India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం పవిత్ర తీర్థప్రసాదాలను అందజేసి వేద పండితులచే ఆశీర్వచనం కల్పించారు. వివిధ ప్రాంతాల అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకాకుశం జిల్లా వ్యాప్తంగా 10, 981 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 10,728 మందికి ఈకేవైసీ పూర్తయిందని, 113 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అత్యధికంగా రణస్థలంలో 595, తక్కువగా ఎల్ఎన్ పేటలో 131 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కాగా ఈ నెల 22 తో గడువు ముగిసింది.
పుంగనూరు మండలంలోని చదల్లలో సప్త మాతృక సమేత చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఢీ డాన్స్ ప్రోగ్రాం ఆర్టిస్ట్ పండు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి అందరిని అలరించాయి. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.
కంచరపాలెం సమీపంలోని తిక్కవారిపాలెంలో నాగల్ గణేష్ అనే యువకుడ్ని దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో గణేష్ను హతమార్చారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
కడప మేయర్ సురేశ్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్పై కౌంటర్ వేయాలని ప్రతివాదిగా ఉన్న MLA రెడ్డప్ప మాధవి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అలాగే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కడప కార్పొరేషన్ కమిషనర్, రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి నోటీసులు ఇచ్చింది. విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
కొబ్బరికాయలకు భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. దసరా ఉత్సవాల్లో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు, పూజల్లో కొబ్బరికాయలు అధికంగా కొబ్బరి కాయలను వినియోగిస్తారు. కేరళ ప్రాంతం నుంచి ప.గో జిల్లాకు కొబ్బరికాయలు దిగుమతి అయ్యేవి. తుఫాన్, వర్షాభావ పరిస్థితులతో అక్కడి నుంచి దిగుమతులు తగ్గడంతో ఈ ప్రాంతంలోని కొబ్బరి చెట్లనుంచి కాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాయ ధర 50-70 పలుకుతోంది.
భీమవరం-విస్సాకోడేరు వంతెన వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విస్సాకోడేరుకు చెందిన ఎర్ర మోహన సాయి (25) మృతి చెందాడు. ఓ షాపులో పనిచేస్తున్న తన సోదరిని తీసుకురావడానికి బైక్పై సాయి వెళ్తుండగా, వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 490 వైద్య శిబిరాలు నిర్వహించి 42,192 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించినట్లు ఆ ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ స్టేఫీ తెలిపారు. వరిగొండ, దామర మడుగులలో జరుగుతున్న వైద్య శిబిరాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా ఆరోగ్య పరిరక్షణ కోసం ఈకార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.
ఉలవపాడు మండలం బద్దిపూడిలో గంగమ్మ తల్లి దసరా ఉత్సవాలపై ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెల 27 నుంచి జరిగే ఉత్సవాలకు అనుమతులు నిలిపివేసినట్లు SI అంకమ్మరావు గురువారం తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత గ్రామ పెద్దలు, ప్రజల ఏకాభిప్రాయంతో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చున్నారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కంచిలి మండలం జలంత్రకోట కూడలి వద్ద లారీ డ్రైవర్ ఇద్దరిని <<17827853>>చంపేసిన <<>>విషయం తెలిసిందే. బిహార్కు చెందిన ఇబ్రార్ఖాన్ న్యూ స్టార్ దాబా వద్ద లారీ ఆపి భోజనానికి వచ్చాడు. తిన్న తర్వాత రూ.200 బిల్లు కట్టకుండా వెళ్తుండగా.. దాబా యజమాని అయూబ్ అడ్డుకున్నాడు. దీంతో అతనిపైకి లారీ ఎక్కించాడు. దాబాకు పాలు పోసే దండాసి(66) సైతం డ్రైవర్ను అడ్డుకోవడానికి చూడగా అతని పైకీ లారీ ఎక్కించడంతో ఇద్దరూ చనిపోయారు.
Sorry, no posts matched your criteria.