Andhra Pradesh

News September 28, 2024

ప్రకాశం: టెట్ నిర్వహణకు నాలుగు కేంద్రాల ఎంపిక

image

టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణ కోసం జిల్లాలో కేంద్రాలను ఎంపిక చేసినట్లు DEO సుభద్ర పేర్కొన్నారు. అక్టోబర్ 3&21 వరకు ఉదయం 9.30 నుంచి, మధ్యాహ్నం 2.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. (1)పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులోని కృష్ణచైతన్య విద్యాసంస్థ, (2) మార్కాపురం మండలం దరిమడుగులోని జార్జి కళాశాల, (3) ఒంగోలులో నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చి సంస్థ, బ్రిలియంట్స్‌లో పరీక్షలు జరుగుతాయన్నారు.

News September 28, 2024

విజయనగరం జిల్లా క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా.?

image

1. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది.?
2. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది.?
3. విజయనగరం జిల్లాలోని 4నదుల పేర్లు చెప్పండి?
4. జిల్లాకు చెందిన ద్వారం వెంకటస్వామి నాయుడు ఏ రంగంలో నిష్ణాతుడు.? ఈ ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ రూపంతో తెలియజేయండి.
NOTE: వీటి ఆన్సర్లను ఇదే ఆర్టికల్‌లో మధ్యాహ్నం 3గంటలకు మీరు చూడవచ్చు.

News September 28, 2024

అత్తపై హత్యాయత్నం.. సెంట్రల్ జైల్ వార్డెన్‌‌కు రిమాండ్

image

అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కడప సెంట్రల్ జైలు వార్డెన్ మహేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కాకినాడకు చెందిన హైకోర్టు ఉద్యోగి భువనేశ్వరికి మహేశ్‌తో ఏప్రిల్‌లో పెళ్లి కాగా.. వీరు గుంటూరు జిల్లా రాయపూడిలో అద్దెకుంటున్నారని చెప్పారు. ఆగస్టు 22న మహశ్ తన అత్త సాయికుమారిపై దాడి చేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.

News September 28, 2024

ప్రకాశం జిల్లాలో 42,033 కౌలు రైతు కార్డులు జారీ

image

ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కింద కౌలు రైతులకు 45వేల కార్డులను జారీ చేసేందుకు లక్ష్యంగా ఉంచుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 42,033 కార్డులను జారీ చేయడం జరిగిందని, కౌలు రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందన్నారు.

News September 28, 2024

MLA కొలికపూడి కీలక వ్యాఖ్యలు

image

తిరువూరు MLA సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ఓ పోస్టు తెగ వైరలైవతోంది. ‘అగ్ని పర్వతం బద్దలయ్య ముందు.. భయంకరమైన ప్రశాంతంగా ఉంటుంది’ అని పోస్టు చేశారు. దీంతో ఆయన దేని గురించి ఆ వ్యాఖ్యలు చేసినట్టా అని ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు.

News September 28, 2024

ప.గో: దివ్యాంగ బాలికకు కారు డ్రైవర్ వేధింపులు

image

సరిగా మాట్లాడటం కూడా రాని మానసిక దివ్యాంగ బాలికపై కారు డ్రైవర్ వేధింపులకు పాల్పడిన ఘటన ప.గో జిల్లా కాళ్ల మండలంలో జరిగింది. 5వ తరగతి చదువుతున్న బాలికను ఏలూరుకు చెందిన కృపారావు ఈనెల 19న కారులో తీసుకెళ్లి వేధించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికెళ్లాక ఆ బాలిక పేరెంట్స్‌కు చెప్పడంతో వారు ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కృపారావును అరెస్ట్ చేశామని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.

News September 28, 2024

అనంత: 10 ఏళ్ల చిన్నారిపై VRA అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు

image

అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరులో నిన్న పదేళ్ల చిన్నారిపై వృద్ధుడు తిరుపాలు అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. అతను ఆ గ్రామ VRAగా పనిచేస్తున్నారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు తిరుపాలుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పుట్లూరు ఎస్సై హేమాద్రి తెలిపారు.

News September 28, 2024

విజయనగరం జిల్లాకు 2 కుంకీ ఏనుగులు

image

విజయనగరం జిల్లాకు 2 కుంకీ ఏనుగులు రానున్నట్లు సమాచారం. మన జిల్లాలో ఏనుగులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి ఏపీకి 4 ఏనుగులను రప్పిస్తుండగా.. అందులో విజయనగరానికి 2 కుంకీలు వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రం నుంచి ఐదు మంది ట్రాకర్లను అక్కడకు పంపి శిక్షణ ఇప్పించి, మచ్చిక చేసుకోనున్నారు.

News September 28, 2024

వచ్చే నెల 1న పత్తికొండకు సీఎం రాక

image

పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామానికి అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి పర్యటన వివరాలను వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు పుచ్చకాయలమాడకు చేరుకుని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

News September 28, 2024

గాజువాక: హెల్మెట్ ఉన్నా.. భార్య, కూతురికి తప్పని శోకం

image

గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో షీలా నగర్ రహదారిపై శుక్రవారం డాక్ యార్డ్ ఉద్యోగి దిలీప్ కుమార్(33) మృతిచెందిన విషయం తెలిసిందే. అల్లూరి జిల్లా హుకుంపేటకు చెందిన ఇతను పెందుర్తి మం. సరిపల్లిలో ఉంటున్నారు. విధులు ముగించుకొని బైకుపై వెళ్తుండగా టోల్ గేట్ సమీపంలో లారీ ఢీకొనగా, దిలీప్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. హెల్మెట్ ఉన్నా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు రోదించారు.