Prakasam

News October 26, 2024

రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన MLAలు, MP

image

ఒంగోలులోని మంగమ్మ కాలేజీ జంక్షన్‌లో రూ.1.30 కోట్లతో నూతనంగా మంజూరైన రోడ్డు నిర్మాణానికి పలువురు టీడీపీ నేతలు భూమి పూజ చేశారు. మంగమ్మ కాలేజీ జంక్షన్ నుంచి, కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ వరకు గల తారు రోడ్డుకు భూమి పూజా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని భూమి పూజ చేశారు.

News October 26, 2024

బాలినేనికి జనసేనలో కీలక బాధ్యతలు?

image

బాలినేని శ్రీనివాస రెడ్డికి జనసేనలో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్‌తో ఆయన సమావేశమై.. జిల్లాలోని రాజకీయ పరిస్థితులను వివరించినట్లు సమాచారం. త్వరలో బాలినేని ఆధ్వర్యంలో పవన్ ఒంగోలులో సభ ఏర్పాటు చేసి, బాధ్యతలు అప్పగించనున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అపార రాజకీయ అనుభవమున్న ఆయన సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకోవాలని జనసేన ఆలోచిస్తున్నట్లు సమాచారం.

News October 26, 2024

వైరల్ అవుతున్న మంత్రి స్వామి ఫొటో

image

మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఫొటో వైరల్ అవుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్లో శుక్రవారం ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓ సాధారణ ప్రయాణికుడిలా రైలు కోసం వేచిచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో ప్రకాశం జిల్లాలో వైరల్ అవుతోంది. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగే వ్యక్తి అని చెప్పడానికి ఈ ఫొటో నిదర్శనమని ఆయన వర్గీయులు కొనియాడుతున్నారు.

News October 26, 2024

అద్దంకి: రూ.30 లక్షలు మింగేసిన భార్యాభర్తలు

image

అద్దంకిలో పెట్రోల్ బంక్ నిర్వహణ కోసం యజమాని అనిల్ అద్దంకికి చెందిన వెంకటేశ్వర్లు, భార్య మల్లేశ్వరిని నియమించుకున్నారు. విదేశాలలో స్థిరపడిన అనిల్‌కు 3 నెలల నుంచి షాపునకు సంబంధించిన డబ్బులు అందలేదు. అనిల్ అద్దంకికి వచ్చి సదరు వ్యక్తులను డబ్బులు అడగగా.. వారు చంపేస్తా అంటూ బెదిరించారని, రూ.30 లక్షలు కాజేశారని బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అద్దంకి CI కృష్ణయ్య తెలిపారు.

News October 25, 2024

వెలిగొండ ప్రాజెక్టుపై BIG UPDATE

image

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్షించి పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా ప్రాజెక్టును ప్రాధాన్యత జాబితాలో చేర్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత YCP ప్రభుత్వంలో బడ్జెట్‌లో రూ.4,012 కోట్లు కేటాయిస్తే అందులో కేవలం రూ.764 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు.

News October 25, 2024

సింగరాయకొండ: జల్సాలకు అలవాటు పడి.. కటకటాల పాలయ్యారు

image

జల్సాలకు అలవాటు పడి ఐదుగురు యువకులు కటకటాల పాలయ్యారు. దొంగతనాలు, గంజాయి అమ్మకాలు చేసి జల్సాలు చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి 13 బైక్‌లు, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ హజరత్తయ్య తెలిపారు. గురువారం రాత్రి సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వీరు పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారని సీఐ పేర్కొన్నారు. ఇలా తప్పుడు దారుల్లో నడవద్దని సూచించారు.

News October 25, 2024

ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థవంతంగా పనిచేయాలి: ప్రకాశం జేసీ

image

రేషన్ సరుకుల పంపిణీ, సరఫరాలో ఎన్ఫోర్స్మెంట్ మరింత సమర్థంగా పనిచేయాలిన జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ అన్నారు. ఇటీవల బదిలీల అనంతరం జిల్లా పౌర సరఫరాల శాఖలో కొత్తగా వచ్చిన అధికారులతో గురువారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రేషన్ సరుకుల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు. ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి పరిష్కరించాలన్నారు.

News October 24, 2024

ప్రకాశం జిల్లా నూతన డీఈవోగా కిరణ్ కుమార్

image

ప్రకాశం జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్‌లో విధులు నందు కాగా గురువారం జరిగిన డీఈవోల బదిలీల్లో ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులయ్యారు.

News October 24, 2024

ఎరువుల కొరత లేకుండా చూసుకోవాలి: ప్రకాశం కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువుల కొరత లేకుండా చూడాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యాన శాఖ, మార్క్ ఫెడ్, ఏపీఎంఐపీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News October 24, 2024

ప్రకాశం జిల్లాలో కామాంధుడు

image

ఒంగోలులో ఓ ఘనుడు తల్లితో సహజీవనం చేస్తూ.. ఆమె కూతురితో ప్రేమాయణ నడిపాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఒంగోలులోని ఓ మహిళతో టంగులూరు మండలానికి చెందిన రాజు సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె కూతురితో ప్రేమాయణం నడిపాడు. 2 రోజుల క్రితం బాలికతో కలిసి బయటికివెళ్లారు. సాయంత్రమైనా రాకపోవడంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో వారిద్దరూ హైదరాబాద్‌లో గుర్తించినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.