Andhra Pradesh

News July 20, 2024

నెల్లూరు: TODAY 6PM TOP NEWS

image

-గూడూరులో అత్యాచారం నిందితుడి అరెస్ట్
-నెల్లూరు: ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు
-నెల్లూరు: పెట్రోల్ బంకులపై వాహనదారుల ఆగ్రహం
-సోమిరెడ్డికి ముడుపులు చెల్లిస్తేనే అనుమతులు: కాకాణి
-ఎంపీ విజయసాయి రెడ్డితో చంద్రశేఖర్ రెడ్డి భేటీ

News July 20, 2024

కడప జిల్లా టాప్ న్యూస్ @6 PM

image

✎ కడపలో కొడుకు హత్య.. బాధ లేదంటున్న తండ్రి
✎ వైసీపీ నేతలు రూ.కోట్లు దోచుకున్నారు: మండిపల్లి
✎ ప్రొద్దుటూరు ఎఫ్బీఓ సస్పెన్షన్
✎ వైసీపీపై భూపేశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
✎ జగన్‌కు బుద్ధి ఉందా: TNSF
✎ పుల్లంపేటలో రౌడీ షీటర్ సూసైడ్
✎ సమస్యలు ఉంటే నేరుగా కడప కలెక్టర్‌కు ఫోన్ చేయవచ్చు
✎ ప్రొద్దుటూరులో ఫొటోల వివాదం
✎ రాజకీయ లబ్ధి కోసమే జగన్ పర్యటనలు: బీటెక్ రవి
✎ ముద్దనూరులో వేపరాల వాసి మృతి

News July 20, 2024

విజయనగరం జిల్లా TOP NEWS @6PM

image

* పార్వతీపురం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించిన డీఈఓ
* గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం చేరుకుంటున్న భక్తులు
* VZM: ఐదు నెలల్లో 87 మంది శిశువులు మృతి
* విజయనగరంలో రద్దీగా సింహాచలం బస్సులు
* VZM: 24 గంటలు బీ అలర్ట్
* విజయనగరంలో వికసించిన బ్రహ్మ కమలాలు
* పార్వతీపురం: ఆర్టీసీ ప్రయాణకులకు అలర్ట్
* విజయనగరంలో 48.2 మి.మీ. వర్షపాతం నమోదు

News July 20, 2024

గుంటూరు జిల్లా TOP NEWS @6PM

image

* 70అడుగుల జలపాతం.. మాచర్ల ఎత్తిపోతల అందాలు
* జగన్ రోడ్లపై తిరిగితే ఏపీకి నష్టం: పెమ్మసాని
* యరపతినేని నా మిత్రుడు: TG సీఎం రేవంత్
* వినుకొండ రషీద్ హత్యలో ట్విస్ట్
* గుంటూరు నగరపాలక సంస్థ చరిత్రలో జులై 20 బ్లాక్ డే: కావటి
* అమరావతి: వర్షం నీటితో రోడ్డు, పొలాలు ఏకం
* నిదానంపాటి అమ్మవారి హుండీ ఆదాయం రూ.19,31,932
* ఫిరంగిపురం: బస్సులో తప్పిపోయిన చిన్నారి
* ANU: 31న పీజీ సెట్ అర్హత పరీక్ష

News July 20, 2024

తూ.గో: వివాహితతో అసభ్యప్రవర్తన.. ఆమె భర్తపై దాడి

image

తూ.గో జిల్లా కడియంలో ఓ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు CI తులసీధర్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కడియంకు చెందిన చల్లా కొండరాజు అదే ఏరియాకు చెందిన వివాహితతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె భర్తపై దాడి చేశాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు SI నాగ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి కొండరాజును అరెస్టు చేశారు. అతడిని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించింది.

News July 20, 2024

ఎచ్చెర్ల: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

image

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో సూరాడ లక్ష్మణ (40) శనివారం ఉదయం చేపల వేటకు వెళ్లగా అలల తాకిడికి దుర్మరణం చెందారు. అటుగా వెళ్లిన జాలర్లు మృతదేహాన్ని గుర్తించారు. ఆయనకు భార్య, ఒక కూతురు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 20, 2024

ఏపీఐఐసీ భూములపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

ఏపీఐఐసీకి కేటాయించిన భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కప్పల బండ, హిందూపురం, మడకశిర, లేపాక్షి ప్రాంతాలలో ఎలాంటి పనులు చేపట్టాలో అధికారులు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

News July 20, 2024

విజయనగరం: సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

image

కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సీజనల్ వ్యాధులపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, తాగునీరు కలుషితం కాకుండ చేపట్టాల్సిన చర్యలు డెంగీ మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్, జడ్పీ సీఈవో, డీపీఓ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News July 20, 2024

ముద్దనూరు: మృతదేహం కలకలం

image

ముద్దనూరు – జమ్మలమడుగు రహదారి సమీపంలో ఉన్న వనంలో ఓ మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న ఎస్సై మైనుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు షరాబు రామచంద్ర ఆచారి (49)అని ఎస్సై తెలిపారు. మైలవరం మండలంలోని వేపరాలకు చెందిన రామచంద్ర చికిత్స కోసం తిరుపతికి ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి వారం రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 20, 2024

ప.గో జిల్లాలో హత్య.. కత్తితో నరికిన మహిళ

image

ప.గో జిల్లా నరసాపురం మండలం వేములదీవిలోని సర్దుకొడప గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చినమైనవానిలంకకు చెందిన మైల చంద్రశేఖర్(38)ను సర్దుకొడపకు చెందిన మహిళ ఆమె ఇంటిలోనే కత్తితో తలపై నరికింది. చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.