Andhra Pradesh

News July 3, 2024

ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం: సీపీఐ

image

విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ స్పష్టం చేశారు. బుధవారం విశాఖలో సీపీఐ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. గత ప్రభుత్వం అక్రమాలపై విచారణ జరిపి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆయనతో పాటు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

News July 3, 2024

గుంటూరు: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి- 2024లో జరిగిన బీఏ, బీకామ్, బీబీఏ (సెమిస్టర్ ఎండ్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ http://anucde.info/ResultsFeb24.asp చూడాలని పరీక్షల విభాగం తెలిపింది.

News July 3, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి- 2024లో జరిగిన బీఏ, బీకామ్, బీబీఏ(సెమిస్టర్ ఎండ్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ http://anucde.info/ResultsFeb24.asp చూడాలని పరీక్షల విభాగం తెలిపింది.

News July 3, 2024

నంద్యాల కలెక్టర్‌గా శ్రీనివాసులు తనదైన మార్క్..!

image

నంద్యాల జిల్లా కలెక్టర్‌గా డా.కే.శ్రీనివాసులు జిల్లాలో తనదైన మార్క్ వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 5 నెలల పాటు జిల్లాకు సేవలందించారు. కలెక్టర్ హోదాలో ఆయనకు నంద్యాల తొలి పోస్టింగ్ కాగా.. జిల్లా రెండో కలెక్టర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలను ఆయన సమర్థవంతంగా నడిపించారు. జూలై 1న పింఛన్ల పంపిణీలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

News July 3, 2024

తణుకు: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం తణుకు రైల్వే అవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిడదవోలు నుంచి వేండ్ర వరకు టికెట్ తీసుకున్న సుమారు 60 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి కాల్దరి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News July 3, 2024

టెక్కలి: ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి

image

టెక్కలి మండలంలోని కొండ భీంపురం గ్రామ సమీపంలో బుధవారం ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. పెద్ద తామరపల్లి గ్రామానికి చెందిన పోలాకి మధు అలియాస్ వంశీ (30) అనే యువకుడు ట్రాక్టర్‌తో మట్టిలోడు తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పిడ్రైవర్ కూర్చునే ఇంజిన్ భాగం బోల్తా పడింది. దీంతో క్యాబ్లో ఉన్న డ్రైవర్ మృతి చెందాడు. ఈ మేరకు టెక్కలి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News July 3, 2024

పల్నాడు: కుమారుడి మృతి.. తండ్రి కోసం ఎదురుచూపు

image

రాజుపాలెం మండలం ఉప్పలపాడుకి చెందిన కస్తూరి మహేశ్ (30) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. అతని తండ్రి సాంబయ్య సోమవారం పెన్షన్ తీసుకుని పనిమీద ఊరు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళాడు. అయితే అతను వెళ్లిన మరుసటిరోజు కొడుకు చనిపోగా.. తండ్రికి కొడుకు మరణవార్త తెలియకపోవడంతో అంత్యక్రియలు చేయకుండా తండ్రి కోసం ఎదురుచూస్తున్నారు. ఫొటోలో తెల్లచొక్కాతో ఉన్నది కనిపించని తండ్రి, కారులో చనిపోయిన కొడుకు. 

News July 3, 2024

పూరి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

image

పూరి జగన్నాధుడి రథయాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యానికి అన్‌రిజర్వుడ్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే సందీప్ తెలిపారు. విశాఖ-పూరి(08347) ప్రత్యేక రైలు ఈనెల 6,14,16 తేదీల్లో మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రికి పూరి చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరిగి పూరి-విశాఖ(08348) రైలు 8,16,18 తేదీల్లో తెల్లవారుజామున 1.45 గంటలకు పూరిలో బయలుదేరుతుందని తెలిపారు.

News July 3, 2024

12 వరకు నేను బడికి పోతా కార్యక్రమం

image

నెల్లూరు జిల్లాలో బడి బయట పిల్లలను గుర్తించేందుకు గతనెల 13వ తేదీన ‘నేను బడికి పోతా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిని ఈనెల 12వ తేదీ వరకు నిర్వహిస్తామని సమగ్ర శిక్ష ఏపీసీ ఉషారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేసి వారి పిల్లలను బడిలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News July 3, 2024

విశాఖలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

విశాఖలోని కంచరపాలెం వద్ద హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఘటనా స్థలంలోనే తండ్రి మరణించగా.. కొడుకు గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.