Andhra Pradesh

News July 10, 2024

మంగళగిరి TDP కార్యాలయంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

image

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

News July 10, 2024

చింతూరు: ప్రమాదంలో SEB కానిస్టేబుల్ మృతి

image

మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్డులో మంగళవారం జరిగిన ప్రమాదంలో చింతూరు SEB స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఎండీ చాంద్ భాషా (52) మృతి చెందారు. తులసిపాక సమీపంలో వ్యూ పాయింట్ వద్ద భాషా మృత దేహం పడిఉండటాన్ని గమనించిన పర్యాటకులు 108కు సమాచారం ఇచ్చారు. భాషా విధులు ముగించుకొని చింతూరు నుంచి బైకుపై మారేడుమిల్లి వైపు వస్తుండగా ఘటన జరిగింది. ఆయన కాకినాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.

News July 10, 2024

కర్నూలు జిల్లాలో తొమ్మిది మందిపై వేటుకు రంగం సిద్ధం!

image

కర్నూలు జిల్లాలోని అటవీ శాఖ పరిధిలో తొమ్మిది మంది ఉద్యోగులు, అధికారులపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జిల్లాలోని పర్యావరణ విధ్వంసంపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. తన పరిధిలోని నలుగురికి డీఎఫ్‌వో ఛార్జిమెమోలు జారీ చేశారు. అటవీ ప్రాంతాన్ని పరిరక్షించడంలో పలువురు ఉద్యోగులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు సమాచారం. దీంతో మొత్తంగా తొమ్మిది మందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశముంది.

News July 10, 2024

రాపూరులో దారుణం.. దివ్యాంగురాలిపై అత్యాచారం

image

నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం జరిగింది. మతిస్థిమితం సరిగా లేని దివ్యాంగురాలిపై ప్రేమకుమార్ (25) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాపూరు ఎస్ఐ మాల్యాద్రి పేర్కొన్నారు. నిందితుడు పరారిలో ఉండటంతో ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News July 10, 2024

ఆకివీడు: ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక సూసైడ్

image

 ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆకివీడు మండలం ఉప్పరగూడెంకు చెందిన కిరణ్‌ కుమార్‌ ప్రేమపేరుతో వేధిస్తున్నాడని.. దీంతో ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లి ఆరోపించారు. ఘటనపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

News July 10, 2024

అల్లూరి జిల్లాలో కూలిన చెట్టు.. నిలిచిన రాకపోకలు

image

పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి కోట్లగరువు వద్ద రోడ్డుకి అడ్డంగా భారీ వృక్షం కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్డుకి అడ్డంగా ఈ వృక్షం కూలిపోయింది. దీంతో పాడేరు విశాఖ వైపు మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాహనాల్లో ఒక 108 వాహనం ఉంది. స్థానికుల సహాయంతో చెట్టు తొలగిస్తున్నారు.

News July 10, 2024

BREAKING: వైసీపీ నుంచి సిద్ధారెడ్డి సస్పెండ్

image

కదిరి మాజీ ఎమ్యెల్యే పి.వి సిద్ధారెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆరోపణలు ఉండటంతో పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు.

News July 10, 2024

సీఎం చంద్రబాబు భోగాపురం పర్యటన వివరాలు

image

ఈనెల 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకు ఆయన హెలికాప్టర్లో భోగాపురం చేరుకుంటారు. 12.35 నుంచి 1.30 వరకూ భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించి, సమీక్షిస్తారు. 1.35 నిమిషాలకు హెలిపాడ్‌కు చేరుకుని విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.

News July 10, 2024

విశాఖ: రైల్వే అభివృద్ధి పనులపై ఎంపీల ఆరా

image

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు ఆరా తీసారు. విశాఖ డిఆర్ఎం కార్యాలయంలో రైల్వే డివిజన్ అధికారులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు ప్రయాణికులకు అందుతున్న సేవలు సౌకర్యాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ పాల్గొన్నారు.

News July 10, 2024

చిత్తూరు జిల్లాలో 68 మందికి మెమోలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 68 మంది టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులకు డీఈఓ దేవరాజు మెమోలు జారీచేశారు. వాటిని డీవైఈఓ, ఎంఈవోలకు పంపారు. సక్రమంగా ఫేషియల్ అటెండెన్స్ వేయకుండా విధులకు డుమ్మా కొట్టడంతో మెమోలు జారీ చేసినట్లు చెప్పారు. 24 గంటల్లో లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.