Prakasam

News April 4, 2024

పర్చూరులో జెండా పాతేది ఎవరు.?

image

పర్చూరు నియోజకవర్గంలో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది. ఏలూరి సాంబశివరావు 2014, 19 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. 2019లో కేవలం 1647 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, మరోసారి పోటీచేస్తూ హ్యట్రిక్‌పై కన్నేశారు. అటు ఎడం బాలాజీ 2019 చీరాల నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. మరోసారి చీరాల టికెట్ ఆశించగా కుదరక పర్చూరు నుంచి బరిలో ఉన్నారు. మొత్తం 2,25,770 ఓట్లలో మెజారిటీ ఓట్లు సాధించి ఎవరు గెలుస్తారో.?

News April 4, 2024

నో వైలెన్స్.. నో రీపోల్ లక్ష్యం: ప్రకాశం SP

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లాలో నో వైలెన్స్.. నో రీపోల్ లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన సింగరాయకొండ పోలీసు స్టేషన్ సందర్శించారు. ఈసందర్భంగా SP మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టనునట్లు తెలిపారు. పీఎస్ రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు.

News April 3, 2024

ఉలవపాడు: పోలీస్ తనిఖీల్లో పట్టుబడ్డ రూ.12 లక్షలు

image

ఉలవపాడు మండలం మన్నేటికోట జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద బుధవారం పోలీసుల తనిఖీలో నగదు పట్టుకున్నట్లు ఎస్ఐ బాజీరెడ్డి తెలిపారు. ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మప్ప అనే వ్వక్తి వద్ద రూ.12 లక్షల 23 వేల నగదును సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా అక్రమంగా డబ్బులు తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

News April 3, 2024

వై.పాలెం: కాంగ్రెస్‌లో చేరిన TDP మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి

image

యర్రగొండపాలెంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. బూదాల అజిత్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమె 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. బుధవారం తాడేపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో వైపాలెంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషిచేయాలని షర్మిల సూచించారు.

News April 3, 2024

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ SPగా నాగేశ్వరరావు

image

ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని బాధ్యతలు నుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఈ మేరకు జిల్లాలో ఏఎస్పీగా పని చేస్తున్న నాగేశ్వరరావుకు ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు రోజుల్లో జిల్లాకు నూతన ఎస్పీని నియమించనున్నట్లు సమాచారం. 

News April 3, 2024

అమెరికాలో పర్చూరు విద్యార్థి మృతి

image

అమెరికాలో జరిగిన రోడ్డు ‍ప్రమాదంలో పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్‌ (22) మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎంఎస్‌ చదివేందుకు గత ఏడాది డిసెంబరు చివరిలో రేవంత్ అమెరికా వెళ్లాడు. స్నేహితులతో కలిసి కారులో పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా పొగ మంచు కారణంగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరి యువకులకు స్వల్ప గాయాలు కాగా, రేవంత్ మృతి చెందాడు.

News April 3, 2024

ప్రకాశం: రూ.2.35 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

image

ప్రకాశం జిల్లా అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు రూ.2.35 కోట్ల విలువైన నగదు, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి(నిన్న బదిలీ) వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 18 అంతర్రాష్ర్ట సరిహద్దు చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరా, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి పటిష్ఠంగా తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న నగదు, మద్యం సీజ్ చేశారు.

News April 3, 2024

వ్యూహాత్మక పనులకు ప్రాధాన్యత ఇవ్వండి: ప్రకాశం కలెక్టర్

image

పూడికతీత పనులకు కాకుండా నూతన వ్యూహాత్మక పనులను చేపట్టడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరమంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనులపై మంగళవారం డ్వామా కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పొలాలలో ఇంకుడు గుంతలు, కాలువ గట్లపై మొక్కలు నాటడం, కల్చర్ ప్లాంటేషన్ వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

News April 3, 2024

ఒంగోలు: సైబర్ మోసాల పట్ల అప్రమత్తత తప్పనిసరి

image

సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డి సూచించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా ప్రముఖుల ప్రొఫైల్ పిక్ తో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ కొత్త రకం మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఓ ప్రకటన విడుదల చేశారు.

News April 2, 2024

ప్రకాశం: వాహన తనిఖీల్లో రూ.3.20 లక్షలు సీజ్

image

చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద ఎస్సై శ్రీనివాసరావు మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒంగోలు నుంచి చీరాల వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. సరైన బిల్లులు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.3.20 లక్షల నగదును పట్టుకున్నారు. అనంతరం ఫ్లయింగ్ స్కాడ్‌తో కలిసి నగదును జిల్లా గ్రీవెన్స్‌కు అప్పగించారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు.