Prakasam

News May 5, 2024

ఒంగోలుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాక

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 11న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒంగోలుకు రానున్నారు. 9 వతేది పవన్ కళ్యాణ్ రాకుంటే 11వతేది మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో రోడ్డుషోలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని కూటమి నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు తుది గడువు కానున్న నేపథ్యంలో వారి చివరి ప్రసంగం ఒంగోలులోనే ఇవ్వనున్నారు.

News May 5, 2024

బీఎన్ విజయ్ కుమార్‌కు ఎమ్మెల్యేకు గాయాలు

image

సంతనూతలపాడు కూటమి MLA అభ్యర్థి BN విజయ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. ఆ పార్టీ శ్రేణుల వివరాల ప్రకారం.. చీమకుర్తి మండలంలోని చీమలమర్రిలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అందులో BN పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో డ్రోన్ కెమెరా అకస్మాత్తుగా తన మీదకు వచ్చేసింది. వెంటనే ఆయన చేతులను అడ్డుపెట్టుకున్నారు. దీంతో ఆయన చేతి వేళ్లకు స్వల్పగాయాలయ్యాయి. చీమకుర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

News May 5, 2024

కొండపి ఎమ్మెల్యే స్వామికి స్వల్ప ప్రమాదం

image

కొండపి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం సింగరాయకొండ మండలం నర్రావారిపాలెంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణ సంచా పేల్చగా నిప్పు రవ్వలు ఎమ్మెల్యే స్వామి కంటికి తగిలాయి. దీంతో ఆయనను ఒంగోలులో ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

News May 5, 2024

ప్రకాశం జిల్లా జైలులో ములాఖత్ వేళలు మార్పు

image

ఒంగోలులోని జిల్లా జైలులో ములాఖత్ వేళలు మార్పు చేసినట్లు జిల్లా కారాగార పర్యవేక్షణ అధికారి వరుణ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ములాఖత్ లు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 15వ తేదీ వరకు ఈ సమయం కొనసాగుతుందని చెప్పారు. కావున జిల్లా ఖైదీల బంధువులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 4, 2024

పొదిలి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

పొదిలి మండలం కంబాలపాడు గ్రామ సమీపంలోని సచివాలయం దగ్గరలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తిని స్థానికులు గుర్తించి పొదిలి పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై కోటయ్య మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 4, 2024

ప్రకాశం: సరిగ్గా నెలరోజులు.. మీ MLA ఎవరు?

image

సరిగ్గా మరో నెల రోజుల్లో మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగా.. మే13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కించి ఎమ్మెల్యే ఎవరో ప్రకటిస్తారు. అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 8 వైసీపీ, 4 టీడీపీ స్థానాల్లో గెలిచాయి. మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్ చెయ్యండి.

News May 4, 2024

దర్శికి చేరుకున్న చంద్రబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శికి చేరుకున్నారు. దర్శిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రసంగించనున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

News May 4, 2024

మార్కాపురంలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

image

మార్కాపురం సర్వ జన వైద్యశాలలో శుక్రవారం చికిత్స పొందుతు‌న్న గుర్తుతెలియని వ్యక్తి(60) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 2న గిద్దలూరులోని రాచర్ల గేటుకు సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎండ వేడికి బాగా నీరసించి స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు గిద్దలూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించగా శుక్రవారం మృతి చెందాడు.

News May 4, 2024

ప్రకాశం జిల్లాలో తొలి ఓటరు నాగలక్ష్మీబాయి

image

ప్రకాశం జిల్లాలో మొదటి ఓటరుగా యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజన గూడేనికి చెందిన జండా వత్ నాగలక్ష్మీ బాయి స్థానం సంపాదించుకున్నారు. యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెంలో మొదటి బూత్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచే ఓటరు జాబితా కూడా ప్రారంభమవుతుంది. మైదాన ప్రాంతం నుంచి పాలుట్ల చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు పాలుట్ల వెళ్లేందుకు ప్రత్యేక కమాండర్ జీపులను వినియోగిస్తున్నారు.

News May 4, 2024

ఒంగోలు: టెన్త్ మార్కుల జాబితాలు సిద్ధం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల పొట్టి మార్కుల జాబితాను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్సైట్ లో సిద్ధంగా ఉన్నట్లుగా డీఈఓ సుభద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వెబ్‌సైట్ నుంచి మార్కుల జాబితాలు డౌన్‌లోడ్ చేసి ప్రధానోపాధ్యాయులు అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందజేయాలని తెలిపారు. ఈ మార్కులు జాబితాలతో విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ప్రవేశం పొందవచ్చన్నారు.