Andhra Pradesh

News September 28, 2024

రాష్ట్ర హైకోర్టు జడ్జిని కలిసిన కర్నూలు ఎస్పీ

image

కర్నూలుకు విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ జస్టిస్ కే.మన్మథ రావును ఎస్పీ జీ.బిందు మాధవ్ శనివారం ఉదయం కర్నూలులోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్‌లో కలిశారు. పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News September 28, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో 4వేల మందిని తొలగిస్తారా.?: అయోధ్యరాం

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒకేసారి 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిందని స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన తెలియజేయడంతో యాజమాన్యం దిగివచ్చిందన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టామన్నారు.

News September 28, 2024

నెల్లూరు: ‘తూకాలు తక్కువగా తూస్తే చర్యలు’

image

వ్యాపారులు కాటాల్లో తేడాలు చేసి తక్కువగా తూస్తే కఠిన చర్యలు తప్పవని తూనికల కొలతల శాఖ జిల్లా డిప్యూటీ కంట్రోలర్ కే ఐసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్‌లో ఆయన తనిఖీలు చేశారు. పలు దుకాణాల కాటాలను పరిశీలించారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా కాటాలను రెన్యువల్ చేయించుకోవాలన్నారు.

News September 28, 2024

బుసరాజుపల్లి స్కూల్ టీచర్‌పై పోక్సో కేసు

image

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి APTWR స్కూల్‌ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన డ్రాయింగ్ టీచర్ మురళీకృష్ణపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. ITDA డిప్యూటీ డైరెక్టర్ నాయుడు శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

News September 28, 2024

రాజమండ్రి: చిక్కని ‘చిరుత’.. వర్షాలే కారణమా..?

image

కడియం నర్సరీలలోకి వచ్చిన చిరుత జాడ కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు. 20 ట్రాప్ కెమెరాలు, 2 బోనులు, 4 నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినా చిరుత కదలికలు నమోదు కావడం లేదు. భారీ వర్షాల కారణంగా చిరుత బయటకు రావడం లేదేమోనని, అందుకే ఆచూకీ లభించడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వదంతులు వస్తే నమ్మి భయపడిపోవద్దని ప్రజలకు సూచిస్తున్నారు.

News September 28, 2024

తేలినీలాపురంలో విదేశీ పక్షుల సందడి

image

టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. ప్రతిఏటా సైబీరియా నుంచి సెప్టెంబర్ నెలాఖరుకు వచ్చే ఈ విదేశీపక్షులు ఏప్రిల్ వరకు ఇక్కడ విడిది కేంద్రంలో విడిది చేస్తాయి. పెలికాన్, పెయింటెడ్ స్టార్క్స్ అనే రెండు రకాల పక్షులు సుదూర తీరాలు దాటి టెక్కలి మండలం తేలినీలాపురం గ్రామానికి వచ్చి ఇక్కడ చింత చెట్లపై నివసిస్తాయి. అటవీశాఖ అధికారులు వాటిని పర్యవేక్షిస్తారు.

News September 28, 2024

నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టేయండి: పోలీసులు

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని మంగళగిరి రూరల్ సీఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దాడి జరిగిన సమయంలో సురేశ్ అక్కడే ఉన్నట్లు నిర్ధారించి దాడికి కుట్ర పన్నిన వారిలో ఆయనను కీలక వ్యక్తిగా పోలీసులు నివేదిక అందించారు. సురేశ్ పాత్రతో పాటు ఇతర నిందితుల పాత్రలు తేల్చాల్సి ఉన్న నేపథ్యంలో బెయిల్ కొట్టేయాలని కోరారు.

News September 28, 2024

నేడు తిరుపతికి సిట్ బృందం రాక

image

తిరుమల లడ్డూ కల్తీ అంశం రాష్ట్రంలో దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం నియమించిన సిట్ బృందం నేడు తిరుపతికి రానుంది. ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలోని ఈ బృందం లడ్డూ కల్తీపై ముమ్మరంగా దర్యాప్తు చేపట్టనుంది. ఇందులో భాగంగా సిట్ బృందం మొదటి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదయిన కేసును తమ పరిధిలోకి తీసుకోనుంది.

News September 28, 2024

హత్యాయత్నం కేసులో.. కడప జైలు వార్డెన్‌కు రిమాండ్

image

అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కడప సెంట్రల్ జైలు వార్డెన్ మహేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కాకినాడకు చెందిన హైకోర్టు ఉద్యోగి భువనేశ్వరికి మహేశ్‌తో ఏప్రిల్‌లో పెళ్లి కాగా.. వీరు గుంటూరు జిల్లా రాయపూడిలో అద్దెకుంటున్నారు. ఆగస్టు 22న మహశ్ తన అత్త సాయికుమారిపై దాడిచేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.

News September 28, 2024

ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తాం: లోకేశ్

image

ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు విద్యాశాఖమంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఉండవల్లిలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఎన్ సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు.