Andhra Pradesh

News July 4, 2024

NTR హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరుకు ఫ్లైఓవర్: ఎంపీ చిన్ని

image

విజ‌య‌వాడ ఆర్థిక వృద్ధిని పున‌ః నిర్మించ‌డానికి దోహ‌ద‌ప‌డే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒప్పుకున్నట్లు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం గ‌డ్క‌రీతో స‌మావేశ‌మ‌య్యారని చెప్పారు. ఈ ఫ్లైఓవర్ NTR హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 4, 2024

రోడ్డు ప్రమాదంలో వరికుంటపాడు MEOకి గాయాలు

image

ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద జాతీయ రహదారిపై కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వరికుంటపాడు మండల విద్యా శాఖా ధికారి షావుద్దీన్ కి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన ఎంఈఓను వేరే వాహనంలో ఆసుపత్రి తరలించారు. విధులు నిర్వహించుకొని తిరిగి కనిగిరిలోనే తన నివాసానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

News July 4, 2024

వెల్దుర్తి: టీడీపీ కార్యకర్త దారుణ హత్య

image

వెల్దుర్తి మండల పరిధిలోని మిట్టమీద‌పల్లె గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త హనిమిరెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందినక కార్యకర్త గురువారం గ్రామ శివారులో చనిపోయి ఉండటం గమనించిన గ్రామస్థులు వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హనిమిరెడ్డి మెడపై కొట్టి చంపినట్లు తెలుస్తోంది.

News July 4, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పెందుర్తి-పినగాడ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన మధు (30) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి దేవరాపల్లి మండలం అలమండ గ్రామానికి చెందిన యువతితో ఏడాదిన్నర కిందట పెళ్లిజరిగింది. వీరికి ఓ పాప ఉంది. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.

News July 4, 2024

VZM: నిరుద్యోగ యువతకు శుభవార్త

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కేంద్రీయ గిరిజన వర్శిటీతో పాటు వీటీ అగ్రహారంలో ఉన్న నాక్ శిక్షణ కేంద్రంలో స్కిల్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉండి కనీసం 8వ తరగతి చదివిన వారికి 3 నెలల పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామన్నారు. ఆసక్తి గల వారు తక్షణమే రెండు కేంద్రాల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

News July 4, 2024

కృష్ణా: ‘100 పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌లు ఏర్పాటు’

image

జిల్లాలో ఎంపిక చేసిన 100 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ కిచెన్ గార్డెన్‌ల ఏర్పాటుపై సమీక్షించారు. పెరటి తోటల పెంపకం పట్ల విద్యార్థులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ తాహేరా సుల్తాన తదితరులు పాల్గొన్నారు.

News July 4, 2024

తిరుపతి: మామిడి తోటలో దాచిన ఎర్రచందనం దుంగలు స్వాధీనం

image

అటవీశాఖ తిరుపతి నిఘా విభాగం అధికారులు గురువారం పుత్తూరు సమీపంలో నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు సమీపంలో గొల్లపల్లిలో ఉన్న మామిడి తోటలో స్మగ్లర్లు తరలించడానికి ప్రయత్నించిన 947 కిలోల బరువున్న 125 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు.

News July 4, 2024

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటూ జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా శాఖాపరంగా పథకాల అమలు, వాస్తవ పరిస్థితులు, పెండింగ్ అంశాలను తన దృష్టికి తీసుకురావాలన్నారు.

News July 4, 2024

గోపాలపురం: ACCIDENT.. యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన గోపాలపురం మండలం దొండపూడిలో గురువారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలంలోని ఊట్లగూడేనికి చెందిన సురేశ్(27), స్నేహితుడు రాంప్రసాద్‌తో కలిసి బైక్‌పై గోపాలపురం వెళ్తున్నారు. దొండపూడి వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టాడు. ఇద్దరికీ గాయాలవగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సురేశ్ మరణించాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు SI సతీశ్ చెప్పారు.

News July 4, 2024

మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డ మడకశిర ఎమ్మెల్యే

image

అనంతపురం నగరంలోని R&B లో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే MS.రాజు గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రిమినల్స్‌ను మంచి వాళ్లని చెప్పడం జగన్‌కు మాత్రమే సాధ్యపడిందని అన్నారు. జగన్‌కు వచ్చిన మానసిక రోగానికి సరైన మందులు వాడాలని ఎద్దేవా చేశారు.