India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మార్కాపురం మండలంలోని నికరంపల్లి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ – బొలెరో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఘటనలో బొలెరో వాహనంలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించి క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష తేదీ గడువు పొడిగించారు. జూన్ 12 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్ అనిత తెలిపారు. సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, బీటెక్, ఎంటెక్ కోర్సులలో చేరేందుకు ఈ పరీక్షలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
అఖిల భారత అగ్నివీర్ వాయు నియామక ర్యాలీకి అర్హత, ఆసక్తి కలిగిన అవివాహిత పురుషులు, స్త్రీలు దరఖాస్తు చేసుకోవాలని బాపట్ల కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. అగ్నివీర్ వాయు నియామక ర్యాలీ కాన్పూర్, బెంగళూరులో జరుగుతుందన్నారు. అర్హులైన వారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ ర్యాలీకి అర్హులైన వారంతా 22వ తేదీ నుంచి జూన్ 5 వరకు సంబంధిత వెబ్సైట్లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
పామూరు చెందిన నూకసాని హర్షిత జాతీయస్థాయి ఫ్యాషన్ డిజైనింగ్ పోటీలలో తన ప్రతిభతో బంగారు పతకాన్ని సాధించింది. గంగాధర్ రావు, శారదల కుమార్తె హర్షిత పట్నాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో మూడో సంవత్సరం విద్యను అభ్యసిస్తుంది. అయితే ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి నైపుణ్య పోటీలలో హర్షిత తయారుచేసిన కాస్ట్యూమ్స్కి బంగారు పతకం వరించింది. దీంతో గ్రామస్థులు, హర్షిత తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.
వాడరేవు – రామాపురం రోడ్డులో మంగళవారం ఉదయం బైక్ అదుపుతప్పి ఊటుకూరి సుబ్బయ్య పాలెంకు చెందిన మత్స్యకారుడు బాలాజీ (55) దుర్మరణం చెందాడు. ఉదయం బైక్పై వేగంగా వెళుతుండగా అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఈపూరుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన కప్పరపు మణికంఠ అనే యువకుడు రైలునుంచి జారిపడి దుర్మరణం చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలేశ్వరుని దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రైలులో వస్తూ గేటు పక్కన కూర్చొని గూడూరు సమీపంలో నిద్ర మత్తులో జారిపడి మణికంఠ మూడు రోజుల క్రితం మృతి చెందాడు. గూడూరు రైల్వే పోలీసులు దర్యాప్తు జరిపి మంగళవారం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ 4, 5వ సెమిస్టర్ల పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. కళ్యాణి తెలిపారు. ఉదయం 10 గంటలకు మూల్యాంకనం ప్రారంభమవుతుందని, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు యూనివర్సిటీ అపాయింట్మెంట్ ఐడీ కార్డ్, కాలేజీ రిలీవింగ్ ఆర్డర్ తీసుకురావాలని కోరారు.
ఒకవైపు ఐపీఎల్, మరో వైపు ఏపీలో ఎన్నికల ఫలితాలు ఈ రెండింటిపై జిల్లాలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నడూ లేనంతగా ఈ సారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సీఎం ఎవరు అవుతారు, వచ్చే మోజార్టీ ఎంత, ఎమ్మెల్యే, ఎంపీగా ఎవరు గెలుస్తారు..? ఇలా పలు అంశాలపై బెట్టింగ్ రాయుళ్లు పందేలు నిర్వహిస్తున్నారు. ధనమే కాకుండా ఇళ్లులు, భూములు సైతం పందేల్లో పెడుతున్నారు.
రోజురోజుకూ పొగాకు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఒంగోలు-1 కేంద్రంలో జరిగిన వేలంలో పొగాకు కిలో రూ.312, ఒంగోలు-2, కొండపి కేంద్రాల్లో రూ.310, పొదిలిలో రూ.309, వెల్లంపల్లిలో రూ.307, టంగుటూరులో రూ.306 చొప్పున గరిష్ఠ ధర లభించింది. ఈ ఏడాది పొగాకు అమ్మకాలు మొదలు పెట్టినప్పుడు రూ.290 నుంచి మొదలైంది.
జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని డీఈవో సుభద్ర చెప్పారు. 24న తెలుగు, కాంపోజిట్ కోర్సు, 25న ద్వితీయ భాష హిందీ, 27న ఇంగ్లీషు, 28న గణితం, 29న ఫిజికల్ సైన్స్, 30న బయాలాజికల్ సైన్స్, 31న సోషల్ స్టడీస్, జూన్ 1న కాంపోజిట్ కోర్సు సేవం- ఓఎస్ఎన్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1, జూన్ 3న ఓఎస్ఎన్ సీ మెయిన్ పరీక్ష జరుగుతుందన్నారు.
Sorry, no posts matched your criteria.