Andhra Pradesh

News July 15, 2024

కాటసాని నాపై దాడికి యత్నం: మల్లెల రాజశేఖర్

image

పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తెలిపారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కాటసానిని విమర్శించినందుకు తనపై కక్ష పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిపై ఎస్పీ క్రిష్ణకాంత్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

News July 15, 2024

తాటిపూడి జలాశయంలో మృతదేహం కలకలం

image

గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం సాయంత్రం లభ్యమైందని గంట్యాడ ఎస్‌.ఐ సురేంద్ర నాయుడు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 45 – 50 మధ్య ఉంటుందన్నారు. మూడు రోజుల క్రితమే ఈ సంఘటన జరిగి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. స్థానిక VRO సమాచారంతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు పోలీస్ స్టేషన్‌‌ను సంప్రదించాలన్నారు.

News July 15, 2024

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

రామాపురం మండలం పాలన్న గారి పల్లె దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాలన్న గారి పల్లెకు చెందిన నాగభాస్కర్ రోడ్డు దాటుతుండగా.. గుర్తు తెలియని స్కూటర్ ఢీ కొనడంతో కిందపడ్డాడు. వెంటనే వేగంగా వచ్చిన కారు అతడిని ఢీ కొట్టడంతో తల నుజ్జునుజ్జయి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 15, 2024

తిరుపతి: ఇద్దరిని బలి తీసుకున్న లారీ

image

తల్లి, బిడ్డ చనిపోయిన విషాద ఘటన తిరుపతి జిల్లాలో జరిగింది. శ్రీకాళహస్తి(M) రామానుజపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శారద(22), కుమార్తె గురువైష్ణవి (2), కుమారుడు గురు కార్తిక్(4)తో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రామానుజపల్లి క్రాస్ వద్ద బస్సు దిగారు. భర్త వస్తాడని రోడ్డు పక్కన కూర్చొన్న వాళ్లపైకి చెన్నై వెళ్తున్న లారీ దసూకొచ్చింది . శారద, వైష్ణవి చనిపోగా కార్తిక్ చికిత్స పొందుతున్నాడు.

News July 15, 2024

ఓటమి తర్వాత ఒంగోలుకు బాలినేని

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి బాలనేని ఓటమి తర్వాత ఇవాళ ఒంగోలుకు వస్తున్నారు. అంతే కాకుండా ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని పలు మార్లు ప్రచారంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయంపై నియోజకవర్గం ప్రజలు ఎదురుచూస్తున్నారు. వైఎస్సార్ జయంతిన చాలా మంది కార్పొరేటర్లు దూరంగా ఉండటం కూడా నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

News July 15, 2024

నందిగాం: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి.కృష్ణారావు గుండెపోటుతో మృతి చెందారు. నందిగాం మండలం కల్లాడ గ్రామానికి చెందిన కృష్ణారావు కాకినాడ డీసీఆర్బీలో ఏఎస్సైగా పని చేశారు. కాకినాడలోని రాయుడుపాలెంలో తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కృష్ణారావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News July 15, 2024

అనంత: రైతు సేవాకేంద్రాల్లో పశుగ్రాస జొన్న విత్తనాల పంపిణీ

image

అనంతపురం జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీతో పశుగ్రాస జొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి ఆదివారం వరకు రైతు సేవాకేంద్రాలు, పశువైద్యశాలల్లో పశుగ్రాస వారోత్సాలను నిర్వహించామన్నారు. పశుపోషణకు ఉపయోగపడే విధంగా 55 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. 75శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.

News July 15, 2024

నాయుడుపేట గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత

image

నాయుడుపేట పట్టణంలోని ఎల్ ఏ సాగరం వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ బాలుర గురుకులంలో కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి 89 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురుకులంలో అర్బన్ హెల్త్ క్లినిక్ వైద్యులు, విద్యార్థులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

News July 15, 2024

నేడు కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరణ

image

ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రే ఎస్పీ నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఎస్పీలు శనివారం బదిలీ అయిన విషయం తెలిసిందే. ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి విధుల్లో చేరనుండటంతో ఇంతకు ముందు పనిచేసిన ఎస్పీ జీఆర్ రాధిక సోమవారం రిలీవ్ అయ్యి నేరుగా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయనున్నారు.

News July 15, 2024

తూ.గో.: కొడుకు బర్త్ డే.. యాక్సిడెంట్‌లో తల్లి మృతి

image

ప.గో.జిల్లా వాసి సత్యశ్రీనివాస్ బర్త్‌డే సందర్భంగా తల్లిదండ్రులు, సోదరితో కలిసి ద్వారకాతిరుమలకు దర్శనానికి కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా తూ.గో. జిల్లా నల్లజర్ల మండలం అచ్చన్నపాలెంలో మూవీ చూశారు. సోదరిని అత్తవారింట్లో దించి వస్తానని వారిని అక్కడే ఉండమని చెప్పాడు. ఈ క్రమంలో తల్లి సుబ్బలక్ష్మి, తండ్రి బసవరాజు రోడ్డు దాడుతుండగా వారిని కారు ఢీ కొంది. ఆసుపత్రికి తరలిస్తుండగా సుబ్బలక్ష్మి చనిపోయింది.