India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జులై 1వ తేదీ నుంచి నూతన చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అవగాహన పెంచుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై పుట్టపర్తి కోర్ టీంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై పోలీసు అధికారులు పూర్తిగా పట్టు సాధించాలన్నారు.
విద్యార్థులు జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని డాక్టర్ అపర్ణ శ్రీరామ్, యునాని డాక్టర్ నిరంజన్ నాయక్ తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు హోమస్ పేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. 260 మంది విద్యార్థులకు వ్యాధి నిరోధక హోమియో మందులను ఇచ్చారు.
పాణ్యం మండలం కౌలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు ఆకస్మికంగా పర్యవేక్షించారు. కేంద్రంలోని హాజరు అయిన విద్యార్థులు, హాజరు పట్టీని, ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శుక్రవారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని ఉండవల్లిలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పల్లా శ్రీనివాసరావు సమర్థ నాయకత్వంలో పార్టీ మరెన్నో విజయాలను సాధిస్తుందని, మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ తుషార్ డూడి పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది తమ అనారోగ్య సమస్యలను వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి వివరించగా సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకొని, వారికి సాధ్యమైనంత మేర సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద ఏనుగుల గుంపు కలకలం రేపింది. 7వ మైలు సమీపంలో దాదాపు 15 ఏనుగులు సంచారించాయని సమాచారం. అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది శబ్దాలు చేసి గజరాజులను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. అలాగే భక్తులను అప్రమత్తం చేశారు.
మండలంలోని ఉప్పుటేరు చెక్పోస్ట్ సమీపంలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కైకలూరు మండలం గుమ్మళ్లపాడుకు చెందిన యాళ్ల దేవరాజు (40) ద్విచక్ర వాహనంపై ఆకివీడు నుంచి స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో.. ఉప్పుటేరు వద్ద వెనక నుంచి లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్ రామకృష్ణ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కవానిపాలెం ప్రభుత్వ వైన్ షాప్ వద్ద ఆటో డ్రైవర్ బొల్లి అక్కునాయుడుపై దాడి జరిగింది. అయితే ఈ దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. గాయాలైన ఆటో డ్రైవర్ను కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎంవీపీ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
నెల్లిమర్ల మండలంలోని సారిపల్లికి చెందిన బోనుమహంతి విజయ్కుమార్(28) అనే యువకుడు కరెంట్ షాక్తో శుక్రవారం మృతి చెందాడు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో వైరింగ్ పని చేయడానికి వెళ్లిన విజయ్కుమార్కు ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైరు తగలడంతో అక్కడికక్కడే పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. విజయ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని ఐటీఐలో ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్ ఈ నెల 26వ తేదీతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,470 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,608 సీట్లు గాను కేవలం 826 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించారు. ఈ క్రమంలో జిల్లాలో మొత్తం 23 ఐటిఐ కళాశాలల్లో 2,782 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనితో విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.