Andhra Pradesh

News September 28, 2024

ప్రకాశం: 2018లో బాలుడి హత్య.. చేధించిన పోలీసులు

image

ప్రకాశం జిల్లా అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన బాలుడి హత్య కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించి, ప్రస్తుతం పామూరు సీఐ భీమా నాయక్, అప్పటి అర్థవీడు ఎస్సై రవీంద్రనాథ్ రెడ్డి, కోర్టు లైజన్ కానిస్టేబుల్ వరదయ్యలను ఎస్పీ ఏర్ దామోదర్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోలీసు అధికారులకు ఎస్పీ ఆఫీసులో ప్రశంశా పత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపు లభిస్తుందన్నారు.

News September 28, 2024

7వ తేదీ నుంచి జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీలు

image

ఉమ్మడి అనంతపురం జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీలు 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా స్కేటింగ్ అదరపు కార్యదర్శి రవి బాల, జిల్లా స్కేటింగ్ కోచ్ నాగేంద్ర పేర్కొన్నారు. చిలమత్తూరు మండలం టేకులోడులో స్కేటింగ్ బోర్డు ఎంపికలు ఉంటాయన్నారు. 8న అనంతపురంలో మా రోలర్ స్కేటింగ్ అకాడమీలో రింక్ పోటీలు, 9న వడియంపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News September 28, 2024

కాకినాడ ఎంపీకి కీలక బాధ్యతలు

image

పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈ మేర‌కు లోక్‌స‌భ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ ఉత్ప‌ల్ కుమార్ సింగ్ బులెటిన్ విడుద‌ల చేశారు. పార్లమెంట్ ర‌వాణా, ప‌ర్యాట‌కం, సాంస్కృతిక క‌మిటీ స‌భ్యులుగా ఎంపీ టి. ఉద‌య్ శ్రీ‌నివాస్(జ‌న‌సేన‌) నియామకం అయ్యారు. ఇదే కమిటీలో వైసీపీ ఎంపీ వి.విజ‌య‌సాయి రెడ్డి కూడా ఉన్నారు.

News September 28, 2024

‘రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీలలో పథకాలు సాధించండి’

image

తూర్పుగోదావరి జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి అండర్-14, 17 బాల బాలికల రైఫిల్ షూటింగ్ పోటీలలో జిల్లా షూటర్లు పథకాలు సాధించాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిడ్డయ్య కోరారు. శుక్రవారం రైఫిల్ షూటింగ్ అకాడమీలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు రైఫిల్ షూటింగ్ కార్యదర్శి ఎంఎండీ బాషా బహుమతులు అందజేశారు.

News September 28, 2024

కృష్ణా: గృహ నిర్మాణ లబ్ధిదారులతో అవగాహన సదస్సులు

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించి గృహ నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుండి గృహ నిర్మాణంపై క్షేత్రాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 28న జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లలోనూ, కమ్యూనిటీ హాళ్లలోనూ గృహ నిర్మాణాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.

News September 28, 2024

పేద ఖైదీలకు సాయం అందించాలి: ప్రకాశం కలెక్టర్

image

బెయిల్ వచ్చిన షూరిటి లేక ఇబ్బంది పడుతున్న పేద ఖైదీలకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందించాలని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపవర్మెంట్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఖైదీల బైయిల్ వివరాలు, స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగబోయే జాతీయ లోక్ ఆదాలత్ ద్వారా ఖైదీలకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.

News September 28, 2024

ఈనెల 29న జిల్లాకు రానున్న మంత్రి సత్యకుమార్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తొలిసారి కడప జిల్లాకు రానున్నారు. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరులో జిల్లా కార్యకర్తల సమావేశం, నగర ప్రముఖులతో సమావేశం ఉంటుంది. 30వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు సర్వజన ఆసుపత్రి పర్యటన అనంతరం, కడప రిమ్స్ ఆసుపత్రిలో ఆడిటోరియం, ల్యాబ్‌లను ప్రారంభిస్తారు. అనంతరం కడప నగరంలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.

News September 28, 2024

పాడేరు: విలువల జోడింపుతో మెరుగైన ఆర్థిక లబ్ది

image

ముడి వస్తువులకు విలువలు జోడింపు ద్వారా నాణ్యత పెరగడమే కాకుండా మెరుగైన ఆర్ధిక లబ్ది చేకూరుతుందని అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం న్యూడిల్లీలో స్పైసెస్ బోర్డు, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నిర్వహించిన వర్క్ షాప్‌కు కలెక్టర్ హాజరయ్యారు. మంచి పరిశుభ్రత పద్ధతులలో సుగంద ద్రవ్యాలైన మిరియాలను సరైన పక్వ స్థితిలో సేకరించాలని, సేకరించిన మిరియాలకు అదనపు విలువలు జోడించాలన్నారు.

News September 28, 2024

నెల్లూరు: వచ్చే నెల 3 నుంచి టెట్ పరీక్ష

image

ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబుల్ టెస్ట్) పరీక్షను అక్టోబర్ 3 నుంచి 21వరకు నిర్వహించనున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. ఈ పరీక్షలు జిల్లాలోని PBR విశ్వోదయ కళాశాల (కావలి), RSR కళాశాల (కడనూతల), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ( నెల్లూరు), అయాన్ డిజిటల్ సెంటర్ (పొట్టేపాలెం)లో జరుగుతాయన్నారు. అభ్యర్థులు సమయానికి అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలన్నారు. ఏదో ఒక ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.

News September 28, 2024

విశాఖ- కిరండూల్ రైళ్లు దంతెవాడ వరకు కుదింపు

image

విశాఖ- కిరండూల్ మధ్య నడుస్తున్న రైళ్లు వర్షాల కారణంగా ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు దంతెవాడకు కుదించినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ శుక్రవారం తెలిపారు. ఈ రైళ్లు విశాఖ నుంచి దంతెవాడ తిరుగు ప్రయాణంలో దంతెవాడ నుంచి విశాఖకు చేరుకుంటాయని తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.