Prakasam

News May 15, 2024

కారంచేడు: గుండె నొప్పి రావడంతో అదుపుతప్పిన కారు

image

కారంచేడు మండల పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట నుంచి వాడరేవు వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లింది. చిలకలూరిపేట నుంచి వాడరేవుకు కారులో ఓ కుటుంబం బుధవారం బయలుదేరింది. మార్గమధ్యలో కారు నడుపుతున్న అతనికి గుండె నొప్పి రావడంతో కారు అదుపుతప్పిందని కుటుంబీకులు తెలిపారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు 108 సాయంతో అతన్ని చీరాలలోని ఆసుపత్రికి తరలించారు.

News May 15, 2024

మార్కాపురం: టీడీపీ పట్టణ అధ్యక్షుడికి రోడ్డు ప్రమాదం

image

ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి బుధవారం కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ సందర్భంగా కారు అదుపు తప్పి దేవరాజు గట్టు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరిగినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 15, 2024

ఉలవపాడు మార్కెట్లో పెరిగిన సపోటా ధరలు

image

ఉలవపాడు మండలంలోని అంతర్రాష్ట్ర సపోటా మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫారిన్ రకం రూ.800, పాల రకం రూ.700, బిళ్ల రకానికి రూ.550 పలుకుతున్నాయి. రోజుకు 1,000 నుంచి 1,200 బస్తాల వరకు ఎగుమతి అవుతున్నాయి. మార్కెట్ ప్రారంభం నుంచి బస్తాకు రూ.200 చొప్పున పెరిగిందని రైతులు చెబుతున్నారు.

News May 15, 2024

ప్రకాశం : బైక్ లు ఢీకొని ఒకరు దుర్మరణం

image

మర్రిపూడి మండలం శివరాయునిపేటకు చెందిన మానివేల చిన్నవీరయ్య, చీమల వెంకటేశ్వర్లు బైక్ పై ఉప్పలపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఇదే సమయంలో మర్రిపూడి మండలం చిమటకు చెందిన జానపల్లి వెంకటేశ్వర్లు బైకుపై మర్రిచెట్లపాలెం వెళ్తున్నారు. ఉప్పలపాడు సమీపంలో బైక్ లు ఢీకొనడంతో చిన్నవీరయ్యకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు.

News May 15, 2024

చినగంజాం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

image

ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదంతో ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. అయితే, వీరిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. చినగంజాం మండలం నీలాయిపాలెంకు చెందిన ఉప్పుగుండూరు కాశీ (65), లక్ష్మి (55), చిన్నారి సాయిశ్రీ (8) మృతి చెందారు. ఒకేసారి కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

News May 15, 2024

ప్రకాశం: ఈనెల 17 నుంచి పలు రైళ్లు రద్దు

image

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కంభం, గిద్దలూరు గుండా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 17 నుంచి 31 వరకు గుంటూరు-గుంతకల్లు డంప్లింగ్ పనుల కారణంగా (17329/17330) హుబ్లీ నుంచి విజయవాడ, (17251/17252) గుంటూరు నుంచి కాచిగూడ వంటి రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కావున రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు.

News May 14, 2024

పొదిలి: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

image

పొదిలి మండలం సలకనుతల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రధాన విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొనడంతో శ్రీశైలం-ఒంగోలు జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభంతో పాటు వైర్లు నేలకు ఒరిగాయి. ప్రమాదంలో పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారుకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

News May 14, 2024

ప్రకాశం: రైలు ఢీకొని మహిళ మృతి

image

వేటపాలెం సమీపంలోని నాగవరపమ్మ రైల్వేగేట్ వద్ద రైలు ఢీకొనడంతో ఓ మహిళ (50) మృతి చెందింది. ఆమె వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, మృతురాలు పసుపురంగు చీర ధరించిందని చీరాల జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని వారు పేర్కొన్నారు. కాగా మృతురాలి సమాచారం తెలిసిన వారు 9440627646 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.

News May 14, 2024

పర్చూరు: తనకు తాను ఓటేసుకోని YCP MLA అభ్యర్థి

image

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యడం బాలాజీ తను పోటీ చేసిన పర్చూరు నియోజకవర్గంలో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. స్వగ్రామమైన చీరాలలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పర్చూరు నియోజకవర్గ వైసీపీ టికెట్ ఆయనకు ఖరారవడంతో ఆయన ఓటును పర్చూరుకి మార్చుకునే అవకాశం లేకపోయింది. కాగా కూటమి తరఫున పర్చూరులో ఏలూరి సాంబశివరావు పోటీలో ఉన్నారు.

News May 14, 2024

ఓటేయని ఎమ్మెల్యే బుర్రా

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ MLA ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కందుకూరు వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిన్న పోలింగ్ సరళిని పరిశీలించడానికి కందుకూరులో విస్తృతంగా పర్యటించారు. ఈక్రమంలో ఆయన కనిగిరికి వెళ్లి ఓటు వేయలేకపోయారు. బుర్రా తీరుపై పలువురు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.