Prakasam

News May 1, 2024

ప్రకాశం జిల్లాలో డీసెట్ నోటిఫికేషన్ విడుదల

image

ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు డీఈడీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఏఈడీ)లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు డీసెట్-24 నోటిఫికేషన్ విడుదలైనట్లు DEO సుభద్ర తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు ఆన్‌లైన్లో మే 8 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను మే9 వరకు ఆన్‌లైన్లో సమర్పించవచ్చు. మే 24న పరీక్ష ఉండగా, మే 30న ఫలితాలు ప్రకటిస్తారు.

News May 1, 2024

వెలిగండ్ల: బిల్డింగ్ పైనుంచి పడి వ్యక్తి మృతి

image

వెలిగండ్ల మండలం తమ్మినేనిపల్లికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి గుంటూరులో మంగళవారం అనుమానాస్పద స్థితిలో బిల్డింగ్ పైనుంచి జారిపడి మృతి చెందారు. ఈ ప్రమాదంపై మృతుని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేక ఏదైనా కుట్రకోణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సివుంది.

News May 1, 2024

ప్రకాశం జిల్లా రాజకీయాలపై నందమూరి బాలకృష్ణ ఆరా

image

ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఒంగోలు వచ్చిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను దామచర్ల జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు బొకేను అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై బాలకృష్ణ ఆరా తీసినట్లు తెలిసింది. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News May 1, 2024

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

ప్రకాశం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.

News April 30, 2024

ప్రకాశం: వైద్యశాఖలో డిప్యూటేషన్లు రద్దు

image

వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న సూపరింటెండెంట్ తోపాటు పలువురు ఉద్యోగులు వారి మాతృశాఖకు తిరిగి వెళ్లారు. కొన్నేళ్ల నుంచి పలువురు ఉద్యోగులు వైద్యశాఖ అనుబంధ శాఖల్లో పనిచేస్తూ డిప్యూటేషన్ పై వైద్య ఆరోగ్యశాఖకు వచ్చారు. వైద్యశాఖ సూపరింటెండెంట్ పయ్యావుల శ్రీనివాసరావుతో పాటు మరో ఐదుగురు ఉద్యోగులు మంగళవారం రిలీవ్ అయ్యి మాతృశాఖకు వెళ్లారు.

News April 30, 2024

ప్రకాశం: ఉచిత ప్రవేశాలకు 696 మంది ఎంపిక

image

బాలలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో ప్రవేశానికి లాటరీ విధానంలో 696 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. వీరిలో బీసీలు 234 మంది, మైనార్టీలు 53 మంది, ఓసీలు 147, ఎస్సీలు 244, ఎస్టీలు 18 మంది ఉన్నారు. ఆయా పాఠశాలల్లో మే 10వ తేదీలోపు సంబంధిత పత్రాలు సమర్పించి ప్రవేశం పొందాలన్నారు.

News April 30, 2024

చీరాల: బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

image

వేటపాలెం పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే 108 సహాయంతో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 30, 2024

కొండపి: MLA స్వామిపై బాలకృష్ణ ఫన్నీ కామెంట్లు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ కొండపిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై సరదాగా వ్యాఖ్యలు చేశారు. ‘మన ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు. నాకంటే పొట్టి, కానీ వయసులో నేనే పెద్ద’ అంటూ నవ్వులు పూయించారు. ఇక్కడి పొగాకు చూస్తే తనకు వీరసింహారెడ్డి సినిమా గుర్తుకువచ్చిందన్నారు. ఈ సందర్భంగా బాలయ్య పలు సినిమాల డైలాగులు చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు.

News April 30, 2024

గుండ్లకమ్మలో ఈతకెళ్లి యువకుడి మృతి

image

మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో ఈతకెళ్లి ఒంగోలుకు చెందిన ఆటోడ్రైవర్ గొరిపర్తి సాంబశివరావు (35) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి గుండ్లకమ్మ జలాశయంలో ఈత కొట్టేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. సోమవారం ఉదయం మృతదేహం నీటిలో తేలియాడింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రమేశ్ చెప్పారు.

News April 30, 2024

ప్రకాశం: ముగిసిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 22వ తేదీన 88 డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 38 పరీక్ష కేంద్రాల్లో సజావుగా సాగాయని యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లుగా తెలిపారు.