Prakasam

News April 21, 2024

బైకులు నడిపే వారికి ప్రకాశం జిల్లా ఎస్పీ హెచ్చరికలు

image

బైకులకు విపరీతమైన శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 118 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడితే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.

News April 21, 2024

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పొడగింపు: కలెక్టర్

image

పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుల సమర్పణ గడువును ఈనెల 26 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా పనిచేసే చోట ఫారం -12 దరఖాస్తు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. ఫారం -12కు దరఖాస్తు చేసుకున్నా వారందరు ఓటు వేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.

News April 21, 2024

చేవెళ్ల పుష్కరిణిలో ప్రకాశం జిల్లా వాసి గల్లంతు

image

జిల్లాకు చెందిన రవి(38), శ్రీనివాస్, రాజులు తెలంగాణ రాష్ట్రంలో బేల్దారి పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో చేవెళ్లలో ఉన్న లక్ష్మి వేంకటేశ్వర స్వామి దేవాలయ పుష్కరిణిలో ఈతకు దిగారు. రవి పుష్కరిణి లోపలికి వెళ్లగా, శ్రీనివాస్ ఒడ్డున మునిగి బయటకు రాగా, రాజు నీటిలోకి దిగలేదు. ఎంతసేపటికీ రవి బయటకు రాకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం పోలీసులు వచ్చి గాలింపు చర్యలు చేపట్టినా రవి ఆచూకీ తెలియలేదు.

News April 21, 2024

రాచర్ల: అమ్మ డబ్బులు ఇవ్వలేదని సూసైడ్

image

పురుగుమందు తాగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని గౌతవరంలో శనివారం జరిగింది. ఎస్సై హరిబాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటకిషోర్(39) తన కూతురు ఫంక్షన్ కోసం తల్లిని డబ్బులు అడిగారు. ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగారు. మార్కాపురం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

బల్లికురవ: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం

image

బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు జంక్షన్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. మృతుడు మండలంలోని కూకట్పల్లి గ్రామానికి చెందిన అంజయ్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 21, 2024

ప్రకాశం: చెవిరెడ్డి ఆస్తుల వివరాలివే

image

ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఆర్వోకు సమర్పించారు. 11 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. 2022-23లో వార్షిక ఆదాయం రూ.24,04,909గా చూపించారు. ప్రస్తుతం చేతిలో రూ.66 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.4.20 కోట్లు, చరాస్తులు రూ.118 కోట్లుగా చూపించారు.

News April 21, 2024

నీటి ఎద్దడి నివారణకు టోల్ ఫ్రీ నెంబర్: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కలెక్టరేట్ లో 9100121605 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాగర్ జలాలు ఈనెల 10న జిల్లాలోకి ప్రవేశించాయని, ఈ సాగర్ జలాలు వృథా కాకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైన ప్రజలు తాగునీటి సమస్య ఉందని ఫోన్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు.

News April 20, 2024

గిద్దలూరు: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

గిద్దలూరు మండలం తిమ్మాపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2024

మార్కాపురం: మరో జంట ఆత్మహత్య

image

మార్కాపురం మండలం పిచ్చిగుంట్లపల్లి గ్రామ శివారులో మరో ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతులు నారు వెంకట నాగేశ్వరి, జక్కుల గోపిగా స్థానికులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం యువతికి మరొకరితో వివాహం జరుగనుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడు గోపి అదే గ్రామంలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. 

News April 20, 2024

ప్రకాశం జిల్లాలో నేడు 14 నామినేషన్ల స్వీకరణ

image

జిల్లా వ్యాప్తంగా శనివారం ఒంగోలు పార్లమెంట్ స్థానానికి, మిగిలిన నియోజకవర్గాలకు 14 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రకటించింది. ఒంగోలు పార్లమెంటుకు 4 నామినేషన్లు, యర్రగొండపాలెంలో 1, దర్శికి 2, ఒంగోలుకు 1, కొండపికి 4, గిద్దలూరుకు 2 చొప్పున నామినేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు నామినేషన్ సమర్పిస్తున్న సందర్భంగా ఆయా కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.