India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా దాచేపల్లికి చెందిన కరాలపాటి జానీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ అధ్యక్షులు తులసి రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జానీ శుక్రవారం దాచేపల్లిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న తనను గుర్తించి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గానికి ‘పర్వత’ కుటుంబం ఐదుగురు MLAలను అందించింది. 1955లో పర్వత గుర్రాజు గెలవగా, ఆయన వారసుడు పర్వత సుబ్బారావు 1994లో గెలిచారు. సుబ్బారావు భార్య బాపనమ్మ 1999లో విజయం సాధించారు. ఆమె కుమారుడు పర్వత సత్యన్నారాయణ మూర్తి 2009లో గెలుపొందారు. అదే కుటుంబం నుంచి పర్వత పూర్ణ చంద్రప్రసాద్కి 2019లో విజయం దక్కింది. దీంతో ఆ కుటుంబం నుంచి ఐదుగురు నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయింది.

న్యూ ఢిల్లీలో 18 నుంచి 22 వరకు జరిగిన అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో సిహెచ్. మహేశ్ కాంస్య పతకం సాధించాడు. మహేశ్ విజయవాడలోని హెడ్ పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో పవర్ లిఫ్టింగ్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించి పలు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా ఆయనను పలువురు సిబ్బంది, సహచరులు అభినందించారు.

కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ను తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వెంకట ప్రసాద్పై గతంలో సీబీఐ, హైదరాబాద్ కోర్టు విధించిన ఐదు, ఏడు సంవత్సరాల శిక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఇవాళ తీర్పు వెల్లడించింది. క్రిమినల్ ఆపిల్ నెంబర్ 454/2016, 1382/2017లను అనుమతిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన శిక్షణ హైకోర్టు రద్దు చేసింది.

ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పరిధిలో పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు మీడియం ద్వారా ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు angrau.ac.in వెబ్సైట్ను చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.

కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కురువలకు కేటాయించడం పట్ల కురువ, వాల్మీకి సంఘ నాయకులు శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా కురువ కులస్థుడైన బస్తిపాటి నాగరాజు.. మంత్రాలయం అసెంబ్లీకి వాల్మీకి కులస్థుడైన రాఘవేంద్రరెడ్డికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు MP, మంత్రాలయం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు.

టీడీపీ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీశ్ మాధుర్ పోటీ చేయనున్నట్లు అధినేత చంద్రబాబు ప్రకటించారు. హరీశ్ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి మళ్లీ ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఆయనకు అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈయన జీఎంసీ బాలయోగి కుమారుడు.

కురిచేడు మండలం దేకనకొండ గ్రామానికి చెందిన పి. భార్గవి (19) దర్శిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుతుంది. గురువారం కాలేజికి బయలుదేరి వెళుతున్నానని చెప్పి వెళ్ళింది. మార్కాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై శవమై కనిపించింది. భార్గవి తల్లిదండ్రులకు రైల్వే పోలీసులు సమాచారాన్ని అందించారు. ఇది ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కారణాలు తెలియాల్సి ఉంది.

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో మార్చి 25వ తేదీన స్వామివారికి పౌర్ణమి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టలో వారు మాట్లాడుతూ.. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలలో తిరుమల లడ్డూలు స్వామివారి ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంటాయని అన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురానికి చెందిన దండు గోపాలకృష్ణ అనే వ్యక్తికి హత్యాయత్నం కేసులో 5ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా కోర్టు విధించినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. 2017లో అదే గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తిపై డబ్బుల విషయంలో హత్యాయత్నానికి పాల్పడడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ అనంతరం జడ్జి జైలు శిక్ష జరిమాన విధిస్తూ తీర్పనిచ్చారు
Sorry, no posts matched your criteria.