India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాయవరం, కాకినాడలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ ఆటల పోటీల్లో మండపేటకు చెందిన విద్యార్థులు వివిధ విభాగాల్లో ఉత్తమ క్రీడా ప్రతిభను కనబరిచి రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి అండర్-14, 17 విభాగాల్లో టెన్నికాయట్ లో బల్ల సత్యనారాయణ, కే.శివశంకర్ ప్రసాద్, ఖండవల్లి చైతన్యలు ఎంపికయ్యారు.
ప్రజలకు గృహాలు కల్పించడం అనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత కలిగిన అంశమని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. శనివారం బాపట్ల మూలపాలెం రహదారిలోని లే అవుట్లో గృహ నిర్మాణా లబ్ధిదారులతో మన ఇల్లు-మన గౌరవం అనే కార్యక్రమం ద్వారా ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మార్చి 2025 నాటికి పెండింగ్లో ఉన్న గృహాలు మొత్తం పూర్తి చేయాలని సూచించారు. గృహాల పురోగతి కోసం ప్రత్యేకంగా సచివాలయాల సిబ్బందిని నియమిస్తామన్నారు.
నెల్లూరు నగరం వేదయపాలెం రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలను వదిలేసి వెళ్లినట్టు ప్రయాణికులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రయాణికులు 108 సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఆమెను వివరాలు అడగగా.. తన పేరు బుజ్జమ్మని మిగిలిన వివరాలు చెప్పలేకపోయిందని అధికారులు తెలిపారు.
స్వామి వారి లడ్డూ కల్తీ జరిగినట్లయి ఆ దేవుడు కూడా ఎవరినీ క్షమించడని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్లో శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదంపై మీడియాతో మాట్లాడారు. వారికి అనుకూలమైన అధికారులు, లాబోరేటరీలో పరీక్షలు చేయించి, రిపోర్టులు సేకరించి, గత ప్రభుత్వంపై నిందలు వేయడం మంచిది కాదన్నారు.
కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జే.మహిత్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ శనివారం తెలిపారు. ఇటీవల పాడేరులో జరిగిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో తమ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొన్నారన్నారు. అయితే షటిల్ బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలకు మహిత్ ఎంపికయ్యారని అభినందించారు.
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం యన్.ఎ.సి(స్కిల్ హబ్) లో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి.మధుసూదన్ రావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 220 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ. పీజీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. 18-30 వయసు వారు అర్హులన్నారు.
రూ.11 లక్షల రుణం తీసుకుంటే రూ.43 లక్షలు కట్టాలంటున్నారని కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ మంత్రి నారా లోకేశ్కు ప్రజా దర్బార్లో వినతిపత్రం అందజేశారు. కుటుంబ అవసరాల కోసం రూ.11 లక్షల రుణం తీసుకున్నామని, డాక్యుమెంట్ తనఖా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి సేల్ డీడీ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు వడ్డీతో సహా రూ.43 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
రాబోవు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టాలని, పోలీసు అధికారులను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అనధికారికంగా బాణసంచా తయారీ, నిల్వలు, రవాణా వంటి వాటిని నియంత్రించి ముందస్తు ప్రమాదాలను నిలువరించే దిశగా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
రూ.11 లక్షల రుణం తీసుకుంటే రూ.43 లక్షలు కట్టమంటున్నారని కాకినాడ (D)కు చెందిన ఓ మహిళ మంత్రి నారా లోకేశ్కు ప్రజా దర్బార్లో వినతిపత్రం అందజేశారు. కుటుంబ అవసరాల కోసం రూ.11 లక్షల రుణం తీసుకున్నామని డాక్యుమెంట్ తనకా రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పి సేల్ డీడీ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేశారని మహిళ కన్నీటి పర్యంతమైంది. ఇప్పుడు వడ్డీతో సహా రూ.43 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు రానున్న 5 రోజుల్లో తేలికపాటి వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకరబాబు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు, పశు, గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 37.0 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు 26.0 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.