Andhra Pradesh

News July 19, 2024

సెంచరీలతో అదరగొడుతున్న సిక్కోలు క్రికెటర్

image

సిక్కోలుకు చెందిన యువ క్రికెటర్ సుశాంత్ అద్భుతంగా రాణిస్తున్నారు. కడప జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో 121, రెండో మ్యాచ్‌లో 107 పరుగులతో వరుసగా సెంచరీలు కొట్టారు. మూడో రోజు కృష్ణా జిల్లాపై 68 పరుగులతో సత్తా చాటారు. పరుగుల వరద పారిస్తున్న సుశాంత్‌ భవిష్యత్తులో ఇండియా టీమ్‌కు ఎంపిక కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

News July 19, 2024

చిత్తూరు: ఆధార్ కోసం ప్రత్యేక క్యాంపులు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వ హించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. పెండింగ్ ఆధార్ సర్వీసులను అప్‌డేట్ చేయనున్నారు. ప్రతి మండలంలో క్యాంపులు నిర్వహించనున్నారు.

News July 19, 2024

దుత్తలూరు: మద్యం తాగి పాఠశాల గదిలో పడిఉన్న వ్యక్తి

image

దుత్తలూరు మండలం ఎరుకల్లు పాఠశాలలో మద్యం తాగి అపస్మారక స్థితిలో పడిఉన్న ఘటన శుక్రవారం జరిగింది. ఉదయం పాఠశాలకు వచ్చేసరికి గదిలో పడి ఉండడాన్ని గమనించిన విద్యార్థులు భయాందోళన చెందారు. గది తలుపులు తాళం వేసి ఉంటే ఎలా లోపలకు వెళ్లాడని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆరు బయట, ప్రభుత్వ పాఠశాలలో మద్యం తాగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News July 19, 2024

కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై ఫిర్యాదు

image

మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి నకిలీ పత్రాలతో తమ భూమిని కాజేశారని నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తోన్న గ్రీవెన్స్‌లో వారు ఈ ఫిర్యాదు చేశారు. పరిష్కారానికి మంత్రి అధికారులతో మాట్లాడారు.

News July 19, 2024

నరసాపురం MPDO కనిపిస్తే ఈ నంబరుకు కాల్ చేయండి

image

నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తూ అదృశ్యమైన ఎం. వెంకటరమణారావు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు, గాలింపు చర్యలకు తన ప్రత్యక్ష పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు,15 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బంది పని చేస్తున్నారన్నారు. అదృశ్యమైన ఎంపీడీవో సమాచారాన్ని 94407 97400, 94406 27051, 94910 63910 నంబర్లకు తెలియజేయాలని కోరారు.

News July 19, 2024

మరోసారి ఎంపీ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ..!

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి పుంగనూరు నియోజకవర్గ పర్యటనకు సిద్ధం కావడం టెన్షన్ రేపుతోంది. మరికాసేపట్లో ఆయన సదుంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు పులిచెర్ల మండలం కల్లూరులో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

News July 19, 2024

విశాఖ: అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వారిపై నిఘా

image

పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి జైలుకెళ్లి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ అన్నారు. పెదగంట్యాడకు చెందిన యువతిపై హత్యాయత్నం విషయమై ఆయన మాట్లాడుతూ.. బాధిత తల్లిదండ్రులతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. అమ్మాయిలను వేధించినా, ఇబ్బందులకు గురి చేసినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు.

News July 19, 2024

VSU ఇన్‌ఛార్జ్ వీసీగా విజయభాస్కర్ రావు

image

వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రయ సింహపురి విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీగా విజయభాస్కర్ రావు నియమితులయ్యారు. ఈయన తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రం లెక్చరర్‌గా, పరిశోధనాభివృద్ధి డీన్‌గా పనిచేస్తున్నారు. మరికాసేపట్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నట్లు VSU అధికారులు తెలిపారు.

News July 19, 2024

కనిగిరిలో స్వల్ప భూ ప్రకంపనలు

image

కనిగిరి మండలం నందన మారెళ్లలో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో ప్రకంపనాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు గ్రామస్థులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.

News July 19, 2024

కడప జిల్లాలో త్వరలో BSNL 4జీ సర్వీసులు

image

కడప జిల్లాలో త్వరలో 4జీ సేవలను అందించనున్నట్లు BSNL అనంతపురం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ముజీబ్ షాషా పేర్కొన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భాగస్వామ్యంతో 4జీ సేవలను ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో 460 సెల్ టవర్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని అప్ గ్రేడ్ చేస్తామని చెప్పారు. 2జీ, 3జీ సిమ్ కలిగి ఉన్నవారు ఉచితంగా 4జీ సిమ్ పొందవచ్చునన్నారు.