Andhra Pradesh

News July 9, 2024

తిరుపతి: దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ స్పందన

image

కాంట్రాక్టు స్టాఫ్ నర్సుపై దాడి ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభుకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. గాయపడిన నర్సు యశోదకు ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందించాలని, సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. రుయా ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ నర్సుల అసోసియేషన్ అధ్యక్షులు మంజుల దేవి ప్రభుత్వ ప్రధాన కార్య దర్శికి వినతి పత్రం అందజేసి రక్షణ కల్పించాలని కోరారు.

News July 9, 2024

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: విశాఖ పోలీసులు

image

నకిలీ ఫోన్లతో సైబర్ మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఫెడెక్స్ కొరియర్ పేరిట అనేక మందిని మోసం చేశారని, ఈ కొరియర్ పేరిట ఎవరు ఫోన్ చేసినా నమ్మవద్దని సూచించారు. ఫోన్ చేసి మీ ఆధార్‌పై ఫోన్ నెంబరు రిజిస్టర్ అయిందని, ఈ ఫోన్ ను ముంబయిలో ఒక వ్యక్తి దేశద్రోహానికి పాల్పడే వాటికి ఉపయోగిస్తున్నారని బెదిరింపులకు దిగి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

News July 9, 2024

మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థులకు తీవ్ర గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఎస్సై వెంకటసుబ్బయ్య వివరాల ప్రకారం.. స్థానిక నీరుగట్టువారిపల్లె ఎస్టీ హాస్టల్ విద్యార్థులు ముగ్గురు బైక్‌పై చంద్ర కాలనీ వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాలనీ వద్ద వారి బైకు అదుపుతప్పి కింద పడ్డారు. క్షతగాత్రల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.

News July 9, 2024

కడప జిల్లాలో ఇసుక స్టాక్ యార్డులు.. ధరల వివరాలు

image

జిల్లాలో మొత్తం 11 ఇసుక స్టాక్ యార్డులు సిద్ధంగా ఉన్నాయి. టన్ను ఇసుక ధరల వివరాలు.. కొండాపురం మండలంలోని కె. వెంకటాపురం, పి. అనంతపురంలో రూ.340, కమలాపురంలో రూ.341, సిద్దవటం మండలంలోని జ్యోతిగ్రామంలో రూ.340, గోపవరంలో రూ.468, పోరుమామిళ్లలో రూ.587, పెండ్లిమర్రి మండలం పడగాలపల్లె, కొత్తూరుల్లో రూ.340, వీఎన్ పల్లె మండలంలోని ఎర్రబల్లెలో రూ.340, పులివెందులలో రూ.468, మైదుకూరులో రూ.400గా ధరలు ఉన్నాయి.

News July 9, 2024

రన్‌వే విస్తరణకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్

image

ఓర్వకల్లు విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా విమానాశ్రయ అధికారులను ఆదేశించారు. సోమవారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు డెవలప్‌మెంటు అధికారులతో సమీక్షించారు. రన్‌వే విస్తరణకు కావాల్సిన నిధులు, తదితర వివరాలతో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. విమానాలు రాత్రి సమయంలో దిగేందుకు అనువైన చర్యలు చేపట్టాలన్నారు.

News July 9, 2024

ఒంగోలు: ప్రిన్సిపల్‌ను హత్య చేసిన విద్యార్థి

image

ఒంగోలుకు చెందిన రాజేశ్ బాబు అస్సాంలో హత్యకు గురయ్యాడు. అస్సాంలో రాజేశ్ ప్రిన్సిపల్‌గా, కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేసేవాడు. అక్కడ ఓ విద్యార్థికి తక్కువ మార్కులు రావడం, ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆయన శనివారం మందలించాడు. తల్లిదండ్రులను తీసుకురావాలని ఆదేశించాడు. దీంతో ఆ విద్యార్థి కక్ష పెంచుకొని సాయంత్రం రాజేశ్ క్లాస్ చెబుతుండగా.. కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

News July 9, 2024

ఇసుక అక్రమ నిల్వలపై విచారణకు స్పీకర్ ఆదేశం

image

నర్సీపట్నం గబ్బడ ఇసుక డిపోలో అక్రమ నిల్వలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 65 వేల టన్నుల ఇసుకపై విచారణ చేపట్టాలన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని తెలిపారు. రూ.వందల కోట్లు దోచుకున్న ఇసుక మాఫియాను బయటపెట్టాలన్నారు. దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తొలగించినట్లవుతుందన్నారు. దీంతో అధికారులు విచారణ చేపట్టబోతున్నారు.

News July 9, 2024

నేడు ఉమ్మడి అనంతపురం జిల్లా జడ్పీ సమావేశం

image

ఉమ్మడి అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జడ్పీ సమావేశం జరగనంది. ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈఓ వైఖోమ్‌ నిదియాదేవి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్యెల్యేలు, జడ్పీటీసీలు హాజరుకావాలని కోరారు.

News July 9, 2024

ATP: భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకుని

image

బత్తలపల్లి మండలం తంభాపురంలోని వైఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మన్న (80) భార్య లక్షమ్మ పింఛన్ డబ్బులు ఇవ్వలేదని ఈనెల 6న రోకలి బండతో కొట్టారు. దీంతో ఆమె మృతి చెందింది. మద్యం మత్తులో భార్యను హత్య చేసిన ఆయన నిందితుడిగా ముద్ర పడిందని మనస్తాపం చెందారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మండలంలోని చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గుంతకల్లు నుంచి తిరుపతి వెళ్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 9, 2024

ఏలూరు: UPDATE.. కారు దిగడంతో దక్కిన ప్రాణం

image

ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద <<13586316>>యాక్సిడెంట్‌లో<<>> ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. రాజమండ్రి రూరల్‌లోని రాజవోలుకు చెందిన భాగ్యశ్రీకి HYDలో ఇంటర్వ్యూ ఉండగా.. పేరెంట్స్ కమలాదేవి-నారాయణరావు, పిల్లలు నాగ నితీశ్, నాగషణ్ముక్‌తో కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా నారాయణరావు విజయవాడలో దిగేశారు. అంతలో యాక్సిడెంట్ జరిగి భాగ్యశ్రీ, కమల, నితీశ్ మృతి చెందారు. నాగశ్రీ భర్త నాగార్జున ప్రైవేట్ ఉద్యోగి.