Andhra Pradesh

News April 24, 2025

తెనాలి: బాలికపై లైంగిక దాడి.. కేసు నమోదు

image

తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై NTR (D) మైలవరానికి చెందిన అవినాశ్ లైంగిక దాడికి పాల్పడగా వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు విచారించగా వెలుగులోకి రావడంతో ఫిర్యాదు చేశారు.

News April 24, 2025

మధుసూదన్ ఇంటికి రానున్న Dy.CM పవన్

image

ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి సోమిశెట్టి మధుసూదన్ భౌతికకాయానికి Dy.CM పవన్ కళ్యాణ్ నివాళులర్పించనున్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కావలికి రానున్నట్లు అధికారులు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

News April 24, 2025

మరికాసేపట్లో మధుసూదన్ ఇంటికి మంత్రి ఆనం 

image

ఉగ్రవాదుల దాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మధుసూదన్ కుటుంబాన్ని మంత్రి ఆనం పరామర్శించనున్నారు.  

News April 24, 2025

తండ్రిని చంపించింది రాజమండ్రిలో ఉంటున్న కొడుకే

image

అనకాపల్లి (D) చినకలువలాపల్లిలో జరిగిన వడ్డీ వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్లి తాతారావును కొడుకు అప్పలరెడ్డే హత్య చేయించాడని, తండ్రి తన ఆస్తిని సవతి తల్లి కుమార్తెకు ఇచ్చేస్తాడని భావించి ఇద్దరిని పురమాయించి హత్య చేయించినట్లు వెల్లడించారు. రాజమండ్రిలో ఉంటున్న అప్పలరెడ్డితోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

News April 24, 2025

ANUలో ఇంజినీరింగ్ విద్యార్థుల ప్రతిభ

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల 4/4 మొదటి సెమిస్టర్ ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబర్చారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మొత్తం 638 మంది పరీక్షలు రాయగా 578 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 90.12గా నమోదైంది. రీవాల్యుయేషన్ కోసం మే 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు.

News April 24, 2025

అమరావతిలో తొలి క్వాంటమ్ విలేజ్‌?

image

అమరావతిని దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వెలగపూడిలో జరిగిన సమీక్షలో ఐటీ శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. 50ఎకరాల భూమిపై ఐకానిక్‌ భవనం నిర్మాణానికి L&T, టెక్నాలజీ మద్దతు కోసం ఐబీఎం ముందుకొచ్చాయి. టీసీఎస్, సీఎంఓ కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి భాస్కర్‌ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

News April 24, 2025

వత్సవాయి: తమ్ముడిని చంపిన అన్న

image

వత్సవాయి మండలం కాకరవాయిలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరగగా, అన్న కొండ ఇనుప రాడ్డుతో తమ్ముడు అర్జున్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అర్జున్‌ను విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితుడు కొండను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

News April 24, 2025

కడప: నోటిఫికేషన్ విడుదల

image

ఏపీలో నిన్న టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని 4 IIITల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 24, 2025

ఫిరంగిపురం: టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

image

ఫిరంగిపురం మండల కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురైన పి. వినయ్ కుమార్ అనే విద్యార్థి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక పాఠశాలలో చదువుతున్న అతను ఫలితాల అనంతరం తాత ఇంటికి వెళ్లి ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు అతడిని సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

News April 24, 2025

కంచరపాలెం: బస్సు ఢీకొని మహిళ మృతి

image

కంచరపాలెం ఊర్వశి జంక్షన్ దగ్గర గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలను విజయవాడ నుంచి పార్వతీపురం వైపు వెళుతున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న ఎన్.మేరీ (62 ) అక్కడికక్కడే చనిపోగా, డ్రైవ్ చేస్తున్న కూతురు సుధారాణి(40)కి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.