India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాపూరు- చిట్వేల్ ఘాట్ రోడ్ 12 కిలోమీటర్ వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా నెల్లూరుకి తరలించారు. చిట్వేల్ ఘాటు వద్ద ఉసిరికాయలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులు పంగిలి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

కళాశాల, పాఠశాల, వసతి గృహలకు వచ్చిన విద్యార్థి విద్యార్థినీలు ప్రవర్తనను ప్రతి నిమిషం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని ఎస్పీ రాధిక సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె జిల్లాలోని వివిధ కళాశాలలు యాజమాన్యంతో విద్యార్థులు భద్రత, ఆత్మహత్యలు నివారణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బోధనేతారా సిబ్బంది విద్యార్థి విద్యార్థినీలను కౌన్సెలింగ్ నెపంతో పిలిస్తే కాలేజ్ యాజమాన్యంకు చెప్పాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్శీటీలు అనుబంధ కళాశాలలో పీజీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష ఏపీ పీజీ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఆచార్య జి. శశిభూషణరావు తెలిపారు. మే 4వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఈరోజు ఏపీ పీజీ సెట్ చైర్మన్,వీసీ ప్రసాద్ రెడ్డి విడుదల చేసినట్లు తెలిపారు.

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు.. బైక్పై వెళ్తున్న దంపతులు వేణి, పవన్ ప్రమాదవశాత్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో పవన్ అక్కడికక్కడే చనిపోగా వేణికి గాయాలయ్యాయి. భర్త కళ్లముందే చనిపోవడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా పీసీపల్లిలో 42.67 డిగ్రీల రికార్డు నమోదు చేసింది. ఆ తర్వాత బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలో 42.40 డిగ్రీలు, మార్కాపురం మండలం దరిమడుగులో 42.30, గుండ్లాపల్లిలో 42.03 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డోన్ మండలం గోసానిపల్లె సమీపంలో కరివేపాకు తోట మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ప్యాపిలి మండలం కోటకొండకు చెందిన వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు అక్కడికక్కడే మృతిచెందారు. అతని కుమారుడికి, ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు.

ఈ నెల 3వ తేదీన కోనసీమ జిల్లా రావులపాలెంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్లు ఆ పార్టీ కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 చుట్టూ రూ.250 కోట్ల కుంభకోణం జరిగిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ ఆరోపించారు. ఈ కుంభకోణంపై విశాఖ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిలో సీఎం జగన్ రెడ్డి, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రమేయం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సిబిఐతో విచారణ నిర్వహించాలన్నారు.

ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ హాజరయ్యారు. ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై సూచనలు చేశారు.

జనసేన అధినేత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో పిఠాపురంలో ఎన్నికల కార్యక్రమం వాయిదా వేసుకొని హైదరాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. కాగా అక్కడ వైద్యపరీక్షలు చేయించుకొని సోమవారం మధ్యాహ్నం పిఠాపురం చేరుకున్నారు. ఈ తరుణంలో ప్రచారానికి సంబంధించి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.