India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎస్.వెంకటేశ్వర్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. సెకండరీ హెల్త్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన తిరుపతి కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 64వేల ఎకరాల పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈనెల 13న సాగునీరు విడుదల చేయనున్నట్లు జలవనరులశాఖ డీఈఈ ధమలపాటి రవికుమార్ తెలిపారు. ఈ ఖరీఫ్లో వీరఘట్టం, పాలకొండ, బూర్జ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వంగర మండలాలకు సాగునీటిని ప్రణాళిక బద్ధంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బేరిపేటకు చెందిన కోరాడ హరీష్ కుమార్ కేదార్నాథ్ యాత్రలో జనసేన జెండాను ఎగరవేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 21 సీట్లకు 21 గెలవడం, అలాగే తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినందుకు ఈ యాత్ర ప్రారంభించానని తెలిపాడు.
ముసునూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వేమూరి సత్యనారాయణ(40) అనే వ్యక్తి అనారోగ్య కారణాలతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. సత్యనారాయణ ఆసుపత్రి భవనంపై నుంచి కింద పడి ఉండటాన్ని అక్కడి వారు మంగళవారం గుర్తించారు. వెంటనే మండల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నంద్యాల జిల్లా కలెక్టర్గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆమె ప్రస్తుతం గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ డా.కే.శ్రీనివాసులు బదిలీ అయ్యారు. కాగా ప్రభుత్వం ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రావిరాల మహేశ్ కుమార్ రానున్నారు. మహేశ్ కుమార్ ప్రస్తుతం APSWREIS సెక్రటరీగా పని చేస్తున్నారు. కాగా.. ఇక్కడి నుంచి బదిలీ అయిన హిమాన్షు శుక్లా పోస్టింగ్ గురించి మెన్షన్ చేయలేదు.
సత్యసాయి జిల్లా కలెక్టర్గా చేతన్ టీఎస్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం జిల్లా కలెక్టర్గా ఉన్న అరుణ్ బాబును పల్నాడు జిల్లా కలెక్టర్గా నియమించారు.
పల్నాడు జిల్లా కలెక్టర్గా పి.అరుణ్ బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యసాయి జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న అరుణ్ బాబు పల్నాడు కలెక్టర్గా రానున్నారు. అరుణ్ బాబు గతంలో నరసరావుపేట, గురజాల ఆర్డీవోగా పని చేశారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ శ్రీకేశ్ బాలాజీ బదిలీ అయ్యారు. ఆయన పోస్టింగుపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజును బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో భాగంగా జిల్లా నూతన కలెక్టర్గా లోతేటి శివశంకర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్గా విజయరామరాజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో కలెక్టర్లను బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన శ్రీకాకుళం కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో ఆయన నేతృత్వంలోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది.
Sorry, no posts matched your criteria.