India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంబేడ్కర్ జయంతి సందర్భంగా రేపు(ఏప్రిల్14న) రద్దు అయినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించడంతో ఈ ప్రకటన జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ ఆఫీస్తో పాటు, జీవీఎంసీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పీజీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇంటర్ ఫలితాల్లో పామిడికి చెందిన రామచంద్ర నాయక్, రమాదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సత్తా చాటారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన యువతి బైపీసీ విభాగంలో 1000కి 984 మార్కులు సాధించారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ మార్కులు వచ్చాయని గీతాంజలి తెలిపారు. అధ్యాపకులు, స్నేహితులు, బంధు మిత్రులు అభినందించారు.
సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బొమ్మ నుంచి డైకాస్ రోడ్డు వరకు రూ.2.7 కోట్లతో సెంటర్ లైటింగ్, డివైడర్, ఫుట్ పాత్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గాంధీనగర్ రోడ్డును ఆదివారం పరిశీలించారు. గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ పట్టిందని, త్వరలోనే అత్యంత సుందరంగా నిర్మిస్తామని ఆయన తెలిపారు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.2,67,800/- లు,పూజలు, విరాళాల రూపంలో రూ.78,417/-లు, ప్రసాదాల రూపంలో రూ.1,76,405లు స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని చెప్పారు.
దర్శికి చెందిన అన్నిబోయిన లక్ష్మి (45) కురిచేడు మండలం బోధనంపాడు వద్ద దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం పొలాల్లో లక్ష్మిని గుర్తుతెలియని వ్యక్తి రాయితో కొట్టి చంపేశాడు. తరువాత అతను కూడా గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతోశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.
ఖుర్దా డివిజన్లో ఇంటర్ లాకింగ్ పనుల వలన విశాఖ మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ ఆదివారం తెలిపారు. ఈనెల16 నుంచి 23వరకు విశాఖ -హిరకుడ్(20807/08), భువనేశ్వర్ – LTT (12879/80), (22865/66), (20471/72), (20823/24), (22827/28), (20861/62) నంబర్ గల రైళ్లు విజయనగరం, తిట్లాఘర్, సంబల్పూర్ మీదుగా ఝార్సుగూడ చేరుకుంటాయన్నారు.
బ్లడ్ క్యాన్సర్ బారిన పడి కోలుకుంటున్న కర్నూలు జిల్లా విద్యార్థిని ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. గోనెగండ్లకు చెందిన సృజనామృత బైపీసీలో 440కు గానూ 420 మార్కులతో ప్రతిభ చూపారు. కర్నూలులోని ఓ కళాశాలలో చదువుతన్న బాలిక క్యాన్సర్ను జయిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించండంపై అధ్యాపకులు అభినందించారు. తండ్రి ఉరుకుందు గౌడ్ ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకొస్తానని బాలిక తెలిపారు.
పులిచెర్ల మండలంలో విషాదం నెలకొంది. అయ్యవారిపల్లెకు చెందిన సురేశ్-లత దంపతుల కుమారుడు దిలీప్ (12) శనివారం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. వారు బెంగళూరు నుంచి ఉగాదికి స్వగ్రామానికి వచ్చారు. పొలం వద్ద చెల్లెలితో దిలీప్ ఆడుకుంటుండగా పొరపాటున బాల్ బావిలో పడింది. దాన్ని తీసుకునేందుకు వెళ్లిన దిలీప్ నీటిలో మునిగి మృతి చెందాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.