India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
85 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి 11 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ రాజమండ్రి 8వ న్యాయస్థానం, క్రైమ్ ఎగైనెస్ట్ విమెన్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం తీర్పునిచ్చారు. కరప మండలం వేలంగికి చెందిన వెంకటరమణ గతేడాది ఫిబ్రవరి 7న రాయవరానికి చెందిన వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లు మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపారు. దర్యాప్తు అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా శిక్ష విధించారన్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలో నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 23 మందికి రూ.1.20 లక్షల జరిమానాను కోర్టు విధించిందని చెప్పారు. వీరిలో ఏడుగురికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించారని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన బాలుడి హత్య కేసులో సమర్థవంతంగా విధులు నిర్వహించి, ప్రస్తుతం పామూరు సీఐ భీమా నాయక్, అప్పటి అర్థవీడు ఎస్సై రవీంద్రనాథ్ రెడ్డి, కోర్టు లైజన్ కానిస్టేబుల్ వరదయ్యలను ఎస్పీ ఏర్ దామోదర్ శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పోలీసు అధికారులకు ఎస్పీ ఆఫీసులో ప్రశంశా పత్రాలను అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి గుర్తింపు లభిస్తుందన్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ క్రీడా పోటీలు 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా స్కేటింగ్ అదరపు కార్యదర్శి రవి బాల, జిల్లా స్కేటింగ్ కోచ్ నాగేంద్ర పేర్కొన్నారు. చిలమత్తూరు మండలం టేకులోడులో స్కేటింగ్ బోర్డు ఎంపికలు ఉంటాయన్నారు. 8న అనంతపురంలో మా రోలర్ స్కేటింగ్ అకాడమీలో రింక్ పోటీలు, 9న వడియంపేటలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈ మేరకు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ బులెటిన్ విడుదల చేశారు. పార్లమెంట్ రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీ సభ్యులుగా ఎంపీ టి. ఉదయ్ శ్రీనివాస్(జనసేన) నియామకం అయ్యారు. ఇదే కమిటీలో వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి అండర్-14, 17 బాల బాలికల రైఫిల్ షూటింగ్ పోటీలలో జిల్లా షూటర్లు పథకాలు సాధించాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిడ్డయ్య కోరారు. శుక్రవారం రైఫిల్ షూటింగ్ అకాడమీలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. గెలుపొందిన క్రీడాకారులకు రైఫిల్ షూటింగ్ కార్యదర్శి ఎంఎండీ బాషా బహుమతులు అందజేశారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులతో అవగాహన సదస్సులు నిర్వహించి గృహ నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుండి గృహ నిర్మాణంపై క్షేత్రాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 28న జిల్లా వ్యాప్తంగా అన్ని లేఔట్లలోనూ, కమ్యూనిటీ హాళ్లలోనూ గృహ నిర్మాణాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించాలన్నారు.
బెయిల్ వచ్చిన షూరిటి లేక ఇబ్బంది పడుతున్న పేద ఖైదీలకు ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందించాలని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా పేర్కొన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపవర్మెంట్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఖైదీల బైయిల్ వివరాలు, స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగబోయే జాతీయ లోక్ ఆదాలత్ ద్వారా ఖైదీలకు న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తొలిసారి కడప జిల్లాకు రానున్నారు. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరులో జిల్లా కార్యకర్తల సమావేశం, నగర ప్రముఖులతో సమావేశం ఉంటుంది. 30వ తేదీ ఉదయం ప్రొద్దుటూరు సర్వజన ఆసుపత్రి పర్యటన అనంతరం, కడప రిమ్స్ ఆసుపత్రిలో ఆడిటోరియం, ల్యాబ్లను ప్రారంభిస్తారు. అనంతరం కడప నగరంలో పార్టీ నాయకులతో సమావేశంలో పాల్గొంటారు.
ముడి వస్తువులకు విలువలు జోడింపు ద్వారా నాణ్యత పెరగడమే కాకుండా మెరుగైన ఆర్ధిక లబ్ది చేకూరుతుందని అల్లూరి కలెక్టర్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం న్యూడిల్లీలో స్పైసెస్ బోర్డు, ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ నిర్వహించిన వర్క్ షాప్కు కలెక్టర్ హాజరయ్యారు. మంచి పరిశుభ్రత పద్ధతులలో సుగంద ద్రవ్యాలైన మిరియాలను సరైన పక్వ స్థితిలో సేకరించాలని, సేకరించిన మిరియాలకు అదనపు విలువలు జోడించాలన్నారు.
Sorry, no posts matched your criteria.