Prakasam

News August 29, 2024

ప్రకాశం జిల్లా పర్యటనలో కైలాశ్ సత్యార్థి

image

నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్‌లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.

News August 29, 2024

ప్రకాశం జిల్లా పర్యటనలో కైలాశ్ సత్యార్థి

image

నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్‌లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.

News August 29, 2024

ప్రకాశం: గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల

image

ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.37.94 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి వాయిదా కింద విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.37.94 కోట్లను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టేందుకు పంచాయతీ అధికారులు ఈ నిధులను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

News August 29, 2024

MLC సునీత రాజీనామా.. ఆ స్థానంలో బీటెక్ రవి?

image

వైసీపీ MLC పోతుల సునీత బుధవారం పార్టీ సభ్యత్వంతో పాటు MLC పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఆమె రాజీనామాతో ఖాళీ అయిన MLC స్థానాన్ని పులివెందులకు చెందిన TDP సీనియర్ నేత బీటెక్ రవికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పులివెందుల పోటీ చేసిన బీటెక్ రవి జగన్‌పై ఓడిపోయిన విషయం తెలిసిందే.

News August 28, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

➤ కనిగిరిలో నవ వధువు ఆత్మహత్య
➤ మాగుంటను ఎందుకు నిందితుడిగా చేర్చలేదు: సుప్రీం
➤ ముండ్లమూరులో ఆరు నెలలగా యువతిపై అత్యాచారం
➤ మార్కాపురం: కుర్చీలోనే కుప్పకూలి బ్యాంక్ మేనేజర్ మృతి
➤ చినగంజాంలో సందడి చేసిన సినీ తారలు
➤ రాచర్ల: గుండెపోటుతో విద్యార్థిని మృతి
➤ చీరాల: వైసీసీకి పోతుల సునీత రాజీనామా
➤ ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షం
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు కందుకూరు విద్యార్థి ఎంపిక

News August 28, 2024

చిన్నగంజాం మండలంలో సినీ తారల సందడి

image

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని మోటుపల్లి గ్రామంలో బుధవారం సినీ తారల సందడి నెలకొంది. మైత్రి మూవీస్ బ్యానర్‌పై గోపీచంద్ డైరెక్షన్‌లో హిందీ సినిమా షూటింగ్ మోటుపల్లిలో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. కాగా సినీ తారలను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చిన్నగంజాం ఎస్సై రమేశ్ షూటింగ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.

News August 28, 2024

ప్రకాశం: ‘యువతిపై 6 నెలలుగా అత్యాచారం’

image

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళకు చెందిన మైనర్ బాలికను, అదే పంచాయతీ పరిధిలోని గంగన్నపాలెంకి చెందిన శ్రీరామ్ 6 నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం పోక్సో కేసు నమోదయినట్లు SI నాగరాజు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించామని SI అన్నారు.

News August 28, 2024

ప్రకాశం: ‘యువతిపై 6 నెలలుగా అత్యాచారం’

image

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళకు చెందిన మైనర్ బాలికను, అదే పంచాయతీ పరిధిలోని గంగన్నపాలెంకి చెందిన శ్రీరామ్ 6 నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం పోక్సో కేసు నమోదయినట్లు SI నాగరాజు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించామని SI అన్నారు.

News August 27, 2024

జగన్ హయాంలో డిస్కంల కుంభకోణం: గొట్టిపాటి

image

YS జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగాపడిపోయిందన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి, జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.

News August 27, 2024

జగన్ హయాంలో డిస్కంల కుంబకోణం: గొట్టిపాటి

image

YS జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పత్రికా ప్రకటన ద్వారా అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి, జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.