India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైసీపీ నేతల అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈ మేరకు చంద్రబాబు అమరావతిలో శనివారం టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జగన్ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలని చెప్పారు. అలాగే పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపైనా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీడీపీ శ్రేణులకు తెలియజేశారు.
మొగిలి ఘాట్ నందు ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలను వచ్చే వారంలోపు పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ రహదారులు మరియు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. మొగిలి ఘాట్ వద్ద చెక్ పోస్ట్ను ఏర్పాటు చేసి ఒక అంబులెన్స్, క్రేన్ను అందుబాటులో ఉంచాలన్నారు. హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
కలెక్టర్ DK బాలాజీని గుడివాడ RDO జి.బాలసుబ్రమణ్యం శనివారం కలిశారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఛాంబర్లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ RDO బాలసుబ్రమణ్యంకు పలు సూచనలు చేశారు. అనంతరం RDO తన కార్యాలయానికి చేరుకొని పదివి బాధ్యతలు స్వీకరించారు.
గొల్లపూడి మార్కెట్ యార్డ్లోని ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ను కలెక్టర్ జి.సృజన శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఈవీఎంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోడౌన్కు వేసిన సీల్లు, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
పెండ్లిమర్రి మండలంలోని బుడ్డాయ పల్లె సమీపంలోని మైన్స్ వద్ద ఉన్న గుంతల్లో పడి శనివారం ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. బుడ్డాయ పల్లెలోని బంధువుల ఇంటికి వచ్చిన శ్రీనివాసులు రెడ్డి పశువులను మేపుకుంటూ మైన్స్ సమీపంలోని గుంతల వద్దకు వెళ్లాడు. పశువులను బయటికి తోలే క్రమంలో అదుపుతప్పి గుంతలో పడి గల్లంతయ్యాడు. పెండ్లిమర్రి ఎస్సై మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కోనసీమ, కాకినాడ రూరల్, తుని, సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి, అనపర్తి తదితర ప్రాంతాల్లోని ప్రజల సెల్ఫోన్లకు సందేశాలు పంపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థనాథ్ సింగ్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు, ప్రజలకు అందించిన సహకారంపై చర్చించారు. అలాగే, పోలవరం, అమరావతికి ఇస్తున్న సహకారానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
కడప పట్టణానికి చెందిన ఇందిరా ప్రియదర్శిని ఉత్తమ సోషల్ మీడియా పురస్కారం అందుకున్నారు. శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఇందిరా ప్రియదర్శిని ప్రస్తుతం తిరుపతిలో ఉంటూ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల మీద సామాజిక మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు.
టీడీపీ ప.గో. జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఇటీవలే APIIC ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన్ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు.
మార్కాపురంలో ఈ నెల 25న జరిగిన నియోజకవర్గం స్థాయి స్కూల్ గేమ్స్లో పొదిలి విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. వాలీబాల్ అండర్ -17, అండర్-14 విభాగంలో విజయం సాధించి జిల్లా వాలీబాల్ టీంకి అండర్ -17లో పి. చరణ్, డి. హర్షవర్ధన్ పి. బ్రహ్మ చరణ్, అండర్ -14 విభాగంలో ఏ.సాత్విక్, వ. జీవన్ చందులు ఎంపికైనట్లు ఆ పాఠశాల పీడీ కె. స్టీఫెన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.