Andhra Pradesh

News June 30, 2024

శ్రీకాకుళం: ఇన్స్టంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఇన్స్టంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ చివరి ఏడాది 5 సెమిస్టర్ థియరీ సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన రెగ్యులర్ అభ్యర్థులకు ఇన్స్టంట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారని డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. 4, 6వ సెమిస్టర్ ఇంటర్న్‌షిప్ వరకు ఉత్తీర్ణులై ఉండాలి. జులై 5వ తేదీలోగా పరీక్ష ఫీజు రూ.1000 చెల్లించాలి. పరీక్ష జులై 9న ఉంటుంది.

News June 30, 2024

తెల్లవారుజామున రోడ్డుప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

కొవ్వూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ABN డిగ్రీ కాలేజ్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

విజయవాడలో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

రామలింగేశ్వర నగర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు పటమట ఎస్సై శాతకర్ణి తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు వెళ్లి పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని తెలిపారు. మృతుడి వయసు సుమారు 50సం. వరకు ఉంటుందని చెప్పారు. మృతిని ఆచూకీ తెలిసిన ఎడల పటమట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

News June 30, 2024

తెల్లవారుజామున రోడ్డుప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

image

కొవ్వూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు.. కొవ్వూరు ABN డిగ్రీ కాలేజ్ వద్ద డివైడర్‌ను ఢీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొవ్వూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

కృష్ణా: పెన్షన్ల పంపిణీ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్‌లు

image

జులై 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న NTR భరోసా పెన్షన్ల పంపిణీకి జిల్లాలో కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించేందుకు గాను కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 2.42లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

News June 30, 2024

శ్రీకాకుళం: గురుకుల ఫలితాల విడుదల

image

మహాత్మాజ్యోతిబాఫులే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6 నుంచి 9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు జిల్లా కన్వీనర్‌ తెలిపారు. mjpabcwriers.apcfss.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకుని, ర్యాంకు కార్డు పొందవచ్చని చెప్పారు. ప్రతిభ జాబితా ప్రకారం ఖాళీలను అనుసరించి కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు.

News June 30, 2024

విశాఖ: అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.3.2 కోట్లు

image

టీడీపీ హయాంలో విశాఖ నగరంలో నిర్మించిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది. వాటి పునరుద్ధరణకు రూ.3.2 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడానికి అంగీకరించడంతో ఇంజినీరింగ్ అధికారులు త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఆరేళ్ల క్రితం నగరంలో 25 ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.40 లక్షలు వెచ్చించింది.

News June 30, 2024

ఉదయగిరి: శిథిలావస్థలో ఆలయాలు

image

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ప్రదేశం ఉదయగిరి. చారిత్రిక సంపదతో పాటు ప్రకృతి అందాలకు నెలవు. రాయలవారు దేశాన్ని జయించినా ఉదయగిరి వైపు అడుగులు కూడా వేయలేకపోయారు. చివరకు సంధి మార్గం ద్వారా ఉదయగిరి కోటను జయించారు. ఇక్కడ ఎన్నో ఆలయాలు నిర్మించారు. అప్పట్లో ప్రతి ఆలయం నిత్య ధూప దీప నైవేద్యాలతో కళకళలాడేది. నేడు ఉదయగిరిలోని ఆనాటి దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.

News June 30, 2024

ఆదోని: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

ఆదోని పట్టణంలోని స్థానిక రాయనగర్ సమీపాన గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై గోపాల్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని గుర్తించి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

News June 30, 2024

పోలవరం చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు

image

పోలవరం ప్రాజెక్ట్ వద్దకు కొద్దిసేపటి కింద అంతర్జాతీయ నిపుణుల బృందం చేరుకుంది. డయాఫ్రం వాల్, స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ, దిగువ డ్యాములను నిపుణులు పరిశీలించారు. 4 రోజులు పాటు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించి పూర్తిగా అధ్యయనం చేస్తారు. ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదికను బట్టే పనులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.