Prakasam

News April 19, 2024

కనిగిరి: దద్దాలపై 420 కేసు

image

ప్రకాశం జిల్లాలో నామినేషన్ల పర్వం అట్టహాసంగా సాగింది. గురువారం బూచేపల్లి శివ ప్రసాద్, దద్దాల నారాయణ యాదవ్, మాగుంట శ్రీని వాసుల రెడ్డి నామినేషన్లు వేశారు. ఇందులో కనిగిరి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ నామినేషన్ అఫిడవిట్లో తనపై 420, 506 సెక్షన్లతో సహా పలు కేసులున్నట్లు పేర్కొన్నారు. అలాగే తన పేరిట రూ.70.33 లక్షలు, తన భార్య మంజు భార్గవి పేరిట రూ.62.03 లక్షల ఆస్తులున్నట్లు చూపారు.

News April 19, 2024

చీరాల: అనుమానంతో భార్యపై భర్త దాడి

image

నిత్యం అనుమానంతో వాలంటీరును వేధిస్తూ.. గృహ హింస పెడుతున్న భర్తపై ఈపూరుపాలెం పోలీస్ స్టేషన్‌లో గురువారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సునీత, వెంకటరావు భార్యాభర్తలు. సునీత వాలంటీరుగా పనిచేస్తుండగా.. వెంకటరావు మందుల దుకాణంలో పని చేస్తున్నారు. బుధవారం ఇంటికి వచ్చి భార్యపై భౌతిక దాడికి దిగాడు. గాయపడిన సునీత ఫిర్యాదు మేరకు వెంకటరావుపై గృహహింస కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News April 19, 2024

తొలి రోజు ప్రకాశం జిల్లాలో 13 నామినేషన్లు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం నుంచి జిల్లాలో నామినేషన్ లు ప్రారంభమయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో నలుగురు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 మంది నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. దర్శి అసెంబ్లీకి నలుగురు, ONG, కొండపి, గిద్దలూరు, కనిగిరి, SNపాడు నియోజకవర్గాలకు ఒక్కొక్కరు నామినేషన్ వేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. వైపాలెం, MRKP అసెంబ్లీకి నామినేషన్ దాఖలు కాలేదు.

News April 18, 2024

ప్రకాశం జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకునిగా దూకే బిస్వాస్

image

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాకు ఎన్నికల వ్యయ పరిశీలకునిగా దూకే బిస్వాస్ నియమిస్తూ ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఎన్నికల వ్యయ పరిశీలకులు దూకే బిస్వాస్ ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ ను కలిశారు. జిల్లాలో ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆయనకు సూచించారు.

News April 18, 2024

ఒంగోలు: ATM వ్యాన్ లో రూ.65 లక్షల నగదు చోరీ

image

ఒంగోలులో ATM కేంద్రాలకు నగదు తరలించే వాహనంలో రూ.65 లక్షల నగదు చోరీకి గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. సీఎంఎస్ ఏజెన్సీకి సంబంధించిన వాహన సిబ్బంది భోజనం కోసం కర్నూలు రోడ్డులో వాహనాన్ని నిలుపుదల చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనం తాళం పగలగొట్టి నగదు చోరీ చేశారు. దీంతో సమాచారం అందుకున్న ఏఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2024

ఒంగోలు పార్లమెంట్‌కు నామినేషన్ వేసిన క్రాంతి కుమార్

image

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రకాశం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఒంగోలు పార్లమెంట్ కు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బొడ్డు క్రాంతి కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేష్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈమేరకు కలెక్టర్ ఆ పత్రాలను పరిశీలించి ఆఫిడవిట్ అందజేశారు.

News April 18, 2024

గుడ్లూరు: చెట్టును ఢీ కొట్టిన కూలీల ఆటో

image

గుడ్లూరు మండలం పొట్లూరు సమీపంలో రహదారిపై వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొంది. గురువారం ఉదయం జరిగిన ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కావలి మండలం అన్నగానిపాలెంకు చెందిన కూలీలు గుడ్లూరు మిర్చి కోతలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు.

News April 18, 2024

నలుగురికే అనుమతి: ప్రకాశం SP

image

నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తామని ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పష్టం చేశారు. అభ్యర్థుల పీఎస్వోలను ఆర్వో కార్యాలయంలోకి అనుమతించబోమన్నారు. తుపాకులను వెంట తీసుకు వెళ్లరాదని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ర్యాలీలో టపాసులు కాల్చకూడదని చెప్పారు.

News April 18, 2024

ప్రకాశం జిల్లాలో నామినేషన్ కేంద్రాలు ఇవే..!

image

☞ ఒంగోలు MP: ఒంగోలు కలెక్టర్ ఆఫీసు
☞ ఒంగోలు MLA: ఒంగోలు RDO ఆఫీసు
☞ కనిగిరి MLA: కనిగిరి RDO ఆఫీసు
☞ మార్కాపురం MLA: ఉప కలెక్టర్ ఆఫీసు
☞ సంతనూతలపాడు MLA: చీమకుర్తి తహశీల్దార్ ఆఫీసు
☞ యర్రగొండపాలెం MLA: స్త్రీ శక్తి భవన్
☞ గిద్దలూరు MLA: గిద్దలూరు MRO ఆఫీసు
☞ కొండపి MLA: కొండపి MRO ఆఫీసు
☞ చీరాల MLA: చీరాల MRO ఆఫీసు
☞ పర్చూరు MLA: పర్చూరు RDO ఆఫీసు
☞ కందుకూరు MLA: సబ్ కలెక్టర్ ఆఫీసు

News April 17, 2024

కనిగిరి వ్యక్తికి యూపీఎస్సీ ఫలితాల్లో 504వ ర్యాంక్

image

కనిగిరికి చెందిన వంగిపురం రాహుల్ బుధవారం ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో 504వ ర్యాంక్ సాధించారు. తల్లితండ్రులు వంగేపురం రతన్ కుమార్, వయోల రాణి, పెద్ద కుమారుడు రాహుల్ 1 నుంచి 5 వరకు కనిగిరిలో, 6-10 తరగతులు ఒంగోలులో, విజయవాడలో ఇంటర్ చదివారు. మొదటి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించిన రాహుల్ కు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.