India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలో మరో నేత YCPకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. విజయవాడలోని సచివాలయంలో బుధవారం చీరాల మాజీ MLA కరణం బలరాం CM చంద్రబాబును కలిశారు. ఆయనతో పాటు MLA దామచర్ల ఉన్నారు. ఈయన 2019లో చీరాల నుంచి TDP తరఫున MLAగా గెలిచి YCPలో చేరారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడు కరణం వెంకటేశ్ YCP నుంచి MLAగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో బలరాం కలవడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
సంక్రాంతి రానున్న నేపథ్యంలో నాటుకోడి, కోడిపుంజులకు భలే గిరాకీ ఉంటోందని కోళ్ల పెంపకం రైతులు అంటున్నారు. ముఖ్యంగా మన జిల్లాలోని మర్రిపూడి, కొండపి ప్రాంతాల్లో రైతులు కోళ్లను పెంచి రూ. లక్షలలో ఆర్జిస్తున్నట్లు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి పందెం కోడిపుంజు రూ. లక్షలు పలుకుతాయని, ప్రస్తుతం నాటు కోడి మాంసం రూ. 750 దాకా అమ్ముతున్నట్లు తెలిపారు.
మహిళలకు జీవనోపాధి కల్పించే దిశగా ప్రకాశం జిల్లాలోని 837 స్వయం సహాయక సంఘాలకు రూ.100 రోట్ల రుణాలు మంజూరైనట్లు డీఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. మంగళవారం ఒంగులులో నిర్వహించిన డీఆర్డీఏ, కెనరా బ్యాంకు అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 25న ఒంగోలులో ని ఏ-1 హాల్లో రుణాలు అందిస్తామన్నారు. మహిళలకు చేయూతనందించి వారి ఉన్నతికి తోడ్పడాలని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు.
ఈ నెల 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు “21వ అఖిల భారత పశుగణన” సర్వే చేపట్టబోతున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టరును మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పశుసంవర్థక అధికారి బేబీరాణి సమక్షంలో ఆమె ఆవిష్కరించారు. పశువులకు సంబంధించిన సమగ్ర గణాంకాలు ఉంటే వాటికి సంబంధించిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా రూపొందించగలదని కలెక్టర్ అన్నారు.
సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. నేషనల్/స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ అసోసియేషన్, అనుబంధ సంస్థల అధికారులమని కాల్స్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ నేరాలకు గురికాకుండా ఉండవచ్చన్నారు. కొందరు నేరగాళ్లు హ్యూమన్ రైట్స్ పేరుతో ఫేక్ వెబ్సైట్లు, ఐడీ కార్డ్లు, సోషల్ మీడియా గ్రూపులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.
మార్టూరు మండలం డేగరమూడిలో ఓ వివాహిత హత్యకు గురైంది. భర్త నుంచి విడిపోయి ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. ఈ మధ్య అతనికి దూరంగా తండ్రితో పుట్టింట్లో ఉంటుంది. ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ప్రియుడు ఆదివారం ఆమె ఇంటికి వెళ్లి కత్తితో పొడవగా ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. సీఐ శేషగిరిరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
విధినిర్వహణలో, అసాంఘిక శక్తుల చేతిలో అసువులు బాసిన పోలీసు సిబ్బంది సంక్షేమ కోసం జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధినిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబ సభ్యులతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమావేశమయ్యారు. విధినిర్వహణలో మరణించిన సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు.
నేటి నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లాలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని ప్రకాశం జిల్లా SP దామోదర్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అమరులైన పోలీసులను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడుతూ.. ఈ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
చంద్రశేఖరపురం మండలం డీజీపేటకు చెందిన వృద్ధురాలు డేగ రత్తమ్మ (58) హత్యకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం గడ్డికోసం రత్తమ్మ పొలం వెళ్లారు. పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు అమెను హత్యచేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, కమ్మలు దొంగిలించారు. సాయంత్రమైనా రత్తమ్మ ఇంటికి రాలేదని స్థానికులు పొలానికి వెళ్లి చూడగా హత్యకు గురైంది. పామూరు CI, చంద్రశేఖరపురం SI ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.