India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మరో శ్వేతపత్రం విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు ఏపీ సీఎంఓ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై స్వయంగా సీఎం చంద్రబాబు వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయనున్నారు.
* CM చంద్రబాబు బయోపిక్ షూటింగ్ ప్రారంభం
* బాపట్ల: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి
* గుంటూరు: మహిళతో సహజీవనం..
* మంగళగిరిలో రోడ్డు ప్రమాదంలో.. బాలుడి మృతి
* అంబానీ పెళ్లి వేడుకల్లో గుంటూరు MP పెమ్మసాని
* గుంటూరులో వ్యక్తి మృతి.. హత్యా? ఆత్మహత్యా?
* రేపల్లేలో గంజాయి అమ్ముతున్న 10 మంది అరెస్ట్
* టీడీపీ నేత మృతి.. సంతాపం తెలిపిన మంత్రి లోకేశ్
* ఫిరంగిపురంలో 178 క్వింటాళ్ళ బియ్యం పట్టివేత
*విజయవాడ రైల్వే డివిజన్పై CBI దృష్టి, * జగన్పై పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు, *ఎన్టీఆర్: అన్న హత్యకు తమ్ముడే సూత్రధారి, *విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు క్లోజ్, * కృష్ణా: ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు, * కేతిరెడ్డి చెప్పిన మాట నిజం: పేర్ని నాని, *ఫారిన్ అమ్మాయితో..NTR జిల్లా అబ్బాయి పెళ్లి, , *ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటా: MP బాలశౌరి, *మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై వేటు,
మాజీ మంత్రి దివంగత పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ ఆదివారం ఆయన స్మారకార్థం అధునాతన ఆంబులెన్స్ అందజేసింది. ఈ మేరకు పర్వతనేని ఫౌండేషన్, లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఆదివారం సీఎం చంద్రబాబుకు అంబులెన్స్ను అందజేశారు. కాగా ఉపేంద్ర 1996-99 మధ్య విజయవాడ లోక్సభ సభ్యుడిగా పనిచేశారు.
ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం శివారులోని ఫ్యాక్టరీలో ఆదివారం ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజు మాంజీ(24) భార్యపై అనుమానంతో ఫ్యాక్టరీలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాంజీ స్వస్థలం బిహార్లోని గాయ్ఘాట్.
తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం పుత్తేరిలో రైతు సేవా కేంద్ర భవనం ప్రారంభించారు. సంబంధిత శిలాఫలకంలో సీఎం చంద్రబాబు ఫొటో పెట్టినా.. ఆయన పేరును మాత్రం విస్మరించారు. ఎలాంటి ప్రొటోకాల్ లేని స్థానికుల పేర్లును సైతం అందులో పెట్టి సీఎం పేరు విస్మరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ASIగా విధులు నిర్వహిస్తున్న జి.కృష్ణారావు(59) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణారావుకు గుండెపోటు రావడంతో కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణ వార్త విని తోటి అధికారులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రాజమండ్రిలో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో విజయవాడకు చెందిన యశ్వంత్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అండర్-11 సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. యశ్వంత్ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నాడు. అనంతరం యశ్వంత్ను కోచ్ దామోదరరెడ్డి, భార్గవి, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
నందలూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడగా కండక్టర్ రాముడు(40) మాత్రం మృతి చెందారు. ప్రమాద సమయంలో కండక్టర్ బస్సులో నుంచి బయటికి ఎగిరిపడ్డారు. తిరిగి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో లారీలో ఉన్న ఐరన్ కాయిల్ మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.
బలిజిపేట మండలంలో వివాహిత మృతదేహం కలకలం రేపింది. గంగాడ గ్రామానికి చెందిన సావిత్రి (56) మిస్సింగ్కు సంబంధించి కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఆమె భర్త, కొడుకు కలిసి హత్య చేశారని మృతురాలి మేనల్లుడు తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.