India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
10వ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. గుంటూరు డివిజన్లో 29, తెనాలి డివిజన్లో 28, నరసరావుపేట డివిజన్లో 53 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ABPM అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. SHARE IT.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కడప డివిజన్లో 28, ప్రొద్దుటూరు డివిజన్లో 30 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఈ నెల 18 నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆమె కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1403 సర్వే బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం జరుగుతుందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేజీహెచ్తో పాటు ఆంధ్ర మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ మాట్లాడారు. విశాఖలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తరాంధ్ర వాసులకు ఎన్నో సేవలు అందిస్తున్నాయన్నారు. గత ప్రభుత్వం ఆసుపత్రిలో సౌకర్యాల విషయంలో అశ్రద్ధ చూపిందని ఆరోపించారు.
విజయవాడ- గూడూరు, గూడూరు- విజయవాడ రైళ్లను పునరుద్ధరించారు. డబ్లింగ్, సిగ్నలింగ్ పనుల వల్ల ఇటీవల ఈ రైళ్లను రద్దు చేయగా.. వీటిని పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే GM అరుణ్ కుమార్ జైన్కు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఉదయం లేఖ పంపారు. స్పందించిన రైల్వే శాఖ రద్దయిన ఆ రైళ్లను పునరుద్ధరించింది. వీటి రద్దు సమయంలో ఒంగోలు-బాపట్ల-తెనాలి ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం తామరపల్లికి చెందిన ఎం.భవాని హత్య కేసులో ఆమె భర్త శ్రీనుకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి విజయ్ గౌతమ్ సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీధర్ తెలిపారు. 2021 OCT 13న తన కుమార్తె భవానీని భర్త శ్రీను హత్య చేశాడని గుత్తుల శేషారావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారన్నారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిండితుడికి శిక్ష విధించారని తెలిపారు.
గంట్యాడ మండలం పెనసాంకి చెందిన కడుపుట్ల రమణమ్మ గత నెల 28న పొలంలో పనులు చేస్తున్న సమయంలో పాముకాటుకు గురైంది. వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రిలో చేరిందని, అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ తరలించారని గంట్యాడ ఎస్సై సురేంద్ర నాయుడు తెలిపారు. ఆమె ఈరోజు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆమె మేనల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నుంచి పొదిలికి వస్తున్న ఆర్టీసీ బస్సులో నీటి లీకేజీతో ప్రయాణికులు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఆదివారం ‘పొదిలి బస్సులోకి నీళ్లు’ అని Way2Newsలో <<13630523>>ఓ కథనం<<>> ప్రచురితమైంది. ఈ ఘటనపై APSRTC యాజమాన్యం స్పందించింది. ‘ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి క్షమించండి.. త్వరగా సమస్య పైన చర్యలు తీసుకుంటామని’ ‘X’లో పోస్ట్ చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సగటు దినసరి కూలీ రూ.300 కూలీ మొత్తానికి చేరుకునేలా పనులు కల్పించాలని కలెక్టర్ రాజకుమారి ఎంపీడీఓలు, సంబంధిత ఏపీడీలను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లో ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.250 వేతనాన్ని అధిగమించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 161 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.