Prakasam

News May 19, 2024

కనిగిరి: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

కనిగిరి దేవాంగ నగర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఒంగోలు నుంచి కనిగిరి వైపు వస్తున్న కారు, కనిగిరి నుంచి కాశిరెడ్డి కాలనీకి వెళ్తున్న ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దేవాంగ నగర్‌కు చెందిన బత్తుల విష్ణు (57) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 19, 2024

ప్రకాశం జిల్లాలో ఎంతమంది ఓటు వేయలేదు అంటే?

image

రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో 87.21% పోలింగ్ నమోదైంది. 18,22,470 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,14,832 మంది ఓటు వేయలేదు. నియోజకవర్గాలు వారిగా చూస్తే వై.పాలెంలో 20,423, దర్శి 18,741, SN.పాడు 25,012, ఒంగోలు 32,502, కొండపి 26,919, మార్కాపురం 23,992, గిద్దలూరు 33,921 కనిగిరి 33,322 మంది ఓటు వేయలేదు. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91, గిద్దలూరులో అత్యల్పంగా 84.37% నమోదైంది.

News May 19, 2024

ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సాగుకు సన్నద్ధం

image

నైరుతీ రుతు పవనాలు ఈఏడాది ముందుగానే రావడంతో ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ దఫా జిల్లా వ్యాప్తంగా 3,70,307 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారలు అంచనా వేస్తున్నారు. సాగు విస్తీర్ణం బట్టి ఇప్పటికే మండలాల వారీగా విత్తనాలు కేటాయించినట్లు జేడీఏ శ్రీనివాసరావు తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News May 18, 2024

ప్రకాశం జిల్లాపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

image

ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవాన్ని ప్రకాశం చాటి చెప్పిందని యావత్ భారతావని ప్రస్తుతం జిల్లా ప్రజలను ప్రశంసిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలోనే 87.09 శాతం పోలింగ్ నమోదుతో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాదు జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు కావడంతో అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గంగా పేరుగాంచింది. ఈ రికార్డుల పట్ల జిల్లా ప్రజలకు ప్రశంసలు కురుస్తున్నాయి.

News May 18, 2024

అప్పుడు ప్రకాశం ఎస్పీ.. ఇప్పుడు పల్నాడు ఎస్పీ

image

పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ నియమితులయ్యారు. ఆమె గతంలో కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా పని చేశారు. తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా రెండున్నరేళ్లకు పైగా పని చేశారు. అనంతరం తిరుపతి ఎస్పీగా పని చేశారు. మల్లికా గార్గ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన పోలీస్ అధికారిని. కాగా ఈమె పల్నాడు జిల్లాకు వచ్చిన తొలి మహిళా ఎస్పీగా ఉన్నారు.

News May 18, 2024

ప్రకాశం: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం డివిఎన్ కాలనీలో శనివారం కురిసిన భారీ వర్షానికి చెట్టు కింద ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్న అలగసాని నారాయణ (37) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి తోడుగా పిడుగులు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News May 18, 2024

మార్టూరు: కాలువలోకి బైక్.. వ్యక్తి మృతి

image

బైక్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మార్టూరు మండల పరిధిలోని కొమ్మూరు మేజర్ కాలువలో శనివారం చోటుచేసుకుంది. బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన తన్నీరు లక్ష్మయ్య (60) బ్రహ్మంగారి మఠంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News May 18, 2024

ప్రకాశం: గెలుపుపై ఎవరి లెక్కలు వారివి

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపు, ఓటములపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగితేలుతున్నారు. బూత్‌ల వారీగా పోలైన ఓట్లను సమీక్షిస్తూ లెక్కలు వేసుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మహిళల ఓటింగ్ ఎక్కువగా జరిగింది. దీంతో ఎవరిని విజయం వరిస్తుందో.. ఓటర్లు ఎవరి వైపు నిలిచారో తెలియాలంటే జూన్ 4న ఆగాల్సిందే.

News May 18, 2024

ప్రకాశం: పెళ్లికి ఒప్పుకోలేదని తల్లీ కూతుళ్ళపై దాడి

image

పెళ్లికి నిరాకరించిందనే కక్షతో పామూరుకి చెందిన నాగార్జున యువతితో పాటు ఆమె తల్లిపై దాడి చేశాడు. కాంతమ్మ కూతురు పూజితతో కలిసి పాతూరులో నివాసం ఉంటుంది. సమీప బంధువైన నాగార్జున పూజిత పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టేవాడు. శుక్రవారం ఇంట్లోకి చొరబడి తల్లీకూతురిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పెళ్లికి ఒప్పుకుని, కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడిన వినలేదు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News May 18, 2024

ప్రకాశం జిల్లాకు వస్తున్నారా.. ఇవి చూసేయండి మరి!

image

అసలే సమ్మర్ హాలిడేస్. మన జిల్లాకు ఎందరో పర్యటనల కోసం వస్తారు. అయితే జిల్లాకు పర్యటనకు వచ్చిన వారు ఈ ప్రదేశాలు, క్షేత్రాలు సందర్శించాల్సిందే. ప్రధానంగా భైరవకోన, జమ్ములపాలెంలోని 1116 శివలింగాల ఆలయం, వల్లూరమ్మ తల్లి ఆలయం, శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఇలా పలు ఆలయాలను దర్శించవచ్చు. అంతేకాకుండా కొత్తపట్నం బీచ్, గుండ్లకమ్మ జలాశయం, రామాయపట్నం పోర్టు ఇలా ఎన్నో చూడవచ్చు జిల్లాలో. డోంట్ మిస్ మరి!