Prakasam

News April 5, 2024

అద్దంకిలో 21 మంది వాలంటీర్లు రాజీనామా

image

అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామానికి చెందిన 14 మంది వాలంటీర్లు, కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన 7 మంది వాలంటీర్లు శుక్రవారం రాజీనామా చేశారు. అనంతరం వారు అద్దంకిలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి హనిమిరెడ్డిని కలిసి తమ మద్దతు తెలియజేశారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సేవలు కొనసాగిస్తామని పలువురు వాలంటీర్లు తెలియజేశారు.

News April 5, 2024

ప్రకాశం: బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తి స్పాట్ డెడ్

image

బైక్‌‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మార్టూరు పట్టణంలోని సినీఫక్కీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరుకు వెళుతున్న కారు అతి వేగంతో ముందు వెళుతున్న బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చిలకలూరిపేటకు చెందిన నల్లజర్ల వేమయ్య (32)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

News April 5, 2024

చీమకుర్తి: బైకును ఢీకొన్న లారీ

image

చీమకుర్తి మండలం బుధవాడ గ్రామంలో నాయర్ పెట్రోల్ బంక్ వద్ద ఓ బైక్‌ను లారీ బలంగా ఢీకొన్న ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న రామస్వామి తలకు తీవ్ర గాయాలు కాగా, షేక్ రసూల్ కాలు విరిగింది. స్థానికులు వెంటనే 108 సహాయంతో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 5, 2024

కాంగ్రెస్ నుంచి చీరాల బరిలో ఆమంచి..?

image

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడినప్పటికీ నియోజకవర్గంలో క్రియాశీలక పాత్రను పోషించారు. వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో శుక్రవారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే చర్చ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎక్కడి నుంచి బరిలో నిలిచిన పోటాపోటీ తప్పదని పలువురు భావిస్తున్నారు. 

News April 5, 2024

గిద్దలూరు MLA అన్నా రాంబాబు పై కేసు నమోదు

image

గిద్దలూరు MLA అన్నా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాసప్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈక్రమంలో కార్యకర్తలకు స్థానిక కాలేజీ ఎదురుగా ఉన్న మైదానంలో నిబంధనలకు విరుద్ధంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఆర్.సంతోష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 5, 2024

ప్రకాశం: వ్యక్తి ఆత్మహత్య

image

సంతమాగులూరు మండలం పుట్ట వారిపాలెం గ్రామంలోని ప్రమీల సీడ్స్ యజమాని చిరుమామిళ్ల సురేంద్ర గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం దుకాణానికి వచ్చిన సురేంద్ర పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది గమనించిన షాపులోని గుమస్తా బాధితుడిని హుటాహుటీన నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సురేంద్రకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

News April 4, 2024

ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్

image

ప్రకాశం జిల్లా ఎస్పీగా 2015 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన సుమిత్ సునీల్ ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు రాత్రి 8 గంటలలోపు విధుల్లోకి చేరాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

News April 4, 2024

గెలిపిస్తే అభివృద్ధి చేస్తా: చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

image

ప్రకాశం జిల్లాలోనే తన సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటానని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం పీసీపల్లి మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా తనను గెలిపిస్తే పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు. కనిగిరి అభ్యర్థి దద్దాల నారాయణను ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

News April 4, 2024

ప్రకాశం: గుప్త నిధుల కోసం తవ్వకాలు

image

కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ పరిధిలోని అంబాపురం గ్రామ శివారులో పురాతనమైన అంబబాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో కొందరు దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేశారు. ఆలయం వెనక వైపు రాతి గోడలను ధ్వంసం చేశారు. గ్రామస్థులు గమనించి బుధవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్సై గోపాలకృష్ణ పరిశీలించారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

News April 4, 2024

కొత్తపట్నం: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

image

కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెంలో కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడేనికి చెందిన ఆర్.సంజీవ వర్మ (32) పల్లెపాలెంలోని ‘మీరాకి ‘ జంతు సంరక్షణ సంస్థలో మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు. స్నానానికి వెళ్లి స్విచ్ వేయగా, కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.