Andhra Pradesh

News July 4, 2024

ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక స్టాక్ వివరాలు

image

జిల్లాలో 08 స్టాక్ పాయింట్ల‌లో 3.69లక్షల క్యూబిక్ మీట‌ర్ల మేర ఇసుక‌ అందుబాటులో ఉందని NTR జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. * పెండ్యాల (కంచిక‌చ‌ర్ల): 19,781* మాగ‌ల్లు (నందిగామ): 36,366* కొడ‌వ‌టిక‌ల్లు (చంద‌ర్ల‌పాడు): 9,713* అల్లూరుపాడు (వ‌త్స‌వాయి): 3,040* అనుమంచిప‌ల్లి (జ‌గ్గ‌య్య‌పేట): 56,820* పోలంప‌ల్లి (వ‌త్స‌వాయి): 922* కీస‌ర (కంచిక‌చ‌ర్ల): 1,49,703* మొగులూరు (కంచిక‌చ‌ర్ల): 93,243

News July 4, 2024

పిన్నెల్లికి జగన్ వంత పాడటం సిగ్గుచేటు: మంత్రి స్వామి

image

సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వంతపాడటం సిగ్గుచేటని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో వైసీపీ శ్రేణులు మారణ హోమం సృష్టించాయని ఆయన మండిపడ్డారు. ఎలక్షన్‌లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదని విమర్శించారు.

News July 4, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలకు వర్ష సూచన

image

ఉమ్మడి కర్నూల్ జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 4, 2024

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం

image

వేంపల్లె(M) ఇడుపాలపాయలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. బుధవారం రాత్రి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి లోనికి తీసుకెళుతుండగా మెుయిన్ గేటు వద్ద సెక్యూరిటీకి పట్టుబడ్డారు.అధికారులు గురువారం కోర్ కమిటీ సమావేశం నిర్వహించి ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొపెసర్ ఏవీఎస్ కుమారసవామి వారికి టీసీ ఇచ్చినట్లు తెలుస్తుంది. గంజాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చారనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం.

News July 4, 2024

జగన్ నువ్వు మంచి చేయలేదు.. ముంచేశావ్: నారా లోకేశ్

image

మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారా లోకేశ్ విమర్శలు చేశారు. ‘జగన్ నువ్వు మంచి చెయ్యలేదు.. ముంచేశావ్’ అని ‘X’ వేదికగా పోస్ట్ చేశారు. నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గురువారం పరామర్శించిన జగన్.. మీడియాతో మాట్లాడారు. తాము ఎన్నికల్లో మంచి చేసి ఓడిపోయామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై లోకేశ్ తాజాగా స్పందించారు.

News July 4, 2024

దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ పవన్ పూజలు

image

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాధికాలు నిర్వహించారు. ఆయన ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం సూర్యారాధన చేశారు. దీక్షాబద్ధులైన పవన్ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు.

News July 4, 2024

జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైంది: రాంప్రసాద్ రెడ్డి

image

జగన్ మళ్లీ జైలుకు వెళ్లే సమయం ఆసన్నమైందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. 21 రోజుల్లోనే చంద్రబాబు ఏమీ చేయలేదని జగన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నేతలపై కక్ష సాధించే ఆలోచన టీడీపీకి లేదన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే, ఐదేళ్లలో మాచర్లలో నరమేధం సృష్టించారని ఆరోపించారు.

News July 4, 2024

VZM: 11 నెలలుగా కోమాలో.. నేడు మృతి

image

కొమరాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్న ఎం. సత్యనారాయణ గురువారం మృతి చెందినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. గతేడాది ఆగస్టు 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమయ్యింది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన నేడు మృతి చెందినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు మౌనం పాటించి నివాళులర్పించారు.

News July 4, 2024

తూ.గో.: BREAKING: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

అమలాపురం రూరల్ మండలం కామనగురువు పంచాయతీ పరిధిలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ఢీకొన్న ఘటనలో బట్నవిల్లి గ్రామానికి చెందిన తొత్తరమూడి బుల్లి సత్యనారాయణ (53) అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

News July 4, 2024

విజయవాడలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

అజిత్ సింగ్ నగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు గురువారం సాయంత్రం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్ఆర్ పేట వద్ద స్థానికులు మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వచ్చి పరిశీలించగా మగ మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 సం. మధ్య ఉంటుందన్నారు. మృతుడి ఆచూకీ ఎవరికైనా తెలిసిన యెడల పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.