Andhra Pradesh

News June 29, 2024

తిరుపతి- హిసార్ మధ్య ప్రత్యేక రైలు

image

తిరుపతి- హిసార్ మధ్య వారానికోసారి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ద.మ. రైల్వే అధికారులు తెలిపారు. హిసార్- తిరుపతి (04717) రైలు ప్రతి శనివారం జులై 6 నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకు, తిరుపతి- హిసార్ (04718) రైలు ప్రతి సోమవారం జులై 8 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు నడవనున్నాయి. గూడూరు, నెల్లూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ ఖాఘజ్నగర్, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్ తదితర స్టేషన్ల మీదుగా వెళుతుందని చెప్పారు.

News June 29, 2024

డి.శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరం: రఘువీరా రెడ్డి

image

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురం శ్రీనివాస్ మృతిపై మాజీ మంత్రి రఘువీరా రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ మంత్రివర్గ సహచరుడు డి.శ్రీనివాస్ మరణ వార్త అత్యంత బాధాకరం. భగవంతుడు వారి పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 29, 2024

ఉమ్మడి ప.గో డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

బి.సి, ఎస్.సి, ఎస్.టికి సంబంధించి ఉమ్మడి ప.గో జిల్లాలోని డి.ఎస్.సి.అభ్యర్థులకు వచ్చే నెల 11వ తేదీ నుంచి డి.ఎస్.సి. ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా బి.సి సంక్షేమ అధికారిణి నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బి.సి స్టడీ సర్కిల్ కార్యాలయంలో జులై 8వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
➠ SHARE IT..

News June 29, 2024

మచిలీపట్నం: బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. ఐదేళ్ల జైలు శిక్ష

image

బాలిక స్నానం చేస్తుండగా బాత్‌రూమ్‌లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి మచిలీపట్నం పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. మైలవరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 2015లో స్నానం చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన రాజా అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష , రూ.4వేల జరిమానా విధించారు.

News June 29, 2024

ఆత్మకూరు: మేనత్త అంత్యక్రియల్లో మేనల్లుడు మృతి

image

మేనత్త అంత్యక్రియల్లో మేనల్లుడు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరులో జరిగింది. సయ్యద్ ముంతాజ్ అనారోగ్యంతో మృతి చెందగా ఆమెను శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలి మేనల్లుడు నీటి కోసం వెళ్లి ట్యాంకు ఎక్కాడు. దిగే క్రమంలో గోడ కూలి కిందపడి గాయాలపాలయ్యాడు. నెల్లూరు అపోలోలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.మృతుడు ఐటీఐ కాలేజీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

News June 29, 2024

కోనసీమ: లారీ ఢీకొని భర్త మృతి.. భార్యకు తీవ్ర గాయాలు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. లారీ బైక్‌ను ఢీకొన్న ఘటనలో వానపల్లికి చెందిన శ్రీనివాస్(49) మృతి చెందగా, అతడి భార్య లక్ష్మీ నారాయణమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. విష పురుగు కరిచిందని కొత్తపేటలో చికిత్స చేయించుకొని తిరిగి బైక్‌పై వెళుతున్న దంపతులను వానపల్లిలో లారీ ఢీకొట్టింది. ద్వారపూడి నుంచి ధాన్యం లోడుతో వస్తున్న లారీ గణేష్‌నగర్ సెంటర్ వద్ద వీరిని ఢీకొట్టింది.

News June 29, 2024

విశాఖ: బదిలీల కోసం తహశీల్దారుల ఎదురుచూపు

image

ఎన్నికల ముందు సొంత జిల్లాల్లో పనిచేస్తున్న తహశీల్దారులను ప్రభుత్వం వేరే జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల ముగిసిన నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు బదిలీపై వచ్చిన తహశీల్దారులు తమ సొంత జిల్లాలకు వెళ్లడానికి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారు ఉమ్మడి విశాఖ జిల్లాకు రావడానికి ఎదురుచూస్తున్నారు.

News June 29, 2024

గుంటూరులో కొత్త వంతెనకు ప్రాతిపాదనలు

image

గుంటూరులో ట్రాఫిక్ కష్టాల నేపథ్యంలో శంకర్ విలాస్ వంతెన స్థానంలో కొత్త వంతెన రానుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు.. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 112 అడుగుల వెడల్పు, 1.05కి.మీ పొడువుతో 4 వరుసలుగా వంతెన నిర్మాణం చేపట్టాలని తొలి ప్రతిపాదన కాగా, 2వ ప్రతిపాదన కింద వంతెనను అలాగే ఉంచి, దానిపై 20అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ ROB నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం.

News June 29, 2024

ఏలూరు: విషాదం.. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

image

కైకలూరు మండలం ఉప్పుటేరు చెక్ పోస్ట్ సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కైకలూరు మండలం గుమ్మళ్లపాడుకు చెందిన యాళ్ల దేవరాజు(45) ద్విచక్ర వాహనంపై ఆకివీడు నుంచి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో ఉప్పుటేరు వద్ద వెనక నుంచి లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో దేవరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 29, 2024

పులివెందుల: యువకుడు MISSING

image

పులివెందుల పట్టణంలోని బేతేలు చర్చి వీధికి చెందిన ఆదాం(16) అదృశ్యమైనట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి యూసుఫ్ కథనం మేరకు.. ఈ నెల 27న ఉదయం స్థానిక గోపీ విహార్ వీధిలోని ఎలక్ట్రికల్ షాపులో పనిచేసేందుకు వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తండ్రి యూసుఫ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.