India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడపలోని సాయిబాబా స్కూల్లో పైకప్పు పెచ్చుుల ఊడిపడి ఆరుగురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల ఛైర్మన్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం వల్లే పాఠశాల గది పైకప్పు కూలిందని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.
మెగా డీఎస్సీని ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలోమంగళవారం సమీక్ష నిర్వహించారు. సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. సిలబస్లో ఎటువంటి మార్పులు చేయలేదని అధికారులు మంత్రికి వివరించారు.
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మార్కాపురం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మార్కాపురంలోని శరభయ్య మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2019లో భార్య పార్వతి నిద్రిస్తుండగా గొడ్డలి వెనుక భాగంతో తలపై కొట్టడంతో మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు. దాదాపు 9నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. భీమవరానికి చెందిన శివకుమారి తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓ యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.
ఆత్మకూరులో R&B అతిథి భవనాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. భవనాలు అసంపూర్తిగా ఉండడంతో అవసరమైన వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టీడీపీ నాయకులు గిరునాయుడు తదితరులు ఉన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు. దాదాపు 9నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. భీమవరానికి చెందిన శివకుమారి తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓ యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.
అనకాపల్లి జిల్లా కలెక్టర్గా విజయకృష్ణన్ను ప్రభుత్వం నియమించింది. ఈమె ఇటీవల అల్లూరు జిల్లా కలెక్టర్గా నియమితులైన దినేశ్ కుమార్ భార్య కావడం విశేషం. అల్లూరి జిల్లాలో దినేశ్ కుమార్, అనకాపల్లి జిల్లాలో ఆయన భార్య విజయకృష్ణన్ సేవలు అందించనున్నారు. గతంలో వీరిరువురూ ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కలెక్టర్లుగా పనిచేశారు.
శ్రీకాళహస్తి: తొండమనాడు మార్గం అమ్మపాళెం సమీపంలో ఓ మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కుని ఇద్దరు దుండగులు పరారైన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. అమ్మపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళ వాకింగ్ చేస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు బైక్పై వచ్చి మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కొని పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలోని మహిళా నిరుద్యోగులకు రూడ్ సెట్ సంస్థ శుభవార్త చెప్పింది. ఆకుతోటపల్లిలోని ఎస్కే యూనివర్సిటీ పక్కనున్న రూడ్ సెట్ కార్యాలయంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, జర్దోసి మగ్గంలపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 26 నుంచి నెల రోజులపాటు ఉచిత శిక్షణతో పాటు వసతి భోజనం సౌకర్యం కల్పిస్తామన్నారు. 9618876060కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
కూరగాయల ధరల పెరుగుదల నియంత్రణతో పాటు రైతులకు గిట్టుబాటు ధర దక్కే విధంగా రైతు బజార్లలో రాష్ట్ర వ్యాప్తంగా పూర్వ వైభవం ఉట్టిపడేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. ధరల పెరుగుదల, దిగుబడులపై ఆయన చర్చించారు.
Sorry, no posts matched your criteria.