Andhra Pradesh

News September 26, 2025

గుంటూరులో అతిసార కేసులపై స్పష్టత కరువు

image

గుంటూరులో అతిసారం ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య, డిశ్చార్జి అవుతున్న కేసులపై అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రత్యేక వార్డులో సుమారు 80 మంది చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 100 మందికి పైగా డిశ్చార్జి అయ్యారని తెలుస్తోంది. అయితే లెక్కల్లో పొంతన లేకపోవడంతో నిజ స్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది.

News September 26, 2025

కృష్ణా జిల్లాలో ఈ-క్రాప్ నమోదు నత్తనడక..!

image

కృష్ణా జిల్లాలో ఈ-క్రాప్ నమోదు గడువు (సెప్టెంబరు 15) ముగిసినా, జిల్లాలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. ఆర్ఎస్‌కే ఉద్యోగుల బదిలీల జాప్యం కారణంగా ప్రక్రియ నెమ్మదించింది. అధికారుల లెక్కల ప్రకారం కేవలం 67 శాతం మాత్రమే పూర్తయింది. దీంతో రైతులకు ప్రభుత్వ పథకాలు అందే విషయంలో ఆందోళన నెలకొంది.

News September 26, 2025

CUTE PHOTO: భుజం ఎక్కిన ‘బాధ్యత’

image

కూతురి హృదయంలో నాన్న ఎప్పుడూ హీరోనే.. అలాగే తండ్రికి కూతురే లోకం. ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూతురిపై తండ్రి ప్రేమకు నిదర్శనమే పై ఫొటో. గురువారం కొత్తమ్మతల్లి పండగ విధుల్లో ఉన్న శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కూతురిని భుజాలపై ఎక్కించుకుని జాతరలో అందాలను చూపించారు. కలెక్టర్‌కు తన కూతురిపై ఉన్న ప్రేమను చూసిన పలువురు భక్తులు ముగ్ధులయ్యారు.

News September 26, 2025

విజయనగరం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

పొక్సో కేసులో పట్టణంలోని మేధరవీధికి చెందిన గ్రంధి పైడిరాజుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. 4ఏళ్ల బాలికను బైక్‌పై తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు ధర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో ఐదు నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు. బాదితురాలికి రూ.2లక్షల పరిహారం మంజూరైందన్నారు.

News September 26, 2025

బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో : కాకాణి

image

అభిమానులను కొడుతూ, తిడుతూ ఉన్మాదిలా ప్రవర్తించే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌పై అయన మాట్లాడిన మాటలు వింటుంటే, పిచ్చి మళ్లీ ముదిరిందా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే అనుమానం కల్గుతుందన్నారు. బాలకృష్ణ మాట్లాడినవన్నీ అబద్దాలని చిరంజీవి వివరణ రుజువైందని X లో కాకాణి పోస్ట్ చేశారు.

News September 26, 2025

ట్రాక్టర్‌ను ఢీకొని సతీశ్ చనిపోయాడు: పోలీసులు

image

పామిడి మండలం కాలాపురం సమీపంలో బుధవారం రాత్రి జి.కొట్టాలకు చెందిన వైసీపీ నేత సతీశ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మొదట హత్య అని వార్తలు రాగా, ప్రాథమిక దర్యాప్తు అనంతరం సతీశ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. ట్రాక్టర్ డ్రైవర్ సాయికుమార్‌ను విచారించామని, దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.

News September 26, 2025

రూ.3.57 కోట్లతో అనెక్స్ భవనం ప్రారంభం

image

AP అసెంబ్లీ ప్రాంగణంలో అనెక్స్ భవనాన్ని గురువారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రులు పయ్యావుల, నారాయణలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియా పాయింట్లో స్పీకర్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన భవనాన్ని అన్ని హంగులతో పునరుద్ధరించేందుకు రూ.3కోట్ల 57 లక్షలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. భవనం గ్రౌండ్ ప్లోర్లో మీడియా సమావేశాలకు వీలుగా సుమారు 100 మంది మీడియా ప్రతినిధులు కూర్చోవచ్చన్నారు.

News September 26, 2025

పొదిలి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ప్రకాశం జిల్లా పొదిలి మండలం పోతవరం వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని బైకుపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2025

ధనలక్ష్మి అవతారంలో బోయకొండ గంగమ్మ

image

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి వేద పండితులచే ఆశీర్వచనం కల్పించారు. వివిధ ప్రాంతాల అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

News September 26, 2025

శ్రీకాకుళం: రూ.15 వేల కోసం 10,728 దరఖాస్తులు

image

దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకాకుశం జిల్లా వ్యాప్తంగా 10, 981 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 10,728 మందికి ఈకేవైసీ పూర్తయిందని, 113 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అత్యధికంగా రణస్థలంలో 595, తక్కువగా ఎల్ఎన్ పేటలో 131 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కాగా ఈ నెల 22 తో గడువు ముగిసింది.