Andhra Pradesh

News April 25, 2025

యలమంచిలి: వ్యక్తిని దారుణంగా చంపిన దంపతులు

image

యలమంచిలి మండలం కొంతేరులో కత్తుల పౌలు(59) <<16199598>>హత్యకు గురైన సంగతి తెలిసిందే<<>>. ఈ కేసుపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురెదురు ఇళ్లలో ఉంటున్న పౌలు, ఏసుదాసు కుటుంబాల మధ్య పాత కక్షలున్నాయి. బుధవారం రాత్రి పౌలు ఇంటికి వెళ్లిన ఏసుదాసు మంచంపై నిద్రిస్తున్న పౌలుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఇందుకు ఏసుదాసు భార్య భారతి కూడా సహకరించింది. నిందితులు ఏసుదాసు, భారతీలను అదుపులోకి విచారిస్తున్నారు.

News April 25, 2025

చిత్తూరు: DPOకు ఉత్తమ ప్రతిభా పురస్కారం

image

పన్నుల వసూళ్లలో గతేడాది చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన పన్నులు, పన్నేతర వసూళ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24 కోట్లకు రూ.22 కోట్లు వసూలు చేసి 88%తో ప్రథమ స్థానంలో నిలిచింది. దీంతో గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా DPO సుధాకర్ రావు ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు. 

News April 25, 2025

వందేళ్ల పండగకు రెఢీ అవుతున్న ఏయూ 

image

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని ఉపకులపతి ప్రో.రాజశేఖర్ తెలిపారు. తొలిరోజు ఉదయం 6గంటలకు ఆర్కే బీచ్‌లో శతాబ్ది వాక్ థాన్ ప్రారంభంకానుందని అన్నారు. ఉ.9 గంటలకు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్, మ.3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ హాజరవుతారన్నారు.

News April 25, 2025

GNT: ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారని పొన్నూరు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. ఈ నెల 27 నుంచి మే 20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థుల నుంచి రూ.300, రిజర్వు గ్రూపుల నుంచి రూ.200 చెల్లించాలన్నారు.

News April 25, 2025

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!

image

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. లేబర్ కాలనీకి చెందిన రవి, లక్ష్మీజ్యోతి (39) దంపతుల కుమారుడు భరత్ పదో తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. మనస్తాపం చెందిన తల్లి క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 25, 2025

రాజమండ్రి : ‘ప్రేమించి.. ఇప్పుడు వద్దంటున్నాడు’

image

విజయనగరానికి చెందిన యువకుడు తనను ప్రేమించి మోసం చేశాడంటూ రాజమండ్రి యువతి పోలీసులను ఆశ్రయించింది. RJY దేవీచౌక్ సమీపంలోని ఓ కోచింగ్ సెంటర్లో రాంబాబు కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ పొందుతున్నాడు. అదే కోచింగ్ సెంటర్‌కు వెళ్తున్న యువతి (20)తో ప్రేమ వ్యవహారం నడిపాడు. శారీరంగా లోబర్చుకుని పెళ్లి చేసుకోమంటే కులం పేరుతో అవమానించాడని ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.

News April 25, 2025

గణితంలోనే 3,934 మంది ఫెయిల్

image

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 3,934 మంది విద్యార్థులు ఒక్క గణితంలోనే ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత సైన్సులో 2,555 విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. గణితం ప్రశ్నా పత్రంలో లోపాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రయత్నం చేశారని, అయినా ఫలితాలు నిరాశ కలిగించాయని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రీ-వెరిఫికేషన్‌కు సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. 

News April 25, 2025

సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డి అరెస్ట్

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. YCP నేత మాధవరెడ్డిని గురువారం తిరుపతి CID పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతం తేజ్ అరెస్టు కాగా.. మాధవరెడ్డిని అరెస్టు చేసినట్లు CID DSP కొండయ్య నాయుడు తెలిపారు.

News April 25, 2025

మార్కాపురం: ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు’

image

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపూరం పట్టణ ఎస్సై సైదు బాబు హెచ్చరించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఆయన గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హితవు పలికారు. ఏవరైనా ఇలా దోరికితే కఠిన చర్యలు ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

News April 25, 2025

అన్నమయ్య: పది పరీక్షలో ఫెయిల్.. ఇద్దరు విద్యార్థులు మృతి

image

అన్నమయ్య జిల్లాలో రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. పది పరీక్షలో పెయిల్ అయ్యానని ములకలచెరువు మండలం పెద్దమోరవ పల్లికి చెందిన నవనీ (15) గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. అలాగే గుర్రంకొండకు చెందిన విష్ణు వరుసగా మూడు సార్లు పది పరీక్షలు రాశాడు. అయినా ఫెయిల్ అవుతుండటంతో మనస్థాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలతో అన్నమయ్య జిల్లా ఉలిక్కి పడింది.