Andhra Pradesh

News September 20, 2025

శృంగవరపుకోటలో మెగా జాబ్ మేళా

image

ఎస్.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శంకరరావు తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ పూర్తి చేసి, 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు చేస్తారన్నారు. ఉదయం 9 గంటలకు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, ఫొటోలతో హాజరుకావాలని కోరారు.

News September 20, 2025

రాష్ట్రస్థాయి స్కూల్ రగ్బీ పోటీలకు అనంతపురం జిల్లా విద్యార్థులు

image

రాష్ట్రస్థాయి స్కూల్ రగ్బీ పోటీలకు అనంతపురం జిల్లా విద్యార్థులు ఎంపికయ్యారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జడ్పీ పాఠశాలకు చెందిన హిమబిందు (అండర్-14), హేమసాయి, సుస్మిత (అండర్-17), రుషిందర్, నందిని (అండర్-19) సెలెక్టయ్యారు. స్టాండ్ బైగా చక్రి, వరుణ్ సందేశ్ వ్యవహరిస్తారు. విద్యార్థులను HM నీరజ, పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటేశ్వరప్ప, సువర్ణ అభినందించారు.

News September 20, 2025

రాజమండ్రి: ‘సాధారణ జ్వరాలు మాత్రమే..  ఆందోళన వద్దు’

image

తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కనిపిస్తున్న జ్వరాలు సాధారణ జ్వరాలేనని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో జ్వరాల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

News September 20, 2025

కౌన్సిల్ తీర్మానం మేరకే ఆక్రమణలు తొలగింపు: జీవీఎంసీ కమిషనర్

image

జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా ఫుడ్ కోర్ట్ తొలగించడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ శుక్రవారం తెలిపారు. ఫుడ్ కోర్ట్‌లో 160 దుకాణాలు అనధికారకంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారన్నారు. 2023లోని జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఫుడ్ కోర్ట్ తొలగింపునకు కౌన్సిల్ తీర్మానించదన్నారు. మరళ 2025 ఆగస్టు 22న జీవీఎంసీ కౌన్సిల్‌లో సభ్యుల అంగీకారంతో తీర్మానం జరిగిందన్నారు.

News September 20, 2025

దీపం-2 పథకం అమలుపై విజయనగరం జేసీ సమీక్ష

image

కలెక్టరేట్లో జేసీ సేతుమాధవన్ అధ్యక్షతన దీపం-2 పథకం అమలుపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. సబ్సిడీ నగదు వినియోగదారుల ఖాతాలలో జమ కానందుకు ఆధార్-బ్యాంక్ లింక్ సమస్యలు, ఖాతాలు బ్లాక్ కావడం ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. గ్యాస్ ఏజెన్సీ డీలర్లు వీటిని పరిష్కరించి లబ్ధిదారులకు సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. అదనపు డబ్బులు వసూలు చేసే డెలివరీ బాయ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News September 20, 2025

ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ సూచించారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటే వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల మౌలిక వసతుల కల్పనకు అడ్డంకులు ఉండవన్నారు.

News September 20, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడటమే జిల్లా యంత్రాంగం ప్రధమ కర్తవ్యం కావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విపత్తుల సమయాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సురక్షితంగా కాపాడేందుకు ముందస్తు ప్రణాళిక అవసరమన్నారు.

News September 20, 2025

బడి ఈడు పిల్లలు బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

పేద ప్రజలకు అందాల్సిన లబ్ధి అర్హులైన వారికి తప్పకుండా అందాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. పోషన్ అభియాన్ నిర్దేశిత లక్ష్యాలు అమలు అయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 20, 2025

పలాస: తక్షణ పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి

image

ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాలుపై తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని SP మహేశ్వర రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసు స్టేషన్ ఆవరణలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా ఫిర్యాదు దారులుతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబ, ఆస్తి, పౌర సంబంధాలు, గొడవలు, మోసపూరితమైనవి, ఇతర అంశాలుపై ఫిర్యాదులు అందాయన్నారు.

News September 20, 2025

కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మద్యం షాపులు, పర్మిట్ రూముల వద్ద నూరు శాతం ప్లాస్టిక్ నిషేధాన్ని వారం రోజుల్లోగా అమలు చేయాలన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు.