India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లాలో సర్పంచులకు రూ.49,69,138 గౌరవ వేతనం విడుదలైందని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు తెలిపారు. ఎన్నికలు జరిగిన 684 పంచాయతీల్లోని సర్పంచులకు రెండో విడత కింద ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఒక్కొక్క సర్పంచుకు గౌరవ వేతనంగా రూ.3 వేలు వంతున విడుదల కాగా వాటిని బ్యాంకు ఖాతాలకు జమచేయనున్నామని ఆయన తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. విజయనగరం పట్టణంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పచ్చ జెండా ఊపి స్వచ్ఛాంధ్ర ర్యాలీను ప్రాంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.
రిమ్స్ దంత వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ చక్రపాణిపై కేసు నమోదు చేసినట్లు రిమ్స్ పోలీసులు శనివారం తెలిపారు. ఈయన కొన్ని రోజులుగా విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తుండేవాడు. ఈయన చేష్టలు భరించలేని కొందరు విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రిన్సిపల్ విద్యార్థులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకునేందుకు హెక్టారుకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటంచడంపై మంత్రి టీజీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు మంత్రి కృతజ్నతలు తెలిపారు. ధరల పతనంతో నష్టపోతున్న రైతులకు ఇది ఊరటనిచ్చే నిర్ణయమని అన్నారు. ఉల్లి రైతుల ఇబ్బందులపై సీఎం చంద్రబాబు తొలి నుంచి సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరును మారుస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్ తాడిగడపకు బదులుగా తాడిగడప మున్సిపాలిటీగా చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్భందించి తీవ్రంగా గాయపరిచి రూ.లక్ష నగదును దోచుకెళ్లిన ఘటన శనివారం తెల్లవారుజామున తణుకులో చోటుచేసుకుంది. తణుకు సజ్జాపురంలో జుపిటర్ ట్రేడర్స్ కార్యాలయంలో సెక్యూరిటీగా పనిచేస్తున్న ముత్యాల వెంకటరావుపై గుర్తుతెలియని వ్యక్తి ముసుగు ధరించి వచ్చి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం బ్యాగులో ఉన్న రూ.లక్ష నగదును దోచుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మర్రిపూడి మండలం రేగలగడ్డలో ఈ నెల 13న భార్య జయమ్మను రోకలిబండతో భర్త నారాయణ (50) హత్య చేశారు. అనంతరం తానూ గొంతు కోసుకున్న విషయం తెలిసిందే. అయితే అతను అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై టి.రమేశ్ బాబు శుక్రవారం తెలిపారు. వారికి 25 ఏళ్ల కిందట వివాహం కాగా అనుమానంతో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో భార్యను చంపినట్లు సమాచారం.
అనంతపురంలోని జీఆర్ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న చికెన్ సెంటర్లో రోజుల కొద్దీ నిల్వ ఉంచిన చికెన్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. షాప్ నిర్వాహకుడు ఇర్ఫాన్పై కేసు నమోదు చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ తస్లీమ్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు నివేదించి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సచివాలయ ఉద్యోగులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్కు సమ్మె నోటీసును అందజేశారు. శుక్రవారం సాయంత్రం ఉత్తరాంధ్ర జేఏసీ కోఆర్డినేటర్ కూన సత్యనారాయణతో పాటు పలువురు సభ్యులు నోటీసును అందజేశారు. రాజకీయ, పలు రకాల ఒత్తిడులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వివరించారు. సచివాలయ వ్యవస్థను ద్వితీయ శ్రేణి వ్యవస్థగా చూడడం తగదన్నారు.
స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 21న మర్లపాడులోఎన్.టి.ఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ జరుగనుందని దామచర్ల సత్య శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవి, డోలాబాల వీరాంజనేయ స్వామి, MPలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొంటారని చెప్పారు.
Sorry, no posts matched your criteria.