Andhra Pradesh

News July 12, 2024

విశాఖ: ‘రెండో శనివారం సెలవు ఇవ్వాలి’

image

విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు రెండవ శనివారం తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం రెండవ శనివారం సెలవుగా ప్రకటించినప్పటికీ జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు.

News July 12, 2024

గుంటూరు: ఆ స్టేషన్‌కు 5రోజుల్లో నలుగురు సీఐలు

image

గడిచిన 5రోజుల్లో నల్లపాడు పీఎస్‌కు నలుగురు CIలు మారారు. నల్లపాడు CIగా పనిచేస్తున్న నరేశ్ కుమార్ తొలుత సెలవుపై వెళ్లడంతో CI వెంకన్నచౌదరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. మరుసటి రోజు నరేశ్ సెలవుల నుంచి వచ్చి విధుల్లో చేరగా, సాయంత్రానికి ఆయన్ను VRకి పంపారు. ఎస్సై సత్యనారాయణకు గురువారం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. సాయంత్రానికి ఒంగోలు SEBలో చేస్తున్న వంశీధర్‌కు CIగా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు.

News July 12, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక విభాగాల పరిశీలనకు కమిటీ

image

విశాఖ ఉక్కు కర్మాగారంలో బ్లాస్ట్ ఫర్నేస్, రోలింగ్ మిల్స్, కోకో వెన్ విభాగాల పనితీరు మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సెయిల్ నుంచి ముగ్గురు అధికారుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. కమిటీలో టాపస్ దాస్ గుప్తా, సమీర్ రాయ్ చౌధురి (బిలాయ్ స్టీల్ ప్లాంట్), ప్రకాష్ బొండేకర్ (దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్) ఉన్నారు. వీరు త్వరలో విశాఖ ఉక్కును సందర్శించనున్నారు.

News July 12, 2024

రాయచోటి: 13న సాఫ్ట్ బాల్ జట్టు ఎంపిక

image

ఈనెల 13వ తేదీన రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ జట్టు ఎంపికలు జరుగుతాయని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి, సెక్రటరీ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు ఉమ్మడి వైయస్సార్ జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు హాజరు కావచ్చని తెలిపారు.

News July 12, 2024

పూర్వ వైభవం సంతరించుకోనున్న చంద్రగిరి కోట

image

జిల్లాలోని చారిత్రాత్మక చంద్రగిరికోట త్వరలోనే పూర్వ వైభవం సంతరించుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ.100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా పునరుద్ధరించనున్న పర్యాటక ప్రాంతాల్లో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఈ కోటకు ప్రాధాన్యం దక్కింది. కోటలోని రాజ మహల్, రాణి మహల్, పుష్కిరిణి, ఉద్యానవనం, పురాతన దేవాలయాలను అధికారులు సుందరంగా తీర్చిదిద్దనున్నారు.

News July 12, 2024

32,255 మంది కౌలు రైతులకు CCRC కార్డులు పంపిణీ చేయాలి: జేసీ

image

కర్నూలు జిల్లాలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ ద్వారా కౌలు రైతులకు సకాలంలో CCRC కార్డులు పంపిణీ చేయాలని JC నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. జిల్లాకు 22 వేల మంది కౌలుదారులకు CCRC కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందన్నారు. అయితే జిల్లాలో ఆ సంఖ్యను 32,255కు పెంచామని తెలిపారు.

News July 12, 2024

మంత్రి లోకేశ్‌ను కలిసిన పత్తికొండ ఎమ్మెల్యే

image

మంత్రి నారా లోకేశ్‌ను టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గురువారం కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను లోకేశ్‌కు వివరించారు. టీడీపీ నాయకుడి హత్య అనంతరం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారాయుడుకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని శ్యామ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

News July 12, 2024

బూదవాడ ప్రమాద ఘటన.. మరొకరు మృతి

image

జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ కర్మాగారం ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా గురువారం అర్ధరాత్రి మరొకరు ప్రాణాలు వదిలారు. మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూదవాడకు చెందిన అర్జున్ తుది శ్వాస విడిచారు. ఆయన ఈ ఫ్యాక్టరీలో కొన్నేళ్ల నుంచి పని చేస్తున్నారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.

News July 12, 2024

ATP: ఆప్కోలో 50 శాతం వరకు ప్రత్యేక తగ్గింపు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆప్కో ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాలలో 30 నుంచి 50 శాతం వరకు చేనేత వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నట్లు ఆప్కో మండల వాణిజ్య అధికారి మధుబాబు తెలిపారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆప్కో దుకాణాల్లో ప్రజలకు కావలసిన వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రెండు జిల్లాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 12, 2024

ప్రకాశం: సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని డీఈవో సుభద్ర చెప్పారు. సీఎంవో, ఐఈసీవో, ఏ ఎల్ఎస్సీవో, ఏఎస్వీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. స్కూలు అసిస్టెంట్లను ఫారిన్ సర్వీసుపై నియమిస్తారు. జడ్పీ, మునిసిపల్ యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూలు అసిస్టెంట్లు పోస్టులకు అర్హులన్నారు. ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.