడీ డీఎస్పీ కె.వేణుగోపాల్కు ఉత్తమ సేవాపతకం, ఉదయగిరి సీఐ ఎ.గిరిబాబు, దర్గామిట్ట, పొదలకూరు, చిన్నబజారు హెడ్ కానిస్టేబుళ్లు, కావలి అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న ఫైర్మెన్కు సేవా పతకాలు ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున వీటిని వాళ్లు అందుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.