Andhra Pradesh

News July 5, 2024

కుటుంబ తగాదాలు.. గోదావరిలో దూకి సూసైడ్

image

దేవరపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మెరిపో కిషోర్(33) గురువారం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిశోర్.. రోడ్డు కం రైలు వంతెనపై మోటారు సైకిల్, చెప్పులు విడిచిపెట్టి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. అతడి మృతదేహం లభ్యమైంది.

News July 5, 2024

ప్రజావేదిక శిథిలాలు అక్కడే.?

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక కూల్చివేసిన వేసిన విషయం తెలిసిందే. కాగా.. ఆ ప్రజావేదిక శిథిలాలను తొలగించకుండా అక్కడే ఉంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగన్ వంటి విధ్వంసకర నాయకుడి చేతిలోకి మళ్లీ రాష్ట్రం వెళ్లకుండా గుర్తుండేలా ఈ శిథిలాలను అలాగే ఉంచాలన్నారట. 2019లో జగన్‌కి ప్రజలు అధికారమిస్తే ఇటువంటి విధ్వంసకర పాలన చేశారని మండిపడ్డట్లు సమాచారం.

News July 5, 2024

అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా నేడు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 5, 2024

కర్నూల్: ‘ఉపాధి’లో 78 మందికి షోకాజ్ నోటీసులు

image

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లక్ష్యాలను సాధించడంలో అలసత్వం వహించిన 78 మంది ఉపాధి అధికారులు, సిబ్బందికి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మిగనూరు, కర్నూలు, ఆదోని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లు, 10 మండలాల ఏపీవోలు, ఈసీలు, దాదాపు అన్ని మండలాల్లోని పలువురు సాంకేతిక సహాయకులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

News July 5, 2024

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024కు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యా శాఖ అధికారి శైలజ గురువారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ..http//nationalaward-stoteacher. education.gov.in వెబ్సైట్ ద్వారా నిర్దేశించిన మార్గదర్శకాలు అనునరిస్తూ.. జులై 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఒ కోరారు.

News July 5, 2024

మార్కాపురం: వ్యాపారి కిడ్నాప్.. వదిలేసిన రైతులు

image

మార్కాపురం మండలం బిరుదులనరవకు చెందిన వ్యాపారి వెంకట్ రెడ్డి గొట్టిపడియకు చెందిన రైతులనుంచి మిరపకాయ డబ్బులు రూ.1.30 కోట్లు ఎగ్గొట్టడంతో <<13561112>>బుధవారం రైతులు<<>> అతనిని కిడ్నాప్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి 8 గంటలకు గ్రామ శివారులో రైతులు అతనిని విడిచిపెట్టారు. అప్పు ఎవరు తీరుస్తారని రైతులు పోలీసులు వద్ద వాపోయారు.

News July 5, 2024

అందుకే మంత్రి పదవి రాలేదేమో: బొబ్బిలి ఎమ్మెల్యే

image

మంత్రి పదవి రాకపోవడంతో బొబ్బిలి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిపల్లి జ్యోతిబాపులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్లు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ‘నేను డిగ్రీ కూడా పూర్తి చెయ్యలేదు.. అందుకనే మంత్రి పదవి రాలేదేమో’ అని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. చదువు చాలా అవసరమని ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలను చేరుకోవాలని వారికి సూచించారు.

News July 5, 2024

బంటుమిల్లి: భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

image

బంటుమిల్లి మండలం చిన్నతుమ్మిడిలో మంగళవారం రాత్రి జరిగిన హత్య కేసుకు సంబంధించి హతుని భార్య కీర్తనను బందరు రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కీర్తన తన భర్త అప్పారావును స్క్రూ డ్రైవర్‌తో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా నిందితురాలు కీర్తనకు బంటుమిల్లి కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై వాసు తెలిపారు.

News July 5, 2024

శ్రీకాకుళం: అనారోగ్యంతో MRO మృతి

image

మెళియాపుట్టి మండలం తొవ్వూరుకు చెందిన ఎమ్మార్వో చలమయ్య(50) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన 2014-2018 వరకు అదే విధులు నిర్వహించారు. 2023 నుంచి సంతబొమ్మలి మండలంలో విధులు నిర్వహించారు. అనంతరం ఎన్నికల విధుల్లో భాగంగా సుబ్బవరానికి బదిలీ అయ్యారు. కాగా ఇటీవలె ఆయన తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో విశాఖపట్నానికి తరలించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచినట్లు బంధువులు తెలిపారు.

News July 5, 2024

కడప: ఉద్యోగం రాలేదని యువకుడు సూసైడ్

image

కడప ఎర్రముక్కపల్లిలోని ఓ లాడ్జిలో ఉరి వేసుకొని చీర రంజిత్(25) సూసైడ్ చేసుకున్నట్లు 1టౌన్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు చెందిన రంజిత్ 2 రోజుల కిందట కడపలోని స్నేహితుడు ప్రశాంత్ రెడ్డి అక్క పెళ్లికి వచ్చాడు. లాడ్జిలో స్నేహితులతో కలిసి బసచేశాడు. పలుపోటీ పరీక్షలు రాసినా ఉద్యోగం రాలేదు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేదని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాని పోలీసులు తెలిపారు.