India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ వృద్ధురాలు మంగళవారం బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు తన పట్ల అదే గ్రామానికి చెందిన ఇంటి పక్క వీధిలో ఉండే 70 ఏళ్ల వరికూటి సీతారామయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గ్రామీణ సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డీ.హీరేహల్ మండలంలో కేరళ వాసి అబ్దుల్ ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. బళ్లారి-బెంగళూరు హైవేపై ఓ డాబాలో స్వీపర్గా పనిచేస్తున్నాడని, పని ముగించుకుని వెళ్లిన గంట సేపటికే హైవే పక్కన అబ్దుల్ పడి ఉన్నట్లు స్థానికులు గుర్తించి సమాచారం అందించారని పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
బాడంగి మండలం గొల్లాదిలో వీధి కుక్కలు దాడిలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డి.లోకేశ్ ఇంటి నుంచి మంగళవారం బయటకు వెళ్లగా కుక్కలు దాడి చేసి ముక్కు కొరికేశాయి. చెంప, చేతి భాగంలో కూడా గాయాలయ్యాయి. సాయంత్రం చింతాడ లక్ష్మిపై కూడా దాడి చేశాయి. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కలు బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన ప్రారంభంలో నూజివీడు ఆర్టీవోగా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేశారు. మంచి పని తీరుతో ప్రజల ప్రశంసలు పొందారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పనుల విషయంలో అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్గా 2022 ఏప్రిల్లో బాధ్యతలు స్వీకరించారు.
కల్కి 2898 AD’ సినిమాలో ప్రభాస్ నడిపిన ప్రత్యేక కారును భీమవరం ఏవీజీ సినిమాస్ మల్టీప్లెక్స్లో ఆవరణలో మంగళవారం ప్రదర్శించారు. వీక్షకులు భారీగా తరలివచ్చి ఈ కారు ఎదుట సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే ఈ కారులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సందడి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన కల్కి చిత్రం ఘనవిజయం సాధించడంతో మూవీ టీంకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు హనుమంతునిపాడు ఎస్సై తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవినాశ్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరవడంతో గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు.
పొందూరు మండలం చిన్న బొడ్డేపల్లికి చెందిన రాజేశ్వరి(30) హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే
మంగళవారం సంతకవిటి మండలం వాల్తేరులో శుభకార్యానికి ఇద్దరు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వాల్తేరు వెళ్తుండగా తాడివలస సమీపంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. గోపాల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై పలుమార్లు దాడి చేయగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలి మంగళవారం మృతిచెందారు. ఆత్మకూరులో నివాసముంటున్న జీ.నాగలక్ష్మయ్య(58) కొత్తపల్లి మండలం కొత్తమాడుగుల ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. భోజన విరామ సమయంలో ఉన్నఫళంగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న ఉపాధ్యాయుడిని తోటి ఉపాధ్యాయులు ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రైతు బజార్లో ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి వినియోగదారులు క్యూ కడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు టమాటాకు భారీగా డిమాండ్ ఏర్పడడం వల్ల 80 రూపాయల వరకు ధర పలికింది, దీంతో వినియోగదారులు క్యూ కట్టారు. తాజాగా ఉల్లిపాయల ధర కేజీ రూ.36కు చేరుకుంది. రైతు బజార్లో తగినంత సరుకు కూడా లేకపోవడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వినియోగదారులు క్యూలో నిల్చొని ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు.
ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఆర్ఎం నరేంద్ర, ఆనందరావు, పాటిల్ కోరారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్, ఆదాయపు పన్ను శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయ సేకరణ కీలకమని చెప్పారు.
Sorry, no posts matched your criteria.