Andhra Pradesh

News July 18, 2024

చిత్తూరు: విద్యుత్ పోల్స్ మార్చండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తక్షణమే మార్పు చేయాలని ఎస్ఈ సురేంద్రనాయుడు ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వర్షాల కురుస్తున్నాయని.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు సైతం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News July 18, 2024

డిప్యూటీ సీఎంకు నర్సాపురం MPDO రాసిన లేఖ వైరల్

image

నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే ఆయన ఆచూకీ కనుక్కోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన అదృశ్యానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఒక ఫోన్లో డిప్యూటీ సీఎంకు రాసిన లేఖను పంపారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News July 18, 2024

కర్నూలులో తాడిపత్రి వ్యక్తి దారుణ హత్య

image

కర్నూలులో బుధవారం <<13648791>>హత్య<<>> జరిగింది. తాడిపత్రికి చెందిన శ్రీరాములు యాచకుడిగా జీవిస్తున్నారు. అదే వృత్తిలో ఉన్న ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా ఒక కూతురు శ్రీరాములు ద్వారా జన్మించినట్లు తెలిస్తోంది. ఆ కూతురితో పరశురాం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ జరగ్గా శ్రీరాములిని బండరాయితో కొట్టి పరశురాం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

News July 18, 2024

తిరుపతి: PGలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో M.Sc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. GAT-B 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జులై 20.

News July 18, 2024

కర్నూలులో దారుణ హత్య.. UPDATE

image

కర్నూలులో నిన్న <<13648791>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. తాడిపత్రికి చెందిన శ్రీరాములు యాచకుడిగా జీవిస్తున్నారు. అదే వృత్తిలో ఉన్న ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా ఒక కూతురు శ్రీరాములు ద్వారా జన్మించినట్లు తెలిసింది. శ్రీరాములు కూతురితో పరశురాం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ జరగ్గా శ్రీరాములిని బండరాయితో కొట్టి పరశురాం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

News July 18, 2024

పార్వతీపురం: రూ.80కి చేరిన టమాట

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో టమాటా ధర జనాలను ఠారెత్తిస్తోంది. ప్రస్తుత బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా రూ.80 వరకు పలుకుతోంది. వారం రోజుల వరకు రూ.40 ధర ఉండేది. స్థానికంగా టమాటా పంట లేకపోవడంతో ఇతర ప్రదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు రవాణా ఛార్జీల భారం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. ధరల నియంత్రణ పై చర్య చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News July 18, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు గమనిక

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.22837 హటియా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ ఈ నెల 29, ఆగస్టు 5, 12, 19, 26వ తేదీలలో విజయవాడ- ఏలూరు మీదుగా కాక.. విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.

News July 18, 2024

అమరావతి: CRDAలో పోస్టుల భర్తీకి ఆమోదం

image

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA)లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ.. సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ ఈనెల 10న పురపాలక శాఖకు లేఖ రాశారు. దీనికి ఆమోదం తెలుపుతూ.. మూడేళ్ల కాలపరిమితితో 75 ఒప్పంద పోస్టులను, పొరుగుసేవల పద్ధతిలో 68 పోస్టులను నింపేందుకు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి GO జారీ చేశారు.

News July 18, 2024

ఆచంటలో బోరు నుంచి వింత శబ్దాలు UPDATE

image

ఆచంటలో వాడకంలో లేని చేతి పంపు బోరు నుంచి మంగళవారం వింత శబ్దాలు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం నిపుణుల సమక్షంలో దానికి మూత వేసి, ఇసుక, బ్యాలెట్ పౌడర్‌తో పూడ్చి వేశారు. వాడకంలో లేకపోవడం, ఈ భూమిలోపల హైడ్రో కార్బన్ వాయువు ఉండడంతో జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రక్రియను ఓఎన్‌జీసీ విపత్తుల నివారణ నరసాపురం ఇన్‌ఛార్జ్ రవి,అగ్నిమాపక అధికారి వైవీ జానకీరామ్ పర్యవేక్షించారు.

News July 18, 2024

అంబానీ వివాహ వేడుకలో కోనసీమ ఘనాపాఠీలు

image

అంబానీ వివాహ వేడుకలో కోనసీమ జిల్లా వాసులు పాల్గొన్నారు. నందంపూడి, పాసర్లపూడిలంక, ఇందుపల్లి, అమలాపురానికి చెందిన విశ్వనాథ్, భార్గవ్, సాంబశివ, కమలేష్‌ ఘనాపాఠీలు వధూవరులతో పూజలు చేయించారు. వీరంతా హైదరాబాద్‌లోని వేదభవన్‌లో 13 ఏళ్లపాటు ఘనాపాఠీ కోర్సు పూర్తి చేశారు. పెళ్లి వేడుకకు నెలరోజుల ముందుగానే వీరి ఎంపిక జరిగిందని ..పెళ్లి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.