Prakasam

News April 24, 2024

ప్రకాశం: పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266

image

జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన వేలంలో వెల్లంపల్లి, కొండపిలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266, ఒంగోలు-1 రూ. 265, ఒంగోలు-2 రూ. 261, టంగుటూరు రూ.263 చొప్పున పలికింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,374 బేళ్లు తీసుకురాగా, అందులో 2,683 బేళ్లు, ఎస్ఎల్ ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,534 బేళ్లురాగా, అందులో 2,697 బేళ్లను కొనుగోలు జరిగాయి.

News April 24, 2024

చీరాల: తల్లి కళ్లెదుటే ఏడాది కూతురు మృతి

image

చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. స్నేహలత తన తల్లి, కూతరితో కలిసి చిన్నగంజాం నుంచి బాపట్ల వెళ్తుండగా లారీని తప్పించబోయి కింద పడ్డారు. అదే సమయంలో లారీ వారిపై ఎక్కడంతో అన్విత(1), బోడు సుబ్బారావమ్మ(45) అక్కడికక్కడే మృతిచెందారు. తన కళ్లెదుటే కూతురు, తల్లిని కోల్పోవడంతో స్నేహలత ఆవేదన వర్ణణాతీతంగా మారింది.

News April 24, 2024

కనిగిరి: 10వ తరగతిలో కవలలకు ఒకే మార్కులు

image

కనిగిరి పట్టణానికి చెందిన షేక్ అల్తాఫ్, షేక్ అసిఫ్‌ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు. పట్టణంలోని ఓ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నారు. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కవల పిల్లలైన ఇద్దరు అన్నదమ్ములు 600 మార్కులకు గాను 574 మార్కులు సాధించారు. ఒకేసారి జన్మించిన ఈ ఇద్దరూ ఒకే మార్కులతో పాస్ కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరిద్దరిని స్కూల్ యాజమాన్యంతోపాటు పలువురు అభినందించారు.

News April 24, 2024

ప్రకాశం జిల్లాలో 51 నామినేషన్లు దాఖలు

image

ప్రకాశం జిల్లాలో సోమవారం ఒంగోలు పార్లమెంట్, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు 51 నామినేషన్లు దాఖలయినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఒంగోలు పార్లమెంట్‌కు 4, ఒంగోలు అసెంబ్లీకి 5, యర్రగొండపాలెంకు 6, దర్శికి 4, సంతనూతలపాడుకు 6, కొండపికి 3, మార్కాపురానికి 5, గిద్దలూరుకు 5, కనిగిరి నియోజకవర్గానికి 3 నామినేషన్లు దాఖలయినట్లు తెలిపారు.

News April 24, 2024

బై‌క్‌పై నామినేషన్‌కు బయలుదేరిన ఏలూరి

image

పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నామినేషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ముహుర్త సమయానికి ఆలస్యమవుతుందని ఆర్వో కార్యాలయానికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బైక్‌పై బయలుదేరారు. అప్పటికీ వెళ్లడానికి సాధ్యపడక ముహూర్త సమయానికి జనసేన ఇన్‌ఛార్జ్ పెదపూడి విజయ్ కుమార్, తదితరుల చేత నామినేషన్ పత్రాలను కార్యాలయానికి పంపారు.

News April 24, 2024

ప్రకాశం: ఆటో బోల్తా.. పలువురికి గాయాలు

image

జిల్లాలోని పీసీపల్లి మండలం ఇర్లపాడులో మిరపకాయలు కోసేందుకు కూలీలతో వెళ్తున్న ఆటో వెంగళాయపల్లిలోకి వచ్చేసరికి హఠాత్తుగా కుక్క రోడ్డుపైకి అడ్డంగా రావడంతో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరత్తమ్మ, గోవిందమ్మ, ఐ.జయమ్మ, సంపూర్ణ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను పీసీపల్లి వైద్యశాలకు తరలించి ప్రథమచికిత్స చేశారు. ఆనంతరం మెరుగైన చికిత్స కోసం 108లో కనిగిరి వైద్యశాలకు తరలించారు.

News April 24, 2024

ప్రకాశం జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిన కనిగిరి విద్యార్థిని

image

10వ తరగతి పరీక్ష ఫలితాలలో కనిగిరి పట్టణానికి చెందిన నాదెళ్ల సాయి దీక్షిత 595 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు సాయి దీక్షితను అభినందించారు. జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘాలు విద్యార్థిని అభినందించారు.

News April 24, 2024

సింగరాయకొండ బస్టాండ్‌లో రూ.5లక్షలు స్వాధీనం

image

సింగరాయకొండ బస్టాండ్‌లో సోమవారం భారీగా నగదు పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో బస్టాండు సెంటర్‌లోని లగేజీ సెంటర్ వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ప్రయాణికుడి వద్ద రూ.5లక్షల నగదును స్వాధీనం చేసుకుని, సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

ఒంగోలు: ATM దొంగతనం చేసిన మహేశ్ ఆత్మహత్య

image

ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ATM క్యాష్ నింపే వాహనంలో 64 లక్షల దొంగతనం కేసులో ముద్దాయి మహేశ్ బాబు మనస్థాపంతో ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంకు చెందిన మహేశ్ ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. దొంగతనం తన మేనేజర్ అయిన పెద్ద కొండారెడ్డి ప్రోద్బలంతో మాత్రమే చేశానని సూసైడ్ లేఖలో మహేశ్ పేర్కొన్నారు.

News April 24, 2024

10th ఫలితాల్లో సత్తాచాటిన ప్రకాశం జిల్లా

image

టెన్త్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 91.21% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7 స్థానంలో నిలిచింది. 29,195 మందికి గానూ 26,630 మంది పాసయ్యారు. 14,511 మంది బాలికలకు 13,422 మంది, బాలురు 14,684 మందికి 13,208 మంది పాసయ్యారు. బాలులతో పోలీస్తే బాలికలు ఈసారి సత్తా చాటారు. కాగా 2023లో 73.74% ఉత్తీర్ణత సాధించారు. అటు బాపట్ల జిల్లాలో 16,718 మందికి గానూ 14,743 మంది పాసయ్యారు. 88.19శాతం ఉత్తీర్ణతతో 14వ స్థానంలో నిలిచింది.