Andhra Pradesh

News July 6, 2024

పదో తరగతి పాఠ్యాంశంలో పాడేరు మోదకొండమ్మ జాతర

image

పాడేరులో జరిగే మోదకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలో చేర్చింది. ప్రతి ఏటా మే నెలలో మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది. ప్రభుత్వం మోదకొండమ్మ జాతరను పదో తరగతి పాఠ్యాంశంలో పెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 6, 2024

హైకోర్టు ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా ప్రకాశం జిల్లా వాసులు

image

ఏపీ హైకోర్టులో ప్రభుత్వ సహాయ ప్లీడర్లుగా (AGP) ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అహమ్మద్, కొల్లూరి అర్జున్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 3వ తేదీ జీవో జారీ చేయగా వారు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వారు.. చిన్న వయసులోనే AGPగా హైకోర్టుకు ఎంపిక కావడంపై జిల్లా వాసులు, తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

News July 6, 2024

గుంతకల్లు: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

గుంతకల్లు మండలంలోని నల్లదాసరిపల్లి గ్రామ సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం ఉదయం బోయ ఆవుల లక్ష్మన్నను కొందరు హత్య చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. అల్లుడు చంద్రశేఖర్, రాజశేఖర్, సతీశ్‌లను అరెస్టు చేశారు. హత్యకు గల కారణం భార్యను కాపురానికి పంపలేదని, తనను అవమానించినందుకు హత్య చేసినట్లు రూరల్ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ సురేశ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

News July 6, 2024

కోవూరు: గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం

image

కోవూరు: సాలుచింతల సమీపంలోని ముళ్లపొదల్లో వృద్ధురాలి మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. శనివారం ఉదయం పొదల వద్ద నుంచి దుర్వాసన వస్తుండడంతో అటుగా వెళ్లి స్థానిక యువకులు చూడగా మహిళ మృతదేహం కనిపించింది. మహిళ మృతిచెంది నాలుగు రోజులు అయ్యి ఉంటుందని, శరీరం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నట్లు తెలిపారు. నెల్లూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

చిత్తూరులో బాలుడిని నేలకేసి కొట్టి చంపిన సవతి తండ్రి

image

బాలుడిని సవతి తండ్రి నేలకేసి కొట్టి చంపిన ఘటన చిత్తూరులో జరిగింది. ఎస్‌ఐ వెంకటసుబ్బమ్మ వివరాల ప్రకారం.. చిత్తూరు రూరల్ దిగువ మాసపల్లికు చెందిన శిరీషకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె మొదటి భర్తకు దూరంగా ఉంటూ ప్రదీప్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. ప్రదీప్ తాగిన మైకంలో శిరిష ఏడాదిన్నర కొడుకు దినేశ్‌ను నేలకేసికొట్టి చంపాడు. శిరిష ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2024

రూ.90 నాణేన్ని సేకరించిన అమలాపురం వాసి

image

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఏర్పడి 9 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా కోల్‌కతాలో మొట్ట మొదటిసారి రూ.90 నాణేన్ని ముద్రించారు. ఆ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ఆ నాణెం 40 గ్రాముల బరువు ఉండి, పూర్తిగా వెండితో తయారు చేసి ఉన్నట్లు తెలిపారు. నాణేనికి ఒక వైపు రూ.90 ముఖ విలువ, మరో వైపు రిజర్వ్ బ్యాంక్‌ చిహ్నం ముద్రించి ఉందని కామేశ్వర్ చెప్పారు.

News July 6, 2024

హైదరాబాద్‌లో శ్రీకాకుళం వాసి నురగలు కక్కుకుని మృతి

image

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురానికి చెందిన డ్రైవర్ ఢిల్లీ రావు(38) హైదరాబాద్‌లో నురగలు కక్కుకుని మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. నేపాల్ నుంచి చీపురు కట్టల లోడుతో హైదరాబాదులోని జవహర్‌నగర్‌కు చేరుకున్నారు. లోడ్ దించిన అనంతరం డ్రైవర్‌ను లేపుదామని క్లీనర్ వెళ్లగా నురగలు కక్కి మృతిచెందాడు. అంతకుముందు అతడు 2 మాత్రలు వేసుకుని, ENO తాగాడని క్లీనర్ తెలిపాడు. పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.

News July 6, 2024

కొరియర్ ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

సైబర్ నేరగాళ్లు చేసే కొరియర్ ఫ్రాడ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాధిక సూచించారు. సైబర్ నేరగాళ్లు కాల్ చేసి తాను పోలీస్ అధికారినని మీ పేరు మీద వచ్చిన కొరియర్లో అక్రమ ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలు ఉన్నాయని, దాని కారణంగా మీ మీద FIR నమోదు చేశామని చెప్పి, మోసం చేస్తున్నారని ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

News July 6, 2024

సింగరాయకొండలో యువకుడు దారుణ హత్య

image

సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పోలేరమ్మ దేవస్థానం ఎదురుగా ఓయువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. బాపట్ల జిల్లాకు చెందిన గోపి (35), లక్ష్మీ అనే మహిళతో సహజీవనం సాగిస్తున్నారు. ఇటీవల లక్ష్మీ వేరే వ్యక్తితో చనువుగా ఉండడంతో గొడవలు జరుగుతున్నాయి. అక్రమసంబంధాల కారణంగా గోపి హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News July 6, 2024

తాడేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

తాడేపల్లి డీజీపీ ఆఫీసు సమీపంలో వడ్డేశ్వరం బైపాస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికే లారీ కింద పడ్డాడని పలువురు తెలిపారు. మరోవైపు లారీని ఎంత కంట్రోల్ చేసినా ఆగలేదని డ్రైవర్ చెప్పారు. పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు వడ్డేశ్వరం వాసిగా భావిస్తున్నారు.