Andhra Pradesh

News October 1, 2024

గుంటూరు: విజిలెన్స్ ఇన్స్పెక్టర్‌గా చంద్రశేఖర్ బాధ్యతలు

image

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్‌గా కొమ్మాలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సు‌మెంట్ సీఐగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన అక్కిశెట్టి శ్రీహరి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన సీఐను కార్యాలయ సిబ్బంది అభినందించారు.

News October 1, 2024

నెల్లూరు: ఆరేళ్ల బాలికపై కన్నతండ్రి అఘాయిత్యం

image

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అల్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన గోడ.వెంకటరమణయ్య తన ఆరేళ్ల కూతురుపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక భయపడి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News October 1, 2024

ఒక్కసారైనా రక్తదానం చేశారా?

image

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?

News October 1, 2024

టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: విశాఖ కలెక్టర్

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న టెట్ (కంప్యూటర్ బేస్డ్ – టెస్ట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. టెట్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 60,574 మంది హాజరుకానున్నారు. అభ్యర్థులకు జిల్లాలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News October 1, 2024

ఒక్కసారైనా రక్తదానం చేశారా?

image

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?

News October 1, 2024

విజయవాడలో వైసీపీ నేత ఇంటికి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి

image

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్‌ని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భవానీపురంలోని ఆకుల నివాసానికి వచ్చిన పల్లంరాజును ఆకుల సాదరంగా ఆహ్వనించారు. గతం నుంచి ఆకుల శ్రీనివాస్ కుమారుతో ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో పల్లంరాజు ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాల గురించి గుర్తు చేసుకున్నారు.

News October 1, 2024

రాజధానిలో రూ.250 కోట్లతో టెక్నాలజీ యూనిట్

image

రాజధాని అమరావతిలో రూ.250 కోట్లతో ఎంఎస్ఎంఈఅ టెక్నాలజీ సెంటరును కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఉత్తర్వులిచ్చింది. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీని సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని సీఆర్డీఏ కమిషనరును కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సీఆర్డీఏ పరిధిలోని సుమారు 20ఎకరాల్లో టెక్నాలజీ సెంటరుకు త్వరలో పునాది పడనుంది.

News October 1, 2024

కడప: రోడ్డు ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు?

image

కడప జిల్లా YVU యూనివర్సిటీ వద్ద సోమవారం రాత్రి కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కాళ్లు విరిగి పడిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంగా పరిగనించి వేలూరు ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి సమయంలో ఘటన జరగడంతో కేవలం కాళ్లకు మాత్రమే కత్తితో నరికిన గాయాలు ఉండగా.. చివరికి <<14239401>>ఎవరో కాళ్లను నరికినట్లు<<>> అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులతోపాటు వారి బంధువులు కూడా అనుమానిస్తున్నారు.

News October 1, 2024

తిరుపతి: చీపురు చేతబట్టి రోడ్లు ఊడ్చిన కలెక్టర్, MLA

image

తిరుపతి పట్టణంలోని వినాయక సాగర్ లో స్వచ్ఛతాహి సేవ 2024 కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య పారిశుద్ధ్య చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చీపుర కట్టలు చేతబట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News October 1, 2024

ఒక్కసారైనా రక్తదానం చేశారా?

image

అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?